Nizamabad

News July 29, 2024

వ్యక్తిగత దూషణలు సరికాదు: కామారెడ్డి ఎమ్మెల్యే

image

శాసనసభలో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం సరి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. గ్రామాలలో ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.

News July 29, 2024

రేపు రెండో విడత రైతు రుణమాఫీ విడుదల: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ రెండో విడత నిధులను ప్రభుత్వం ఈనెల 30న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధుల, రైతుల, అధికారుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. రైతులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

News July 29, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ సందడి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనీ 1,373 గ్రామ పంచాయతీలో ఎన్నికల సందడి మొదలైంది. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. పాత, కొత్త లీడర్లలో ఆశలు రేకెత్తాయి. కొత్త రిజర్వేషన్లు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని అధికారులు చెప్పడంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సలహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాప కింద నీరు లాగా పంచాయతీ సందడి మొదలైంది.

News July 29, 2024

SRSP అప్డేట్: 17,310 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో మెల్లగా పెరుగుతోంది. నిన్న 24 గంటల్లో 16,840 క్యూసెక్కుల నీరు రాగా సోమవారం ఉదయం 9 గంటలకు 17,310 క్యూసెక్కులకు పెరిగింది. ఔట్ ఫ్లోగా 644 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1075.3 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News July 29, 2024

NZB: ఓ వ్యక్తికి అపరిచిత వ్యక్తి కాల్ బెదిరించి

image

మోపాల్ మండలం సింగంపల్లికి చెందిన భూమేశ్‌కు ఆదివారం ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశారు. కోడలు గౌతమి తమ ఆధీనంలో ఉందని, ఆమె ఏడుస్తున్న వీడియోలు చూపించాడు. హిందీలో మాట్లాడుతూ.. భూమేశ్ వివరాలను సేకరించాడు. అనుమానం వచ్చిన భూమేశ్ తన కోడలికి ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. మళ్లీ అపరిచిత వ్యక్తి భూమేశ్‌‌కు ఫోన్ చేసి గౌతమి అందరినీ కొడుతుందని ఓ వీడియో పంపాడు. దీంతో ఆయన పోలీసులను సంప్రదించాడు.

News July 29, 2024

మద్నూర్: వివాహిత ఆత్మహత్య

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్దతడ్గూర్‌కి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎస్ఐ సాయిలు తెలిపారు. గ్రామానికి చెందిన చంద్రకళ(25) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. తండ్రి విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

News July 29, 2024

KMR: జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు..ఎప్పుడంటే..?

image

కామారెడ్డి ఇందిర గాంధీ స్టేడియంలో AUG 2న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు KMR జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్ రెడ్డి, అనీల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జావెలిన్ 100, 400 mtrs, అంశాల్లో..అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. వయస్సు దృవీకరణ పత్రంతో ఉదయం 8 గంటల లోపు స్టేడియం నందు హాజరు కావాలని కోరారు.

News July 29, 2024

బండారు దత్తాత్రేయను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా గవర్నర్ ఆహ్వానం మేరకు బోనాల పండుగ సందర్భంగా విందుకు వెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. బండారు దత్తాత్రేయ అంటే పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే వ్యక్తి అని ఆయన అన్నారు. అనంతరం ఆయనతో పలు రాజకీయ అంశాలు చర్చించారు.

News July 28, 2024

నిజామాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

* నిజామాబాద్‌లో అట్టహాసంగా ఊర పండగ.. కొలువుదీరిన దేవతలు
* ఎల్లారెడ్డిలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన MP సురేశ్ షెట్కార్, MLA మదన్ మోహన్
* బాన్సువాడలో బోనాలు.. బోనమెత్తిన MLA పోచారం
* నిజాంసాగర్: రైతుల పేరిట రూ.కోట్లు కాజేసిన గాయత్రీ షుగర్స్
* ఉమ్మడి జిల్లాల్లో అంబరాన్నంటిన తీజ్ పండగ ఉత్సవాలు
* ఆర్మూర్: యువతికి సైబర్ నేరగాళ్ల బెదిరిపులు

News July 28, 2024

NZB: ఆగస్టు 3 నుంచి రాష్ట్రస్థాయి క్యారం ఛాంపియన్‌షిప్

image

ఆగస్టు 3 నుంచి 6 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి క్యారం ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు క్యాతం సంతోష్ కుమార్ తెలిపారు. ఈ పోటీలు మందుల హనుమాన్లు స్మారకార్థం భీంగల్‌లోని జేబీఎస్ గార్డెన్‌లో నిర్వహిస్తామన్నారు. పోటీల్లో నేషనల్, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వెల్లడించారు. క్రీడాకారులు తమ పేర్లను ఆగస్టు 1లోపు నమోదు చేసుకోవాలన్నారు.