India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కస్టమర్ కేర్ నంబర్కు ఫోన్ చేసిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన వైనమిది. జిల్లాలోని ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గంగాధర్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసి ఫోన్ చేశాడు. వెంటనే అతడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.96 వేలు కాజేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ ప్రాణాలను నిజామాబాద్ 2 టౌన్ SI రాము కాపాడారు. హైమద్ పుర కాలనీకి చెందిన ఓ వివాహిత తన భర్తపై అనుమానంతో సోమవారం ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో అతడు పోలీసులను సంప్రదించారు. ఆమె ఫోన్ ట్రాక్ చేయగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లగా ఆమె రైలుకు ఎదురుగా వెళ్తూ కనిపించడంతో ఆమెను రక్షించారు.
రుణమాఫీ కాని రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఇద్దరు అధికారులను నియమించామన్నారు. రైతులు తమ పూర్తి వివరాలు 8374852619 నంబర్కు పంపించాలని ఆయన సూచించారు.
*ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్ఛదనం – పచ్చదనం *నిజామాబాద్లో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు *బోధన్లో అదృశ్యమైన విద్యార్థి.. తిరుపతిలో లభ్యం *జుక్కల్ MLAను అడ్డుకున్న యువత.. రోడ్లు బాగుచేయాలని డిమాండ్. *కోటగిరి: విద్యార్థులకు గొడ్డుకారంతో భోజనం.. స్పందించిన KTR *NZB: కలెక్టరేట్ను ముట్టడించిన PDSU నాయకులు *NZB: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన DEO* బాన్సువాడ: పంటలకు పురుగుల బెడద
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ సెమిస్టర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు గడువు పొడిగించారు. విశ్వవిద్యాలయ పరిధిలోని పలు పీజీ కోర్సుల 2వ, 8వ రెగ్యులర్ సెమిస్టర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య అరుణ తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 12వరకు, రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 14వరకు చెల్లించవచ్చన్నారు.
పాఠశాల విద్యార్థులకు గొడ్డుకారం, నూనె పోసి అన్నం పెడుతున్నారన్న ఘటనపై KTR స్పందించారు. ఘటనకు సంబంధించిన ఫొటోతో గత BRS ప్రభుత్వంలో బడి పిల్లలకు అందించిన మెనూను జత చేసి ట్విటర్లో పోస్ట్ చేశారు. మన బడి పిల్లలకు అందాల్సిన ఆహారం ఇదేనా..? పాఠశాలల్లో పెడుతున్న భోజనంపై వీలైనంత త్వరగా సమీక్షించాలని తెలంగాణ CSను ఆయన కోరారు.
నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీవశాస్త్రం బోధించే టీచర్ పద్మజను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో పద్మజ సిరికొండ మండలంలోని కొండూరుకు బదిలీ చేశారు. ఆ వెంటనే మోడిఫికేషన్ పేరుతో అదే మండలం కొండాపూర్కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉపాధ్యాయులు మాత్రం కొండూరులో జాయిన్ కాలేదు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవంలో భాగంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జుక్కల్ నియోజకవర్గం శాసనసభ్యులు లక్ష్మీకాంతంతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పలు వార్డులు మందు నిల్వ గది పరిశీలించారు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. సోమవారం జుక్కల్ మండలంలో బస్వాపూర్లోని కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ.. చదువు ఏ విధంగా చెబుతున్నారని అర తీసి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య బోధన అందించడం జరుగుతుందన్నారు. కష్టపడి చదువుకుని మంచి ఫలితాలు తీసుకురావాలని అన్నారు. అనంతరం హాజరు పట్టికను పరిశీలించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం గ్రామస్థులకు కనిపించింది. వ్యవసాయ బావుల వద్ద మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన వద్ద ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో పలు గ్రామాలకు సమాచారం అందించారు.
Sorry, no posts matched your criteria.