Nizamabad

News April 10, 2024

తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా వినోద్ నాయక్

image

నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సిరికొండ మండల్ హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వినోద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాదులోని నాచారంలో నిర్వహించిన రాష్ట్ర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్ ను అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు క్రీడా ప్రతినిధులు అభినందనలు తెలిపినారు.

News April 9, 2024

బీజేపీలో చేరిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే

image

ఉమ్మడి జిల్లాలో మరో నేత బీజేపీలో చేరారు. నేడు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డా.లక్ష్మణ్ సమక్షంలో ఆయన చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బిబి పాటిల్, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, ఎల్లారెడ్డి మాజీ MLA నేరేళ్ల ఆంజనేయలు బీజేపీలో చేరారు.

News April 9, 2024

బీజేపీలో చేరిన ఎల్లారెడ్డి మాజీ MLA

image

మాజీ మంత్రి, ఎల్లారెడ్డి మాజీ MLA నేరేళ్ల ఆంజనేయలు మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, MP లక్ష్మణ్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. ఆయనతోపాటు మాజీ ZPTC తానాజీ రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

News April 9, 2024

NZB: దొంగ అనుకొని చెట్టుకు కట్టేశారు..!

image

మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగగా భావించి పోలీసులకు అప్పగించిన ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీలో చోటు చేసుకుంది. నిజామాబాద్ గాజుల్ పేటకు చెందిన గుండమల్ల గంగాధర్ ఎలుకుర్తి హవేలిలో అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో గ్రామస్థులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు వచ్చి అతన్నిపోలీస్ స్టేషన్ తరలించారు. గంగాధర్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

News April 9, 2024

కామారెడ్డి: బస్సు ఢీకొని MBA విద్యార్థి మృతి

image

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డికి చెందిన ఆకుల అరుణ్ (23) మృతి చెందాడు. అరుణ్ గీతం యూనివర్సిటీలో ఎంబీఏ చదుతున్నాడు. కాగా నిన్న సాయంత్రం స్నేహితుడి వద్ద ఉన్న ల్యాప్‌టాప్ తీసుకుని వెళ్తుండగా ఓ పరిశ్రమకు చెందిన బస్సు అతని బైకును ఢీకొట్టింది. దీంతో అరుణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. పఠాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 9, 2024

బోధన్: ‘కుట్రపూరితమైన స్వార్థ రాజకీయాలు చేసేది బీజేపీ’

image

బోధన్ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కుట్రపూరితమైన స్వార్థ రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ అని.. కుల మత విభేదాలు లేకుండా నాయకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గెలుపు ఓటమిలు కార్యకర్తల లక్ష్యాన్ని బట్టి ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నాయకులు ఉన్నారు.

News April 8, 2024

NZB: గోదావరి నదిలో దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

గోదావరి నదీలో దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాగపూర్ గ్రామానకి చెందిన సూర్యతేజ (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసి నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన యువకుడు యంచ పరిధిలోని గోదావరిలో నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18 నుంచి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. తన ఛాంబర్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల సమయంలో నామినేషన్లను అందించాల్సి ఉంటుందని తెలిపారు. సెలవు రోజు ఆదివారం మినహాయించి, మిగితా అన్ని పని దినాలను కలుపుకుని, తుది గడువు అయిన ఈ నెల 25 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయన్నారు.

News April 8, 2024

HYDలో యాక్సిడెంట్.. NZB జిల్లా విద్యార్థి మృతి

image

HYD శివారు కీసర పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజాబాబాద్‌కి చెందిన అనిరుద్ CMR కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో కీసర పరిధి కుందన్‌పల్లి-గోధుమకుంట మార్గంలో ఓ ఆటో ట్రాలీ, బుల్లెట్ బైక్ ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. హెల్మెట్ లేకపోవడంతో అనిరుధ్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గాంధీకి తరలించారు.

News April 8, 2024

NZB: KTR కు మాజీ ఎమ్మెల్యే కౌంటర్

image

చేనేత కార్మికుల ఆత్మహత్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ మాజీ MLA ఈరవర్తి అనిల్ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మూడో సారి అధికారం వస్తుంది.. ముఖ్యమంత్రి పదవి మూడడుగుల దూరంలో ఉందని అత్యాశకు పోయిన కల్వకుంట్ల డ్రామారావుకు ప్రజలు తమ తీర్పుతో మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారని అన్నారు. అందుకే పిచ్చి ప్రేలాపనలు, తుగ్లక్ ఆక్రందనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.