India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా 17వేల కేసులు పరిష్కారమైనట్లు న్యాయసేవా సంస్థ కార్యదర్శి పద్మావతి తెపారు. 153 సైబర్ క్రైం కేసులు పరిష్కరించి రూ.9 లక్షలు బాధితులకు పోలీసుల ద్వారా అందజేశారు. మోటారు బీమాకు 51 కేసులకు సంబంధించి రూ. 2.18 కోట్ల పరిహారం అందించారు. జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ.. పట్టు విడుపు ధోరణితో కక్షిదారులు కేసులు పరిష్కరించుకోవాలని అన్నారు.
చెల్లిని కాపాడబోయి అక్క మృతి చెందిన ఘటన కమ్మర్ పల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కమ్మర్పల్లి గాంధీ నగర్కు చెందిన మంజుల భర్తతో గొడవలు జరుగుతున్నాయని ఇంటికి సమీపంలో ఉన్న వరద కాలువలో దూకింది. ఆమె వెనుక అక్క శ్యామల పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడడానికి వరద కాలువలో దూకగా అక్క మరణించింది. అక్కడ ఉన్నవారు చీరను విసరగా మంజుల దానిని పట్టుకొని పైకి వచ్చింది. శ్యామల మరణించింది.
మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి NH44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో KMR జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లికి చెందిన పిట్ల కుమారస్వామి (32) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దశివునూరు నుంచి తన అక్క బావతో కలిసి ద్విచక్ర వాహనంపై రామాయంపేట వైపు వస్తున్న క్రమంలో వెనక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కుమారస్వామి చనిపోగా.. తన అక్క, బావలకు తీవ్ర గాయాలయ్యాయి.
నేటి గ్రూప్-1 ప్రిలిమ్స్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. NZB జిల్లాలో 41, కామారెడ్డి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,630 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది.
>ALL THE BEST
కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటన నాగిరెడ్డిపేటలో చోటుచేసుకుంది. బొల్లారం గ్రామానికి చెందిన హరీశ్ ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. ఇటీవల అతడు గ్రామానికి రాగా కుటుంబ సభ్యులు డబ్బుల కోసం వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన హరీష్ ఉరకేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు.
కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదేళ్లు విధులు నిర్వహించిన 69 మంది కానిస్టేబుల్స్ని బదిలీ చేసినట్లు ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. సిబ్బంది ఆరోగ్య, కుటుంబ సమస్యలు, సీనియార్టీని పరిగణలోకి తీసుకొని సిబ్బంది కోరిక మేరకు బదిలీలు చేసినట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన కానిస్టేబుల్స్ వారికి స్టేషన్లలో రిపోర్ట్ చేసి విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు.
వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన డిచ్పల్లిలో చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం మేఘ్యానాయక్ తండాకు చెందిన లకావత్ వెంగల్ను డిచ్పల్లి మండలంలోని CMC హాస్పిటల్ సమీపంలో దుండగులు హత్య చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా మిగిలిన నిందితులను పట్టుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగి ప్రధాన నిందితుడు బిక్య ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి(M) ధర్మారానికి చెందిన ప్రేమ్ కుమార్(32) మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా డిచ్పల్లి పరిధిలో ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఎస్ఎస్ఆర్, నరేంద్ర కళాశాల కేంద్రాల్లో విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడ్డారు. ఉదయం జరిగిన ఆరో సెమిస్టెర్ రెగ్యులర్ పరీక్షలకు 6,086 మందికి 5,670 మంది, మధ్యాహ్నం ఒకటో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 3,050కి 2,840 మంది హాజరైనట్లు పేర్కోన్నారు.
బోధన్ పట్టణంలో నెలన్నర కాలంలో దొంగల హల్చల్ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంటి ఎదుట గాని, ఏదైనా దుకాణం, బ్యాంకుల వద్ద ద్విచక్రవాహనం నిలపాలంటే వాహనదారులు భయపడుతున్నారు. పని ముగించుకుని బయటకు రాగానే వాహనం కనిపించకుండా పోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగలు పక్కాగా పగలు రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లు, దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.
Sorry, no posts matched your criteria.