India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహాశివరాత్రి సందర్భంగా లేబర్ హాలిడే కారణంగా ఫిబ్రవరి 26 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని అలాగే మార్చి 1, 2 తేదీలలో శనివారం, ఆదివారం గంజ్ తెరిచి ఉన్న పసుపుకు సంబంధించిన లావాదేవీలు ఉండవని అధికారులు తెలిపారు. తిరిగి మళ్లీ మార్చ్ 3న ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పసుపు రైతులు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నిజామాబాద్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. 400 రోజులు దాటినా ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తేమ శాతం గురించి రైతులు పడే ఇబ్బంది దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పసుపు మార్కెట్ యార్డుకు అమ్మకానికి తీసుకొచ్చే రైతులు తేమ శాతం గమనించాలని నిజామాబాద్ జిల్లా ఉద్యాన శాఖ అధికారులు సూచించారు. తేమ శాతం 12 శాతం లోపు ఉన్న పసుపును మాత్రమే తీసుకురావాలని రైతులకు సూచించారు. అంతకంటే ఎక్కువ ఉంటే రైతులు ధర కోల్పోతారని ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బండారి శ్రీనివాస్ తెలిపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న CM రేవంత్ రెడ్డి నిజామాబాద్కు వస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు.

ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని శనివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేసి మాట్లాడారు.

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీగా నగదు, బంగారం అపహరించిన ఘటన నిజామాబాద్ నగరంలో శనివారం వెలుగు చూసింది. హాబీబ్ నగర్ కాలనీకి చెందిన హమీద్ కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లగా అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పెళ్లి కోసమని అప్పు తెచ్చిన రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం బిక్కనూర్లో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా గంగాపురానికి చెందిన శ్రీనివాస్ ఓ శుభకార్యం నిమిత్తం తన అత్తగారింటికి వచ్చాడు. శుక్రవారం అతిగా మద్యం సేవించి ఆరుబయట పడుకోవడంతో తెల్లవారుజామున భార్య సరిత వచ్చి నిద్రలేపిన లేవలేదు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఉమ్మడి NZBలో వరుస గుండెపోట్లు కలకలం రేపుతున్నాయి. 2రోజుల్లో బడికెళ్లే బాలిక, కూతురి పెళ్లిలో తండ్రి ఇలా ఇద్దరు మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు రావడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎలాంటి అనారోగ్య కారణాలు లేనివారు గుండెపోటుకు గురయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు. మంచి ఆరోగ్య అలవాట్లు మెయిన్టేన్ చేస్తే అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని వైద్యులు సూచిస్తున్నారు.

LRS పేరు మీద వసూళ్లకు కాంగ్రెస్ తెర లేపిందని, రూ.20 వేల కోట్ల వసూళ్లకు ప్లాన్ వేశారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన BRS జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు KCR దోచుకోవడానికి, దాచుకోవడానికి LRS తీసుకు వచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పారని పేర్కొన్నారు.

కూలీలుగా వచ్చి దారిదోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని నిజామాబాద్ రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. కొత్తపేట్ శివారులోని రైస్ మిల్ లో కూలీలుగా పనికి వచ్చిన బీహార్ కు చెందిన కుందన్ కుమార్, విజయ్ కుమార్, సుందర్ కుమార్ లు 19న రాత్రి ఒంటరిగా బైక్ లపై వెళ్తున్న వారి పై దాడులు చేస్తూ దారి దోపిడీలకు పాల్పడ్డారని ఏసీపీ వివరించారు.
Sorry, no posts matched your criteria.