India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 19, (అండర్ 23) సీనియర్ క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు SSC మెమో, ఆధార్ కార్డ్, క్రికెట్ కిట్, వైట్ యూనిఫామ్తో హాజరు కావాలన్నారు.
అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు కామారెడ్డి SP సింధూశర్మ తెలిపారు. మంగళవారం పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజస్థాన్కు చెందిన కుమావత్ బుందారం, లక్ష్మణ్ రామ్లను పట్టుకున్నారు. పట్టణంలో ఈ నెల 2వ తేదీన సిగరేట్ గోదాంలో వారు చోరీ చేసినట్లు గుర్తించారు. వారి వద్ద రూ.15.50 లక్షల నగదుతో పాటు ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. మరో నింధితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఓ వ్యక్తిని దారుణంగా <<13288336>>హత్య చేసిన<<>> ఘటన పిట్లం మండలం చిన్నకొడప్గల్లో జరిగిన విషయం తెలిసిందే. కృష్ణయ్య(40)ను సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు చిన్నకొడప్గల్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండరాయితో బాది, తల భాగాన్ని నుజ్జు నుజ్జు చేసి చంపినట్లు SI నీరేశ్ తెలిపారు. మృతుడి భార్య రుక్మిణిపై అనుమానం ఉందని అతడి అన్న కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.
వైద్యాధికారిణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కామారెడ్డి జిల్లా వైద్యశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్నాయక్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఆల్కహాల్ తాగి ఓ మండల వైద్యాధికారిణికి అసభ్య సందేశాలు పంపినట్లు విచారణలో తేలింది. దీంతో అతడిని విధుల నుంచి తప్పిస్తూ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో DMHO అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో స్వామినారాయణ్ ఆలయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి నారాయణ దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ స్వామి వారి ఆశీస్సులతో సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.
హైదరాబాద్ గాంధీనగర్ PS పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SHO డి.రాజు కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి(మం) సంగోజివాడీ గ్రామానికి చెందిన గడ్డం శివరాజు(45) అనే రైతు ఈనెల15న కోడలు డెలివరీ కోసం కుమారుడు నితిన్తో కలిసి గాంధీ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చిన శివరాజు కృష్ణానగర్లో ఉరివేసుకొని విగత జీవిగా కనిపించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. గతంలో వీసీగా పనిచేసిన రవీందర్ గుప్తా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.. అనంతరం వాకాటి కరుణా, బుర్ర వెంకటేశం ఇన్ఛార్జీలుగా పనిచేశారు. టీయూలో నెలకొన్న సమస్యలను నూతన ఇన్ఛార్జ్ వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామ శివారులోని జాతీయ రహదారి ప్రక్కన బారడి పోశమ్మ గుడి వెనకాల బోయిని కిష్ఠయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలి వద్దకు చేరుకున్నారు. అతని తలపై బలమైన గాయం ఉండడంతో మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యనా..? లేదా ఇంకేమైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. ఈ నెల 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని మొత్తం 18,288 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
ప్రభుత్వం NZB జిల్లాలోని దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎప్పుడైనా మీ సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇదివరకు ప్రతి నెలా 2, 4వ వారాల్లో సదరం శిబిరాలను ఏర్పాటు చేసి దానికి వారం ముందు టోకెన్లు జారీ చేసేవారు. ఇకపై సంవత్సరంలో ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకునే వెసులు బాటు కల్పించింది. దరఖాస్తు దారుడి టోకెన్ నంబర్ బట్టి నిర్ణిత తేదీలో కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.