India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డిలో చోటుచేసుకుంది. గూడెం గ్రామానికి చెందిన ప్రశాంత్ (28) తాడ్వాయి MRO ఆఫీస్లో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కాగా డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్ వేధింపులు భరించలేక చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు DSP నాగేశ్వరరావు తెలిపారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల పక్కన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు శనివారం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. స్టేషన్ మాస్టర్ సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను గుర్తించారు. వారు గుర్తు తెలియని రైలు నుంచి పడి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతల వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లులో శనివారం ఉదయం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ డీటీ నిఖిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి సుమారు 80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు డీటీ వివరించారు.
నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కింద పడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లమ్మ గుట్టకు చెందిన గుమ్మడి దార్ల సంపత్ కుమార్ (నంబర్ 413) శనివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన గాంధారి మండలం నేరల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్ (27) ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదని స్టూల్ వేసుకొని మరమ్మతులు చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు చేతి వేలికి విద్యుత్తు షాక్ తగలడంతో పక్కన ఉన్న గోడపై పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆయన మృతి చెందాడు.
ఎడపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఠాణాకలాన్కు చెందిన నవదీప్(14) మెడకు ప్రమాదవశాత్తు చీర చుట్టుకోవడంతో మృతి చెందాడని SI వంశీకృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. నవదీప్ సామాన్లు సర్దేందుకు చీర సాయంతో సజ్జపైకి ఎక్కాడు. దికే క్రమంలో ప్రమాదవశాత్తు చీర మెడకు చుట్టుకుని ఉరిపడింది. బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
కమ్మర్పల్లికి చెందిన DSC అభ్యర్థిని శ్రీలాస్య సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసింది. అయితే తెలుగు, ఇంగ్లిష్ పోస్టులు వేర్వేరుగా ఉండటంతో రెండింటికి దరఖాస్తు చేసింది. ఈనెల 30న ఉ.9 గంటలకు మహబూబ్ నగర్ (TL), మ.2 గం హనుమకొండలో (EN) కేటాయించారు. దీంతో ఆమె పరీక్ష ఎక్కడ రాయాలో సందిగ్దంలో పడింది. కాగా దీనిపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. రెండు పరీక్షలు ఒకే చోట రాయోచ్చని తెలిపింది.
మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమంతో వివిధ యూనిట్ల స్థాపన కోసం పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపికలో వివక్షను ప్రదర్శిస్తూ పొరపాట్లకు ఆస్కారం కల్పిస్తే, సంబంధిత ఏపీఎంలను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టియు & అనుబంధ కళాశాలలో ఈనెల 15 నుండి ప్రారంభమయ్యే పీజీ IV సెమిస్టర్ పరీక్షలు డిఎస్సీ, గ్రూప్-2 పరీక్షల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఏపిఈ, ఐపిసిహెచ్, ఐఎంబీఏ, రెగ్యులర్, బ్యాక్లాగ్, ఎంబీఏ, ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
బిజెపి విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్లోని ఓ కన్వెన్షన్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కాగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, జిల్లా అధ్యక్షుడు దినేష్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.