Nizamabad

News July 28, 2024

బిచ్కుంద: మార్కెట్‌లో 20 కిలోల చేప

image

బిచ్కుంద మండల కేంద్రంలోని చేపల మార్కెట్‌లో ఆదివారం 20కిలోల చేప కనిపించింది. మత్స్యకారులు బాలు, అజయ్ మాట్లాడుతూ.. కౌలాస్ ప్రాజెక్ట్‌లో ఇలాంటి రెండు పెద్ద చేపలను పట్టినట్లు తెలిపారు. కాగా వాటిని కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

News July 28, 2024

నిజామాబాద్‌కు 64 ఎలక్ట్రికల్ బస్సులు

image

నిజామాబాద్ జిల్లాలకు 64 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా NZB డీపో-2కు 12 బస్సులు కేటాయించగా శనివారం 3 వచ్చాయి. మరో 8 కంపెనీ నుంచి రానున్నాయి. NZB, కరీంనగర్ జిల్లాలకు కలిపి మొదటి విడతగా 100 బస్సులు కేటాయించారు. వీటిలో ఇంకా NZBకు 48 రానున్నట్లు ఆయన వెల్లడించారు. రెండో విడతలో 16 బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు.

News July 28, 2024

పారిస్ ఒలింపిక్స్.. కాసేపట్లో బరిలోకి నిఖత్

image

పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమైంది. కాగా నేడు మహిళల 50 కేజీల విభాగంలో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్, నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ఈరోజు సాయంత్రం 3.50గంటలకు బరిలో దిగనున్నారు. మ్యాక్సీ కరీనా (జర్మనీ)తో నిఖత్ తలపడనున్నారు. రింగ్‌లో దూకుడైన ఆట తీరుతో నిఖత్ తన ఒలింపిక్స్ బౌట్‌లో ఎలాంటి ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చూడాలి.. ALL THE BEST

News July 28, 2024

NZB: అనర్హులు.. దర్జాగా పింఛన్లు పొందుతున్నారు!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు అనర్హులు మాత్రం దర్జాగా పింఛన్లు పొందుతున్నారు. సర్వీస్ పింఛన్‌తో పాటు ఆసరా పింఛన్లను ఏళ్లుగా తీసుకుంటున్న 555 మందిని అధికారులు ఇటీవల గుర్తించారు. వీరికి పింఛన్లను నిలిపివేయించి, నోటీసులు జారి చేశారు. కొందరి నుంచి డబ్బులు రికవరీ చేశారు. కాగా.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం రూ. 3.63 కోట్లు నష్టపోయింది.

News July 28, 2024

ఎల్లారెడ్డి: ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు

image

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించే ఉద్యోగి విఠల్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ రాజు తెలిపారు. మద్యం తాగి పాఠశాలకు వచ్చి విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. సస్పెండైన వ్యక్తి అనుమతి లేకుండా ఎల్లారెడ్డి మండల కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు.

News July 28, 2024

SRSP అప్డేట్: 24గంటల్లో 23,599 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గడిచిన 24 గంటల్లో సుమారు 23,599 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి 624 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,074.6 అడుగుల మేర ఉందని చెప్పారు.

News July 28, 2024

కామారెడ్డి: కొడుకు చనిపోయాడని తండ్రి సూసైడ్

image

కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(46) తన కొడుకు ఇటీవల మృతి చెందడంతో మానసిక వేదనకు గురై శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భార్య మాధవి మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కొడుకు విశాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News July 28, 2024

SRSP అప్డేట్: 26,510క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో శనివారం రాత్రి 10 గంటలకు 26,510 క్యూసెక్కులకు తగ్గింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 35,078 క్యూసెక్కుల నీరు రాగ సాయంత్రం 6 గంటలకు అది 30,554 క్యూసెక్కులకు తగ్గిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1074.30 అడుగుల నీరు నిల్వ ఉంది.

News July 27, 2024

నిజామాబాద్: ఇద్దరు ACP లకు ASPలుగా పదోన్నతి

image

నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు ACP లకు నాన్ కేడర్ ఏఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 మంది డీఎస్పీలకు నాన్ కేడర్ ఏఎస్పీలుగా ప్రమోషన్ కల్పిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేయగా ఆర్మూర్ ACP బస్వా రెడ్డి, CCS ACP బి.కిషన్ అడిషనల్ SPలుగా ప్రమోషన్ పొందారు. వీరు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

News July 27, 2024

SRSP అప్డేట్: 30 వేల క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో తగ్గుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 35,078 క్యూసెక్కుల నీరు రాగా సాయంత్రం 6 గంటలకు అది 30,554 క్యూసెక్కులకు తగినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉండగా ప్రస్తుతం 1074.20 అడుగుల నీరు నిల్వ ఉందని వివరించారు.