Nizamabad

News September 2, 2024

NZB: ఆ పథకం అమలుపై షబ్బీర్ అలీ సమీక్ష

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో అటల్ మిషన్ ఫర్ రిజువేనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అమలుపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సోమవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు.

News September 1, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచికొట్టిన వాన *NZB, KMR ప్రాజెక్టులకు పోటెత్తిన వరద *NZB రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి *KMR డెంగ్యూతో వ్యక్తి మృతి *ACBకి పట్టుబడ్డ ఇన్‌ఛార్జ్ అర్వో నరేందర్ సస్పెండ్ *బిక్కనూర్ వరద నీటిలో చిక్కిన వారిని కాపాడిన పోలీసులు *డిచ్పల్లి: వివాహితది ఆత్మహత్య కాదు.. హత్య *బాన్సువాడ ప్రేయసిన హత్య చేసిన ప్రియుడు.

News September 1, 2024

బాన్సువాడ: ప్రేమించిన అమ్మాయిని హత్య చేసిన ప్రియుడు

image

నర్సు కేసును బాన్సువాడ పోలీసులు చేదించారు. టౌన్ సీఐ కృష్ణ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. బీర్కూర్ మండలం బరంగెడ్దికి చెందిన మమత, ప్రశాంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని మమత ఒత్తిడి తేవడంతో ప్రశాంత్ గురువారం ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. అతడిపై కేసు నమోదు చేశామన్నారు.

News September 1, 2024

ఈ నంబర్‌లకు ఫోన్ చేయండి: కామారెడ్డి SP

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100, 87126 86133కు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందవచ్చని కామారెడ్డి జిల్లా SP సింధూ శర్మ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అలాగే వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News September 1, 2024

భారీ వర్షాలు.. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు వద్ద ఇదీ పరిస్థితి..!

image

రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటలకు 35,417 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లో గా 825 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMCలకు గాను, ప్రస్తుతం 62.144 TMCల నీరు చేరినట్లు చెప్పారు.

News September 1, 2024

నిజామాబాద్: ముగ్గురు విద్యార్థినులు మృతి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినుల మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నస్రుల్లాబాద్ మండలంలో విద్యుదాఘాతంతో విద్యార్థిని స్వాతి(18) మృతి చెందింది. కాగా స్వాతి ఇటీవల ఇంటర్ పూర్తి చేసింది. బాన్సువాడలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న అంజలి (12) జ్వరం, వాంతులతో మృతి చెందింది. రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని (15) ఉరేసుకుంది.

News September 1, 2024

NZB: ‘సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి’

image

సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీల కార్యదర్శులతో సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా డెంగీ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 31, 2024

కేసీఆర్‌పై మీరెన్ని మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మేసినట్టే: వేముల

image

తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసిఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేసీఆర్ పై మీరెన్ని మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మేసినట్టే అన్నారు. కేసీఆర్‌ను డెకాయిట్ అనడం ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

News August 31, 2024

BREAKING: కామారెడ్డి జిల్లాలో విషాదం

image

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లిలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. భారీ వర్షానికి ఇంటి వెనుక ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో ఇంటిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కాగా ఇంట్లో ఉన్న డిగ్రీ విద్యార్థిని స్వాతి(18) కరెంట్ షాక్‌తో మృతిచెందింది. తీగలు తెగి పడడంతో రేకుల ఇంటికి కరెంట్ పాసైంది. స్వాతి.. ఇంటి తలుపులు ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి చనిపోయింది.

News August 31, 2024

NZB: భారీ వర్షం.. రోడ్డుపై విరిగి పడిన చెట్టు..

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా అంతటా తడిసి ముద్దైంది. వర్షం ధాటికి కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దేల్‌చెరువు- బాన్సువాడ ప్రధాన రహదారిపై ఓ భారీ వృక్షం విరిగి నేలకొరిగింది. బాన్సువాడ నుంచి పిట్లం, బిచ్కుంద మండలాలకు రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.