Nizamabad

News July 5, 2024

NZB: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇందల్‌వాయి మండలం గౌరారంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాలు.. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తూ జీవించే పరమేశ్వర్ వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా 11 కేవీ వైరు తగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ తెలిపారు.

News July 5, 2024

KMR: ఆరు నెలల్లో 4106 కేసులు నమోదు

image

పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీ చేస్తూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నా వాహన చోదకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఆరు నెలల వ్యవధిలో 4106 కేసులు నమోదయ్యాయి. వీరిలో 58 మందికి జైలు శిక్షలు విధించారు. కేసులు నమోదైన వారందరికీ జరిమానాలు విధించారు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన అక్రమంగా మద్యం అమ్మకాలు జరగడమే. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

News July 5, 2024

ధర్మపురి సంజయ్‌ను పరామర్శించిన ప్రశాంత్ రెడ్డి

image

దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌ను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. గురువారం నిజామాబాద్‌లోని ఆయన ఇంటికెళ్లిన వేముల ధర్మపురి సంజయ్‌ను పరామర్శించారు. అనంతరం డీ. శ్రీనివాస్ మృతిపై వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వారితో పాటు ఇతర నాయకులు ఉన్నారు.

News July 4, 2024

రెంజల్: జలకళ సంతరించుకున్న త్రివేణి సంగమం

image

రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. వానా కాలం ప్రారంభంలో సరైన వర్షాలు లేక నదులు, నీరు లేక చెరువులు వెలవెలబోయాయి. అయితే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పాటు జులై 1న బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి దిగువకు నీరు వదలడంతో గోదావరికి వరద నీరు వస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు.

News July 4, 2024

కామారెడ్డి: ఇంటర్‌లో ప్రవేశాలకు జులై 31 వరకు గడువు

image

ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు జులై 31 వరకు గడువు పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జూన్ 30తో ముగిసిన గడువును సప్లిమెంటరీ విద్యార్థుల కోసం జులై 31 వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో 1,700 మంది విద్యార్థులు చేరినట్లు పేర్కొన్నారు.

News July 4, 2024

NZB: స్నేహితుడి ఇంట్లో చోరీ.. ఆపై వారితోనే వెళ్లి PSలో ఫిర్యాదు

image

ఓ బాలుడు స్నేహితుడి ఇంట్లో చోరీ చేసి వారితోనే PSలో ఫిర్యాదు చేసిన ఘటన NZBలో జరిగింది. బొబ్బొలి వీధికి చెందిన మాధవి ఇంటి మరమ్మతులు చేసినందుకు ఆమె కుమారుడి ఫ్రెండ్‌కి కొంత డబ్బు ఇచ్చింది. కాగా ఆ బాలుడు వారి ఇంట్లో జూన్ 27న రూ.2.20లక్షలు చోరీ చేశాడు. ఈనెల 2న బీరువాలో డబ్బు కనిపించకపోవడంతో మాధవి వారిద్దరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని నింధితుడిగా గుర్తించారు.

News July 4, 2024

కామారెడ్డి: ప్రేమ పేరుతో మోసం.. పోక్సో కేసు నమోదు

image

యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన లింగంపేట్‌లో చోటు చేసుకుంది. పరిమళ గ్రామానికి చెందిన ఓ బాలికకు మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన భాస్కర్‌(24)తో ఇన్‌స్టాలో పరిచయమైంది. దీంతో అమ్మాయికి మాయ మాటలు చెప్పి ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు తెలిపారు.

News July 3, 2024

టీయూలో పీజీ చేస్తూ.. ఎస్బీఐలో ఉద్యోగం

image

టీయూలో ఎంఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ధర్మపురి సాయికుమార్ ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించడం అభినందనీయమని ఎకనామిక్స్ విభాగాధిపతి డా.పున్నయ్య పేర్కొన్నారు. అధ్యాపకుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా సాయికుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. డా.సంపత్, డా.నాగరాజు, డా.స్వప్న, డా.శ్రీనివాస్, డా.దత్తహరి విద్యార్థులు పాల్గొన్నారు.

News July 3, 2024

కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

image

కామారెడ్డి జిల్లాలో మంగళవారం కురిసిన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో ఇలా ఉన్నాయి. పిట్లంలో12.5, సదాశివనగర్‌లో 10.8, లింగంపేటలో 10.3, బిక్కనూరులో 10, నిజాంసాగర్‌లో 9.5, కామారెడ్డిలో 9.3, మద్నూర్లో 8.5, రాజంపేటలో 7.3, గాంధారి, బాన్సువాడలో 5.5, నిజాంసాగర్‌లో 5.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసిందని జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి రాజారాం తెలిపారు.

News July 3, 2024

NZB: ‘పదెకరాల్లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వండి’

image

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం చేపట్టనున్న రైతుభరోసా పథకంపై రైతుల సూచనలు కోరుతోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇప్పటివరకు 60 సంఘాల్లో మీటింగ్స్ నిర్వహించారు. 29 సంఘాల్లో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న అభిప్రాయాల్లో 60 శాతం మంది 10ఎకరాల లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వాలని చెబుతున్నారు. గుట్టలు, బీడు భూములకు ఇవ్వొదని కోరుతన్నారు.

error: Content is protected !!