India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ చిన్నారిని విక్రయించిన కేసులో ఇద్దరు డాక్టర్లతో పాటు పలువురిని శనివారం అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తండ్రి కొడుకులైన ఇట్టం సిద్దిరాములు, ఇట్టం ప్రవీణ్ కుమార్తో పాటు ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, ఆస్పత్రి వాచ్మెన్ బాలరాజు, పాప తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్య, భూపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు.
రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ శనివారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)ను సందర్శించారు. ఆయన ఆస్పత్రిలోని పలు వార్డులను సందర్శించి తగిన సూచనలు అందజేశారు. కాగా ఆసుపత్రికి కావలసిన అవసరాల గురించి GGH సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ కర్ణన్ దృష్టికి తీసుకెళ్లారు, దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.
జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం ఓ ప్రకటనలో తెలిపారు
ఒంటిపై వేడి నీళ్లు పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన బోధన్లో జరిగింది. సాలూరకు చెందిన లక్ష్మీ బాయ్(71) జూన్ నెల 28న హున్సాలోని కూతురు ఇంటికి వెళ్లింది. బాత్రూమ్కు వెళ్తుండగా నీళ్ల బకెట్ తగలడంతో నీళ్లు ఒంటిపై పడి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం NZB ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI నాగనాథ్ తెలిపారు.
ఇంజినీరింగ్లో ప్రవేశాలకు సంబంధించి శనివారం తొలివిడత ధ్రువపత్రాల పరిశీలన నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించనున్నట్లు కౌన్సెలింగ్ సమన్వయకర్త శ్రీరాంకుమార్ తెలిపారు. ఈ నెల 13వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థులు ఈనెల 12 వరకు స్లాట్ బుక్ చేసుకోవాలని, ఈ నెల 8 నుంచి 10 వరకు వెబ్ఆప్షన్స్ పెట్టుకోవచ్చన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
జిల్లాలోని నవీపేట మండలం కమలాపూర్, మోకన్ పల్లి శివారులో శుక్రవారం చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన గాంధీ తన మేకలను తీసుకొని గుట్టకు వెళ్లాడు. సాయంత్రం చిరుత తన మందపై దాడి చేసినట్లు రైతు పేర్కొన్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో NZB బీట్ ఆఫీసర్ సుధీర్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ జహుర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరత సంచారం నిజమేనని వెల్లడించారు.
ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. నిజామాబాద్కి చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవ పడి మనస్తాపంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లలను గోదావరిలో తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు చూసి అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా బాసర ఎస్ఐ గణేశ్ వారిని స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
రైతుపై కత్తులతో దాడి చేసిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తనూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పర్వతరావు (62) గురువారం పంటచేనులో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అతడు పరుగెత్తి సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. దాడికి గల వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ఈ నెల 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనుంది. బాక్సింగ్లో 50 కేజీల విభాగంలో ఆమె చోటు దక్కించుకొంది. కాగా జిల్లా నుంచి ఒలింపిక్స్లో చోటుసాధించిన మొదటి క్రీడాకారిణిగా నిఖత్ చరిత్ర సృష్టించారు. నిఖత్ 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది.
నిజామాబాద్ జిల్లా మ్యాట్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రెటరీ దేవేందర్ తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో గల రెజ్లింగ్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. పురుషులకు ఫ్రీ స్టైల్ విభాగంలో, గ్రీకో రోమన్ విభాగంలో, అదేవిధంగా మహిళలకు ఫ్రీ స్టైల్ లో కేటాయించిన కేటగిరీలలో ఎంపికలు ఉంటాయన్నారు.
Sorry, no posts matched your criteria.