India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజీమార్గం ద్వారా సమస్యలను పరిష్కరించడం వల్ల సమాజంలో మంచి వాతావరణం ఏర్పడుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యం లో కమ్యూనిటీ వాలంటీర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇందుకోసం వాలంటరీలు కృషి చేయాలని సూచించారు.
నిజామాబాద్ ట్రాఫిక్ PSలో కళాశాల, పాఠశాల యాజమాన్యాలతో ట్రాఫిక్ ACP నారాయణ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులను స్కూల్, కళాశాలలకు బైక్పై విద్యార్థులను రానివ్వొద్దని సూచించారు. ఈ విషయం పై స్కూల్, కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి..వారికి సూచించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ సీఐ వి.వెంకటనారాయణ, బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల విద్యాలయంలో పాముకాటుకు గురైన ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు నిజామాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఒకరు ప్రభుత్వ ఆసుపత్రిలో, ఒకరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గణేశ్ (13), హర్షవర్ధన్(14)లతో పాటు గణాదిత్య గురువారం రాత్రి ఒకే గదిలో నేలపై నిద్రపోగా ఈ ముగ్గురిని పాము కాటు వేసినట్లు సమాచారం. ఇందులో గణాదిత్య మృతి చెందిన సంగతి తెలిసిందే.
సాధారణ బదిలీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 9 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజీవ్ంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై నిషేధం ఎత్తేసిన ప్రభుత్వం ఈ నెల 31 వరకు బదిలీలను చేపడుతుంది. అందులో భాగంగా మల్టీజోన్-1 పరిధిలోని ఇతర జిల్లాల నుంచి తహశీల్దార్లను నిజామాబాద్కు కేటాయించగా జిల్లాలో 9 మంది తహశీల్దార్లు బదిలీ అయ్యారు.
కులం పేరుతో దూషించి, పొలంలోని పైపులకు నిప్పు పెట్టిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి శ్రీనివాస్ ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4,700 జరిమానా విధించారు. ఏర్గట్లలోని తొర్తి గ్రామానికి చెందిన చిన్న లింబన్న అదే గ్రామానికి చెందిన చిన్న సాయన్న పొలంలోని పైపులను కాల్చేశాడు. ఎందుకు కాల్చావని సాయన్న అడిగితే అతడిని కులం పేరుతో దూషించాడు. దీంతో సాయన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మొన్నటి వరకు కిలో రూ.100 ఉండి సామాన్యుడికి భారంగా మారిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. పిట్లంలో శుక్రవారం జరిగిన వారాంతపు సంతలో టమాటా ధర కిలో రూ.25 పలికింది. దీంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. టమాటతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి.
వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని, అందుకే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను శుక్రవారం ఆదేశించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వబడుల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.
* బాన్సువాడ, ఎల్లారెడ్డిలో CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
* SRSP పునాదికి 60 ఏళ్లు అధికారుల సంబరాలు
* ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం
* పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: కలెక్టర్ రాజీవ్ గాంధీ
* బడ్జెట్లో KMR జిల్లాకు అన్యాయం: BJP జిల్లా అధ్యక్షురాలు అరుణ తార
* నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 50 లక్షలు పట్టివేత
* SRSP కు వరద తాకిడి. నిజాంసాగర్కు స్వల్ప ఇన్ ఫ్లో
మెండోరా మండలం పోచంపాడ్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందిన సమాచారం మేరకు ప్రాజెక్టులోకి 25,150 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. క్రమక్రమంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1072.8 అడుగులకు నీటిమట్టం చేరుకోగా.. ప్రాజెక్టులో 28.389 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది.
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లోయర్ గ్రేడ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. 2024 సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 4న ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.