Nizamabad

News March 26, 2024

నిజామాబాద్: మట్టి కుండ.. సల్ల గుండ

image

వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగించే మట్టి కుండలకు ట్యాప్‌ (నల్ల) ఏర్పాటు చేసి NZB జిల్లా కేంద్రంలో విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ఈ కుండలు లభిస్తున్నాయి. వివిధ సైజులు, ఆకృతులను బట్టి విటి ధర నిర్ణయించబడి ఉంది. వేసవిలో పేదవాడి ఫ్రిజ్‌గా చెప్పుకునే వీటికి సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉంది. ఎర్రటి మట్టి కుండలోని చల్లటి నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు

News March 26, 2024

ఎల్లారెడ్డిలో బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్ వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు మహమ్మద్ నగర్ మండలం అసన్ పల్లికి చెందిన కురుమ ప్రశాంత్ (23)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 26, 2024

కామారెడ్డిలో యువకుడి దారుణ హత్య

image

కామారెడ్డి మండలం రామేశ్వర్ పల్లి, ఆరేపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఈరోజు ఉదయం గుర్తించారు. అతడు సోమవారం రాత్రి హత్యకు గురైనట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

కామారెడ్డి చరిత్రలో తొలిసారి ‘అవిశ్వాసం’

image

కామారెడ్డి మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారి అవిశ్వాస తీర్మానానికి తెరలేచింది. ఈ నెల 30న తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఐదేళ్ల కింద BRS అధికారంలోకి రాగా ఛైర్‌పర్సన్ పదవిని అదే పార్టీకి చెందిన వ్యక్తికి కేటాయించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సభ్యులు అవిశ్వాస ప్రక్రియకు సిద్ధమయ్యారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 27 మంది, BRS నుంచి 8 మంది సభ్యులు శిబిరానికి వెళ్లినట్లు సమాచారం.

News March 26, 2024

నేడే నిజామాబాద్ DCCB ఛైర్మన్ ఎన్నిక

image

నిజామాబాద్ DCCB ఛైర్మన్ ఎన్నిక ఈరోజు జరగనుంది. ఈ ఎన్నిక కోసం సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు మొత్తం 21 మంది సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ రమేశ్ రెడ్డికే పట్టం కట్టేందుకు సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 21న మాజీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయిన విషయం తెలిసిందే.

News March 25, 2024

నిజామాబాద్: పడిపోయిన పసుపు ధరలు

image

నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అల్‌టైం రికార్డు ధర పలికిన పసుపు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. పది రోజుల క్రితం గరిష్ఠంగా రూ.18,299 పలికిన పసుపు రూ.1,500 వరకు తగ్గడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మార్కెట్‌లో పసుప ధర గరిష్ఠంగా క్వింటాలుకు రూ.16,666 ఉంది. దానికి తోడు ఈ నెలాఖరు వరకు రెండు రోజులు మాత్రమే పసుపు కొనుగోళ్లు సాగుతాయని మార్కెట్ అధికారులు వెల్లడించారు.

News March 25, 2024

నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న హోళీ సంబురాలు

image

నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా హోళీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి శాస్త్రోక్తంగా కామదహనం కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం నుండి పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వేడుకలు జరుపుతున్నారు. అలాగే వివిధ సంఘాలు, యూనియన్ల ఆధ్వర్యంలో హోళీ సంబురాలు నిర్వహిస్తున్నారు.

News March 25, 2024

ఒకప్పటి నిజామాబాద్ కలెక్టర్..ఇప్పుడు MLA అభ్యర్థి

image

ఒకప్పుడు నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన దేవ వరప్రసాద్‌ ఈసారి ఏపీలో MLA అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేవ వరప్రసాద్‌కు టికెట్ ఖరారు చేశారు. 2021లో జనసేన జనవాణి విభాగం కన్వీనర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. గతంలో పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరక్టర్, అబ్కారీ శాఖ డైరక్టర్‌గా ఆయన సేవలందించారు.

News March 25, 2024

నిజామాబాద్: అమ్మాయి కోసం యువకుల గొడవ

image

ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన HYDఅమీర్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్‌ వాసులు నితిన్‌, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వెళ్లింది. అక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్‌ను పిలిపించి దాడి చేశాడు.

News March 25, 2024

నిజామాబాద్‌లో మాయమాటలు చెప్పి లక్ష మాయం

image

నిజామాబాద్ పెద్ద బజారులోని లక్ష్మీనరసింహ కిరాణ దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి తాను ICICI బ్యాంక్ ఉద్యోగినంటూ యాజమానిని నమ్మించాడు. కరెంట్ అకౌంట్‌తో పాటు క్యూఆర్ కోడ్ అప్డేట్ చేయాలని చెప్పి, ఆధార్, పాన్ కార్డ్ వివరాలు అడిగాడు. యాప్ డౌన్లోడ్ చేస్తానని నమ్మించి ఫోన్ తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.లక్ష మాయమైనట్టు గుర్తించిన బాధితుడు రాజ్ కుమార్ 2వ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు