India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన NZB జిల్లాలోని సాలూరాలో చోటుచేసుకుంది. మండలానికి చెందని గాదే మనోజ్(23), గోరంట్ల మనోజ్(19) శనివారం సాయంత్రం చెరువులోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు మునిగిపోగా అతడిని కాపాడే క్రమంలో మరో యువకుడు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు, పురుషులకు పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్త తెలిపారు. ఇందుకోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు డిచ్పల్లి SBI స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగిరెడ్డిపేట మండలం బంజర తండా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా తండాకు చెందిన ధరావత్ వినోద్, అరుణ (32)లకు ముగ్గురు కుమారులున్నారు. భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడుతుండేవారు. కుటుంబీకులు నచ్చచెప్పాలని ప్రయత్నించినా వినకుండా క్షణికావేశంలో అరుణ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలోని ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో సీఐ రవికుమార్ దర్యాప్తు చేపట్టారు. బాలికను బెదిరించి అత్యాచారం చేయడంతో ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి అని తెలిసింది. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
బీజీపే ఆవిర్భావ దినోత్సం సందర్భంగా బిచ్కుందకు చెందిన ఆర్టీస్ట్ బాలకిషన్ ఆ పార్టీకి చెందిన లోగో రావి ఆకుపై వేశాడు. దాన్ని కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతారకు బిచ్కుంద బీజేపీ కార్యాలయంలో అందజేశారు. వినూత్నంగా రావి ఆకుపై ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం పట్ల అరుణతార.. ఆర్టిస్ట్ను అభినందించారు. ఇందులో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించేలా హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి విషయం చెప్పింది. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.
ఉమ్మడి NZB జిల్లా రోజు రోజుకు నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మధ్యాహ్నం వేళ జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు NZB జిల్లా డిచ్పల్లి (మం) కొరట్పల్లిలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. KMR జిల్లా నిజాంసాగర్ (మం) హాసన్ పల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ప్రాచీన కట్టడాలను పునరుద్ధరించడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేటలోని పురాతన మెట్ల బావిని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురాతన బావిలో పూడిక తీస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. యువకులు శ్రమదాన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు.
అర్వింద్ ఎంపీగా ఉండి జిల్లాకు చేసింది శూన్యమని బాజిరెడ్డి అన్నారు. ఆయనపై ఏడు సెగ్మెంట్ల ప్రజలు గుర్రుగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి.. రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. అప్పుడేమో బాండ్ పేపర్ చూపించి ఓట్లు దండుకున్న అర్వింద్ మళ్లీ ఇప్పుడు ఇటీవల ఏదో జీవో కాపీ తీసుకువచ్చి ఎంపీగా గెలిపించాలని ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమన్నారు.
పొతంగల్లో అన్నను తమ్ముడు <<12993064>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గోవింద్, విఠల్ అన్నాదమ్ములు. విఠల్ తరచూ తన భార్యతో గొడవపడుతుండడంతో అన్న మందలించేవాడు. ఈక్రమంలో గోవింద్పై కక్షపెంచుకున్నాడు. గురువారం ఇంటికి వచ్చిన అన్నను విఠల్ గొడ్డలితో నరికి హతమార్చాడు. మృతుడి భార్య విఠల్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.