India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 19,306 ఇళ్లను కేటాయించాలని లక్ష్యం కాగా 17,291 ఇళ్లు మంజూరు చేశామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఈరోజు తెలిపారు. వాటిలో 9,360 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, 5,541 నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. వీటిలో 4,647 ఇళ్లు బేస్మెంట్ దశలో, 665 ఇళ్లు గోడల దశలో, 229 గృహాలు స్లాబ్ లెవెల్లో ఉన్నాయని కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో వివరించారు.

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేషుగ్గా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డీ వీపీ.గౌతమ్ బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి, డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఏదైనా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, అలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. బుధవారం వేల్పూర్ PHCని తనిఖీ చేసి ఆయన మాట్లాడారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు వంటివి చోటుచేసుకోకుండా గట్టి నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు.

నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం వేల్పూర్ ZPHSను తనిఖీ చేసిన ఆయన పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నేషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.

మోపాల్ మండలం బైరాపూర్లో రమావత్ ప్రకాశ్ అనే రైతు పొలంలో నిన్న అటవీ అధికారులు మొక్కజొన్న పంటను నాశనం చేశారని, దీంతో బాధిత రైతు గడ్డిమందు తాగాడని బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఈరోజు FRO రాధికకు ఫిర్యాదు చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ప్రకాశ్కు పోడు పట్టాను అందజేసి, ఆయనపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి రమావత్ ప్రకాశ్ను పరామర్శించారు.

ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోన్న యూరియాను వ్యవసాయేతర పనులకు వాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ స్పష్టం చేశారు. ఎడపల్లి మండలం పోచారంలో గల పౌల్ట్రీ ఫారంను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పౌల్ట్రీ ఫారంలో యూరియాను వాడుతున్నారా అనే అంశంపై ఆరా తీశారు. వ్యవసాయేతర పనులకు యూరియాను వినియోగిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తోందని సాంస్కృతిక విప్లవంతో పాటు సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.

నిజామాబాద్లోని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు డీసీపీ బస్వారెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. 1934 ఆగస్టు 6న వరంగల్లోని ఆత్మకూరు మండలం, అక్కంపేటలో జయశంకర్ జన్మించారన్నారు. ఆయన జీవితం తెలంగాణకు అంకితం చేశారన్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా ఇన్ ఫ్లో మరింతగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్ట్లోకి 4,022 క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు 2,620 క్యూసెక్కుల నీరు వస్తోందని చెప్పారు. ప్రాజెక్ట్ ఔట్ ఫ్లో 793 క్యూసెక్కులుగా ఉంది. 1,078.30 (40.582TMC) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లాలో భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ఆర్డీఓలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ డిచ్పల్లి నుంచి వీసీలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.