India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎల్లారెడ్డి గ్రామ శివారులోని ఎన్హెచ్ 44 నంబర్ జాతీయ రహదారిపై యువకుడు(30) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు, ఎస్సై రంజిత్ వివరాల ప్రకారం.. సదాశివనగర్ వైపు నుంచి కామారెడ్డి వైపు యువకుడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచామని పేర్కొన్నారు.
ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. వివరాలిలా.. ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరంలోని 2-వ టౌన్ పరిధిలోని ITI కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇంటి కాంపౌండ్ వాల్ కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో ఇంట్లో వాళ్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో నలుగురు యువకులు ఉన్నట్లు సమాచారం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ర్యాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం నుంచి కుక్కలు రోడ్డుపై తిరుగుతుండటంతో ఒంటరిగా కనిపిస్తే కరుస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి 44పై కుక్కటు గుంపులు గుంపులుగా సంచారిస్తుడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను తప్పించాలని కోరుతున్నారు.
గాంధారి: రైతు బీమా దరఖాస్తుల స్వీకరణకు సోమవారంతో గడువు ముగుస్తుందని మండల వ్యవసాయాధికారి నరేశ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 28వ తేదీ వరకు భూములు కొనుగోలు చేసి ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులతో పాటు ఇప్పటివరకు బీమా కోసం దరఖాస్తు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలోని కౌలాస్ నాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 454.70 మీటర్లుగా నీటి నిల్వ సామర్థ్యం 0.580 టీఎంసీలుగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1,389.55 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 3.866 టీఎంసీలుగా ఉంది. కల్యాణి ప్రాజెక్ట్ నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 406.80 మీటర్లుగా ఉంది. ఇక సింగీతం రిజర్వాయర్ నీటి మట్టం 416.550 మీటర్లకు గాను ప్రస్తుతం 416.400 మీటర్లుగా ఉంది.
* కోటగిరి: గొడ్డు కారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. సిబ్బందిపై DEO ఫైర్ * రామారెడ్డి: రెడ్డి పేట్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం * KMR: ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ మాత్రమే: జిల్లా కలెక్టర్ * పార్టీకి విధేయులుగా ఉన్నవారే నా రాజకీయ వారసులు: జుక్కల్ MLA * ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని శిక్షించాలి.. CP ను కోరిన షబ్బీర్ అలీ * నిజామాబాద్లో వివాహిత సూసైడ్.
నిజామాబాద్ పట్టణాన్ని రూ.300 కోట్ల అమృత్ నిధుల ద్వారా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ అన్నారు. నీటి సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు పరిస్కరిస్తానని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేర్చుతామన్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని పిల్లలు తినేందుకు ఇష్టపడలేదు. దీంతో పిల్లలకు గొడ్డు కారం, నూనె పోసి ఇవ్వగా పిల్లలు దాంతోనే కడుపు నింపుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యా యుడిపై మండిపడి ఎంఈఓకు ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చాక్రోడ్ నిషితా రెడ్డి ఇటీవల జరిగిన నీట్ పరీక్ష ఫలితాలలో 5,391వ స్టేట్ ర్యాంక్ సాధించిందని తండ్రి చాక్రోడ్ రవీందర్ రెడ్డి తెలిపారు. నిషితా రెడ్డి రాత్రి పగలు కష్టపడి చదివి అనుకున్న ర్యాంక్ సాధించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు కాలనీ వాసులు శుభాకాంక్షలు తెలిపారు.
దోస్తానా అంటే నిజామాబాదీలు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు ఉమ్మడి NZB జిల్లాలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్ వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
Happy Friendship Day
Sorry, no posts matched your criteria.