India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్రావు పల్లి జాతీయ రహదారిలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దెగ్లూర్ పట్టణానికి చెందిన ఫిజొద్దీన్ (22), అబ్దుల్ రజాక్ (22)కు గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వారిని హైవే అంబులెన్స్లో పిట్లం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ ఘటన మాక్లూరు మండలం ఒడ్యాట్పల్లిలో జరిగింది. మృతిచెందిన వారు తిరుపతి, మహేశ్, నవీన్గా గుర్తించారు. ప్రమాదం నుంచి మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్లో నిన్న అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కిటికీ తొలగించి ఇంట్లో చొరబడిన దొంగలు బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో కుటుంబీకులు ఇంట్లోనే ఉండడం గమనార్హం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి ఓ పడక గదిలో నిద్రించగా.. మరో గదిలోని కిటికీని ధ్వంసం చేసి 30తులాలకు పైగా బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షలు నగదు చోరీకి గురైంది.
నవీపేట మండలం జన్నేపల్లి వాసి మక్కల సాయిలు అనుమానాస్పదంగా మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సాయిలు(45)కి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. సాయిలు తాగి భార్యతో తరచూ గొడవ పడేవారు. గురువారం రాత్రి భోజనం చేసి పడుకున్న సాయిలు అక్కడే చనిపోయారు. కాగా తన కొడుకు సాయిలు ఒంటిపై గాయాలు ఉన్నాయని, కోడలు రేఖనే చంపి ఉంటుందని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ సతీశ్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నిజామాబాద్ జిల్లా అధికారులు ఓటరు నమోదుపై దృష్టి పెట్టారు. నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు నామినేషన్ల స్వీకరణకు ఇప్పటికే చర్యలు చేపట్టిన అధికారులు ఇంకా మూడు రోజులే నమోదుకు సమయం ఉండటంతో యువతకు అవగాహన కల్పిస్తున్నారు. పోలింగ్ బూత్ల ఆధారంగా ఓటరు నమోదుకు చర్యలు చేపడుతున్నారు. ఈనెల 15 వరకు ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని రైల్వే గేటు వద్ద నిజామాబాద్- బోధన్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ధ్వంసమైన వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నట్టు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. అన్న మదర్ థెరిస్సా వ్యాఖ్యలను అక్షరాల నిజం చేస్తున్నారు ఓ విశ్రాంత ఉద్యోగి. నిజామాబాద్ వినాయకనగర్కు చెందిన విశ్రాంత ఉద్యోగి అందే జీవన్ రావ్ అంతరించిపోతున్న పక్షులను సంరక్షించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. తన ఇంట్లోనే ఆవాసాలు ఏర్పాటు చేశారు. వేరే ప్రాంతాల్లో పక్షులు వదిలిపెట్టిన గూళ్లను తీసుకొచ్చి.. తన ఇంట్లోని చెట్ల కొమ్మలకు ఏర్పాటు చేశారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జక్రాన్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు.. కలిగోట్ గ్రామానికి చెందిన శేఖర్(32) నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు చేపలు పట్టేందుకు గ్రామంలోని కుమ్మరి కుంటకు వెళ్లాడు. చెరువులో ఉన్న వల తట్టుకొని మునిగిపోయాడు. నేడు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశామన్నారు.
నిజామాబాద్ నగరంలో పోలీసులు శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు సీజ్ చేశారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యంలో ఎల్లమ్మగుట్ట సమీపంలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి సరైన పత్రాలు చూపకుండా తరలిస్తున్న రూ. 7,21,587 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్నికల గ్రీవెన్స్ కమిటీకి నగదును అందజేశారు. ఈ తనిఖీల్లో నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్, ఏఎస్సై రామకృష్ణ, సిబ్బంది రమేష్, అనిల్, మనోజ్ పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ స్కూటర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మాయాబజార్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటీపై ఓ వ్యక్తి వెళ్తుండగా అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్కూటీని నిలిపివేశారు. అనంతరం ఒక్కసారిగా స్కూటీలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
Sorry, no posts matched your criteria.