India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాణిపేట్ గ్రామంలో విషాదం నెలకొంది. నిలిపి ఉన్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన బ్రహ్మ రౌతు సంతోష్ పెద్ద కుమార్తె కల్పిత (9) ఇంటి సమీపంలో ఎరువు నింపేందుకు నిలిపి ఉంచిన ట్రాక్టర్ పై ఎక్కి ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కసారి ట్రాక్టర్ మూవ్ చేయడంతో టైర్ కింద పడి మృతి చెందినట్లు ఆమె కుంటుంబీకులు తెలిపారు.
లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండటంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్పై పడింది. NZB, ZHB పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికే వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!
NZB జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మోర్తాడ్కు చెందిన నర్సయ్య(63) ఆర్మూర్ శివారులో లారీ ఢీ కొని మృతి చెందాడు. ఆర్మూర్లోని ఇస్సాపల్లికి చెందిన ఆశన్న(65) టిప్పర్ టైర్ కింద పడి మృతిచెందాడు. మోర్తాడ్లోని దొన్కల్ వద్ద ఆర్మూర్ నుంచి వస్తున్న లారీ ఢీకొని వినయ్(16) మృతి చెందగా.. మోండోరాలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నాగేంద్ర(25) మృతి చెందాడు.
గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం జాతీయ రహదారిపై పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి 18 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఏఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీలోని రాష్ట్రం నంద్యాల నుంచి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు బొలెరో వాహనంలో 18 క్వింటాళ్ల లూజు విత్తనాలు తరలిస్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ రూ.9 లక్షలు ఉంటుందన్నారు. డ్రైవర్ కోటేశ్పై కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఇంటర్మీడియట్ కామర్స్, కెమిస్ట్రీలతో సప్లిమెంటరీ పరీక్షలు ముగిసాయి. శుక్రవారం ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు జరగగా మధ్యాహ్నం రెండవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలియజేశారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 6164 మంది విద్యార్థులు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 2999 మంది విద్యార్థులు హాజరయ్యారు.
కొడుకుతో చిన్న పాటి గొడవ కారణంగా తల్లి పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. NZB నాగారంలో లక్ష్మీ అనే మహిళ, కొడుకు చెప్పిన మాట వినకపోవడంతో రెండు రోజుల క్రితం గొడవపడింది. దీంతో మనస్తాపానికి చెందిన లక్ష్మి, ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఐదవ టౌన్ ఎస్ఐ అశోక్ తెలిపారు.
నాగిరెడ్డిపేట మండల ఇన్ఛార్జ్ ఎంపీపీగా టేకులపల్లి వినీత దుర్గారెడ్డి శుక్రవారం ఎంపీడీవో పర్బన్న సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఎంపీపీనీ శాలువాతో ఘనంగా సన్మానించి ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ధారబోయిన కృష్ణ, గుర్రాల సిద్దయ్య, లక్ష్మయ్య ఉన్నారు
కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్గా వనిత ఎన్నికైనట్లు ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్గా తనను ఎన్నుకున్నందుకు కౌన్సిలర్లకు, ప్రభుత్వ సలహదారుడు షబ్బీర్ అలీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మద్నూర్ కు చెందిన యువకుడు చౌడేకర్ రూపమ్ (31) గుండె పోటుతో తిరుపతిలో గురువారం రాత్రి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి తిరుపతి వెళ్లిన రూపమ్ తిరుమల దర్శనం చేసుకుని గోవిందరాజ స్వామి దర్శనం కోసం క్యూలో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతడి స్నేహితులు తెలిపారు. కాగా మూడు నెలల క్రితం రూపమ్కు వివాహం అయింది.
నాలుగేళ్ల చిన్నారిని సవితి తండ్రి హత్య చేసిన విషయం తెలిసిందే. మాక్లూర్లోని ధర్మోరాకు చెందిన అరుణ్కు మొదటి భార్యతో విడాకులు కాగా NZBకి చెందిన సునీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే లక్కీ(4) అనే కూతురు ఉంది. పెళ్లికి ముందు పాప తమతోనే ఉంటుందని ఒప్పుకొని తర్వాత పాపను మీ అమ్మగారింట్లో ఉంచు అంటూ గొడవపడేవాడు. పాప తన ఇంట్లో ఉండటం నచ్చని అరుణ్ ఇంట్లో నిద్రిస్తున్న పాపను గొంతునులిమి చంపేశాడు.
Sorry, no posts matched your criteria.