India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NZB జిల్లాలోని మంచిప్పకు చెందిన సోదరులు.. రాంరావు, ప్రకాష్ రావు, రమేష్, బల్వంత్ రావు లకు పశువులంటే ప్రాణం. అయితే వీరికి గతంలో నాలుగు వందలకు పైగా ఆవులు ఉండగా అందులో ఒక ఎద్దు ఉండేది. దాన్ని ఇంట్లో ఒకరిగా చూసుకుంటూ లక్ష్మి దేవిలా పూజించే వారు. 2007 APR 5న అది చనిపోయింది. దానిపై మమకారంతో పొలంలో విగ్రహం ఏర్పాటు చేసి వారానికోసారి పూజలు చేస్తున్నారు. APR 5న అన్నదానం చేస్తున్నారు.
తండ్రిని చంపిన కొడుకుకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బోధన్ 5వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవికుమార్ తీర్పునిచ్చారు. వర్నికి చెందిన వినోద్ తరచూ దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో 2021 జూన్లో దొంగతనాలు మానేయాలని చెప్పిన అతడి భార్యతో గొడపడ్డాడు. అడ్డువచ్చిన తండ్రిని కర్రతో కొట్టడంతో దూప్యానాయక్ మృతిచెందాడు. ఈ ఘటనపై అప్పటి SI అనిల్ రెడ్డి కేసు నమోదు చేయగా గురువారం అతడికి జైలు శిక్ష పడింది.
బోధన్ పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్తు శాఖ ఏఈ రవిచంద్ర(47) మృతి చెందారు. బోధన్ రూరల్ ఏఈగా పని చేస్తున్న జి.రవిచంద్ర విధుల్లో భాగంగా గురువారం నిజామాబాద్ స్టోర్కు వచ్చారు. తిరిగి బోధన్కు వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను108లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ ఖిల్లా రోడ్డులో మున్సిపల్ ట్రాక్టర్ పై నుంచి పడి కార్మికురాలు మృతి చెందింది. డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న కార్మికురాలు లలిత (50) అకస్మాత్తుగా ట్రాక్టర్ పై నుంచి కిందపడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడంతోనే లలిత పడిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. బోర్గం ప్రాంతంలోని ఓ బార్లో ఫుడ్ సేఫ్టీ అధికారి తారా సింగ్ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. బార్లో కాలం చెల్లిన ఫుడ్ కలర్, సాస్ను సీజ్ చేశారు. నిల్వ ఉంచిన మటన్ కీమా, చికెన్ను చెత్త కుప్పలో పడవేశారు. సీజ్ చేసిన వాటిని ల్యాబ్కి పంపినట్లు అధికారులు తెలిపారు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బార్పై చర్యలు చేపడతామని వెల్లడించారు.
నిజామాబాద్లోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వినాయక్నగర్లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆ ఇంటి పై దాడి చేసి ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంజీవ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన కోటగిరి మండలంలో చోటు చేసుకుంది. కోటగిరి మండలం కొత్తపల్లికి చెందిన సాయి, పోశవ్వ దంపతులు బైక్పై బుధవారం మండల కేంద్రానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి కొత్తపల్లికి వెళ్తుండగా ఏక్లాస్ పూర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నాగిరెడ్డిపేట మండలంలోని మెల్లకుంట తండా గ్రామానికి చెందిన వీణ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ సైనిక శిక్షణ కళాశాలలో చదువుతూ దేశంలోనే ఉన్నతమైన ఐఐఎం సంబల్పూర్లో ఎంబీఏ సీటు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగ శర్మ, గ్రామస్థులు అభినందించారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్ పాస్ కోసం దరఖాస్తులు ప్రారంభమైనట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పాఠశాలలు, కళశాలల యాజమాన్యాలు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలను చెల్లించి సంబంధిత యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గడ్డి మందు తాగి ఈనెల 14న రంజిత్ చికిత్స పొందుతూ మృతిచెందిన కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన బాబా శేఖర్, బిక్కనూర్కి చెందిన రంజిత్ కలిసి కొద్దిరోజుల క్రితం ఓ బైక్ను దొంగిలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. ఆ బైక్ను తానే సొంతం చేసుకోవాలని బాబా శేఖర్ తన బావమరిది రంజిత్కు కళ్ళు సీసాలో గడ్డి మందు కలిపి ఇచ్చి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు సీఐ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.