Nizamabad

News May 31, 2024

నిజామాబాద్ సివిల్ సప్లై DSO, DM సస్పెన్షన్

image

నిజామాబాద్ సివిల్ సప్లై DSO చంద్ర ప్రకాశ్, DM జగదీశ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు పౌరసరఫరాల MD DSచౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రధానంగా ఏడు రైస్ మిల్లులకు సంబంధించి CMR కేటాయింపులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, DSO పూర్తి సహకారంతోనే ఈ అక్రమాలు జరిగినట్లు తేల్చారు. విచారణ నివేదిక అనంతరం ఇద్దరు అధికారులపై ఏకకాలంలో సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువరించారు.

News May 31, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: NZB కలెక్టర్

image

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూన్ 9వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్ 1వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in
ద్వారా హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన అభ్యర్థులకు సూచించారు.

News May 30, 2024

మాక్లూర్: నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసిన తండ్రి

image

మాక్లూర్ మండలం ధర్మోరాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని సవితి తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సునీత అనే మహిళ అరుణ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కాగా మెుదటి భర్తకు పుట్టిన పాప ఉండొద్దని సునీతతో అరుణ్ తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే చిన్నారి లక్కి(4) నిద్రలో ఉండగా గొంతు నులిమి హత్య చేశాడు. అరుణ్, కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News May 30, 2024

బాన్సువాడ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

ఇంట్లో విద్యుత్ ఎక్స్‌టెన్షన్ బాక్స్ మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన శ్రీనివాస చారి(45), నీరజ దంపతులు ఉపాధి కోసం సూరారంలోని విశ్వకర్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడి భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

బడుల పునః ప్రారంభానికి ముందే పనులన్నీ పూర్తి కావాలి: కలెక్టర్

image

నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికే ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పనులను నిశితంగా పరిశీలన జరిపారు.

News May 30, 2024

ఆర్మూర్: రూ.కొటిన్నరతో దంపతులు పరార్

image

రూ.కొటిన్నరతో దంపతులు పరారైన ఘటన ఆర్మూర్‌లో జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లో నివాసం ఉండే ప్రవీణ్ దంపతులు జాతీయ రహదారి పక్కన కిరాణా షాప్, బట్టల వ్యాపారం నిర్వహించేవారు. వీరు చుట్టుపక్కల గ్రామాల్లో పలువురి వద్ద సుమారు రూ.కోటిన్నర వరకు అప్పు చేశారు. అప్పులు చెల్లించలేక నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి పారిపోయినట్లు బాధితులు తెలిపారు. వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు.

News May 30, 2024

బాన్సువాడ: మహిళపై హత్యాచారం చేసి బంగారం చోరీ

image

మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. గాంధారిలోని నేరల్ గ్రామానికి చెందిన దత్తు కూరగాయాలు అమ్మె లక్ష్మీతో పరిచయం పెంచుకున్నాడు. అతడి స్నేహితుడు ప్రసాద్‌తో కలిసి ఆమెను ఈ నెల 16న కృష్ణానగర్ తండా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేసి ఆమె తలపై రాయితో కొట్టి చంపేశారు. అనంతరం బంగారం, రూ.10వేల నగదు తీసుకొని పరారైనట్లు CI కృష్ణ తెలిపారు.

News May 30, 2024

NZB: మూడేళ్లలో 259 పోక్సో కేసులు నమోదు

image

ఉమ్మడి NZB జిల్లాలో లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువవుతున్నాయి. కొద్దిరోజుల కిందే ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యచారయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. నవీపేట, మోపాల్, భీమ్‌గల్‌తో పాటు పలు మండలాల్లో 2 నెలల వ్యవధిలో 10కి పైగా పోక్సో కేసులు నమోదయ్యాయి. మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో 259 కేసు నమోదయ్యాయి. అయితే చాలా వరకు లైంగిక వేధింపుల ఘటనల్లో బంధువులు, తెలిసిన వారే ఉండటం గమనార్హం.

News May 29, 2024

NZB: న్యూడ్ వీడియో ఘటనపై కమిటీ ఏర్పాటు

image

జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్ ప్రకటించారు. విచారణ నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్కానింగ్ కోసం వచ్చే మహిళలను రహస్యంగా న్యూడ్ ఫొటోలు, వీడియో చిత్రీకరించిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. స్కానింగ్ సెంటర్లకు వెళ్లే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 29, 2024

మంజీరా నదిలో నీట మునిగి ఇద్దరు మృతి

image

బీర్కూర్ మండలం మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు గల్లంతైన ఘటన బుధవారం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బీర్కూర్‌కు చెందిన కటికే పండరి(30), టిల్లు(12) స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటికి పండరి, టిల్లు మృతదేహాలు బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!