Nizamabad

News June 8, 2024

నిజాంసాగర్: పిడుగు పడి గొర్రెల కాపరి మృతి

image

నిజాంసాగర్ మండలంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గోర్గల్ గ్రామానికి చెందిన కూర్మ కృష్ణమూర్తి(24) రోజు మాదిరిగ ఇంటి నుంచి గొర్రెలను వడ్డేపల్లి శివారులో నల్లగుట్ట అటవీ ప్రాంతంలో మేపడానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో పిడుగు పడి చేతిలో పట్టుకున్న గొర్రె పిల్లతో పాటు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.

News June 8, 2024

కామారెడ్డి: ఈ నెల 10న యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10నుంచి యథావిధిగా కొనసాగుతుందని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి తిరిగి కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయాలని సూచించారు.

News June 7, 2024

NZB జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి

image

ఆలూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కూలర్ షాక్ కొట్టి సింధూర(5) మృతి చెందింది. నిజామాబాద్‌కి చెందిన సౌందర్య, మనీశ్ దంపతుల కూతురు సింధూర ఆలూరులోని అమ్మమ్మ ఇంట్లో శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ కూలర్‌ను తాకింది. కూలర్ అన్ చేసి ఉండటంతో షాక్ కొట్టి చిన్నారి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News June 7, 2024

NZB: సహకార సంఘానికి తాళం వేసిన రైతులు

image

కోటగిరిలోని ఎత్తొండ గ్రామంలో రైతులకు రావాల్సిన రూ.1.80 కోట్ల ధాన్యం డబ్బులు తమకు వెంటనే చెల్లించాలని రైతులు సహకార సంఘానికి తాళం వేశారు. సహకార సంఘం పరిధిలోని 114 మంది రైతులు యాసంగిలో పండించిన పంటను ఇచ్చి 2 నెలలు అవుతున్నా వారికి డబ్బులు చెల్లించలేదని తహశీల్దార్‌కి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ సునీత, AO శ్రీనివాస్ వారికి రావాల్సిన డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News June 7, 2024

NZB: సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభం

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10 నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు.

News June 7, 2024

ముందస్తుగానే మొదలైన వరి నాట్లు..

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ సీజన్ అయినా ముందుగా బోధన్ డివిజన్ లోనే వరినాట్లు, కోతలు ప్రారంభమవుతుంటాయి. నెల రోజుల కిందటే నారు మళ్లను సిద్ధం చేసుకున్న రైతులు ప్రస్తుతం నాట్లు వేయడం షురూ చేశారు. బోధన్ డివిజన్ లో వానాకాలం సీజన్ కు సంబంధించి వరి నాట్లు మొదలు కాగా రైతన్నలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో పక్షం రోజుల్లో వరి నాట్లు జోరందుకొనున్నాయి.

News June 7, 2024

NZB: ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్.. రూ. 6 లక్షలు స్వాధీనం

image

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న షేక్ ఇస్మాయిల్(32)ను గురువారం అరెస్ట్ చేసినట్లు మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాలలో 25 వాహనాలను దొంగిలించాడు. వాటిని కమ్మర్ పల్లి, ఆర్మూర్, NZB, మోర్తాడ్, పెర్కిట్ లలో స్ర్కాప్ వ్యాపారం చేసే 15 మందికి ఒక్కొ వాహనాన్ని రూ. 5 వేల చొప్పున విక్రయించారు. కాగా అతని నుంచి రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

News June 7, 2024

షార్జా బీచ్‌లో బోధన్ వాసి మృతదేహం

image

బోధన్ రాకాసిపేట్‌కు చెందిన అవైస్‌‌యాబా (25) అనే యువకుడు షార్జా బీచ్‌లో మృతి చెందారు. యువకుడు ఉపాధి కోసం నాలుగు నెలల కిందట దుబాయి వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం యాబా అదృశ్యమయ్యాడు. తెలిసిన వారు అక్కడ అన్వేషించగా షార్జాలోని అల్- మంజర్ బీచ్‌లో ఓ యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. బంధువులు అది అవైస్‌‌యాబాదేగా ధ్రువీకరించినట్లు వివరించారు.

News June 7, 2024

రెంజల్: పిడుగుపాటుకు పశువుల కాపరి మృతి

image

రెంజల్ మండలం కల్యాపూర్ శివారులో గురువారం పిడుగుపడి దండిగుట్ట తండాకు చెందిన పశువుల కాపరి బానోత్ పీర్యానాయక్ (80) మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. కల్యాపూర్ శివారులో పశువులు మేపడానికి వెళ్లిన ఆయన తిరిగి వస్తున్న సమయంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు కింద తల దాచుకోగా చెట్టుపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు.

News June 7, 2024

KMR: అత్యాశకుపోయి రూ. లక్షలు పొగొట్టుకున్నాడు..!

image

కామారెడ్డిలో సైబర్ మోసం జరిగింది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం పట్టణానికి చెందిన శ్రీకాంత్‌కి వాట్సాప్‌కి పార్ట్‌టైం ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి ఉందా అని మెసేజ్ వచ్చింది. దీంతో అతను ఉద్యోగం చేయడానికి అంగీకరించాడు. మెుదటగా రూ. 9 వేలు కడితే రూ.12 వేలు వస్తాయని ఆశ చూపారు. దీంతో అత్యాశకు పోయి విడతల వారిగా రూ.9.79 లక్షలు చెల్లించాడు. అనుమానం వచ్చిన యువకుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను సంప్రదించాడు.

error: Content is protected !!