Nizamabad

News March 20, 2024

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ముగ్గురికి 2 రోజుల జైలు

image

మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జడ్జి ఖదీర్ బుధవారం తీర్పునిచ్చారని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. పట్టణంలో మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 9 మంది పట్టుబడగా అందులో పఠాన్ షేర్ ఖాన్, సిర్నాపల్లి భూమేశ్, పెందోట రవి కుమార్‌లకు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News March 20, 2024

కామారెడ్డి: మహిళ టీచర్‌కు షోకాజ్ నోటీస్ 

image

ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన బిచ్కుంద మండల ప్రజా పరిషత్ పాఠశాల సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయురాలు కృష్ణవేణికి ఫైనల్ షోకాజ్ నోటిస్ జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 2, 2022 నుంచి ముందస్తు అనుమతులు లేకుండా విధులకు రావడం లేదని, 10 రోజుల్లోగా సమాధానం రాకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.

News March 20, 2024

NZB: ‘హై కోర్టులో పోచారం భాస్కర్ రెడ్డికి చుక్కెదురు’

image

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. బుధవారం హైకోర్టులో ఆయన వేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 5న నిజామాబాద్ డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీవోకు అందజేశారు. ఈ నెల 21న అవిశ్వాసంపై ఓటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు.

News March 20, 2024

కామారెడ్డి: నూతన గవర్నర్‌ని కలిసిన షబ్బీర్ అలీ

image

తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. బుధవారం రాజ్ భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

News March 20, 2024

బాల్కొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

బాల్కొండ మండల పరిధిలోగల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు వెళ్తున్న రోహిత్ కుమార్ బైక్ అదుపు తప్పడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని పోలీసులు చెప్పారు.

News March 20, 2024

ఇంకా పూర్తికాని నిజామాబాద్ MP అభ్యర్థి ఎంపిక..!

image

నిజామాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. మంగళవారం ఢిల్లీలో అధిష్ఠానం నిర్వహించిన భేటీలో ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీ రూపొందించిన జాబితాపై పార్టీ పెద్దలు రెండుమార్లు సమీక్షించారు. సామాజిక సమీకరణాలు, విజయావకాశాల నివేదికలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది.

News March 20, 2024

బాన్సువాడ: భార్యను వేధిస్తున్న భర్తపై కేసు నమోదు

image

బాన్సువాడ పట్టణంలోని గృహహింస కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన భూమయ్య(ఆర్మీ ఉద్యోగి) రోజాను 2017లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇటీవల ఉద్యోగం నుంచి వచ్చిన భూమయ్య అనుమానంతో భార్యను శారీరకంగా, మానసికంగా వేధించాడు. భార్య రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News March 20, 2024

బాల్కొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం <<12887148>>అర్ధరాత్రి <<>>జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు బైకులు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. మృతులు వేల్పూర్ మండలం పడిగెల గ్రామానికి చెందిన పఠాని రిషి, ముప్కాల్‌‌కు చెందిన ఉద్ధవ్‌గా పోలీసులు గుర్తించారు.

News March 20, 2024

నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్..!

image

నేడు నిజామాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం కామారెడ్డిలోనూ వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
SHARE IT

News March 20, 2024

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

image

కామారెడ్డి, జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించడానికి నోడల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆర్.డి.ఓ.లు, డి.ఎస్పీలు, తహశీల్ధారు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డబ్బులు, మద్యం రవాణా కాకుండా తనిఖీలు చేపట్టాలని సూచించారు.