India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణకు గర్వకారణమైన బోధన్లోని నిజాంషుగర్స్ను తిరిగి తెరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం షుగర్స్ను తెరిపించేందుకు కనీస శ్రద్ధ చూపించలేదని, కానీ తాము త్వరలోనే ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
నిజామాబాద్ నగరంలోని హమాల్వాడిలో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉండే పెంటయ్య ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో కలిసి బయటకు వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు బీరువాలో ఉన్న సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. గురువారం ఉదయం చోరీ ఘటన బయటపడగా మూడో టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 2005- 2006 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. అర్హత గల విద్యార్థులు సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిపై రాష్ట్రంలో నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నేటితో 61 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న అప్పటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేయగా, 1978లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రజలకు తాగు, సాగు నీరు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను నిర్మించింది.
బడ్జెట్లో రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని పార్లమెంటు ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై బడ్జెట్లో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పాల్గొనగా.. వీరి వెంట జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ సైతం పాల్గొని ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపారు.
భార్యను శారీరకంగా, మానసికంగా హింసించి ఆపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల సాధారణ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి టి.నాగరాణి బుధవారం తీర్పు చెప్పారు. జిల్లాలోని లింగంపేట్ మండలం పోతాయిపల్లికి చెందిన గారబోయిన చిన్న సంగయ్య (43) తన భార్యపై హత్యాయత్నం చేసినట్లు నిరూపణ కావడంతో ఈ తీర్పును వెలువరించారు.
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలోని ఒక ఫామ్హౌస్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య తన సిబ్బందితో బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 1,12,800 నగదు, రెండు కార్లు, 4 బైక్లు, 10 మొబైల్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దేవుని పల్లి పోలీసులకు అప్పగించారు.
కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన బిచ్కుంద మండలంలో మంగళవారం జరిగింది. SI మోహన్ రెడ్డి వివరాలిలా.. మండలంలోని రాజాపూర్ వాసి కొత్త రాములు అతని పొలంలో నాటు వేస్తుండగా.. పొలం మధ్యలో పడి ఉన్న కరెంట్ వైరును గమనించాడు. దాన్ని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
TU పరిధిలోని డిగ్రీ (CBCS) రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ (రెగ్యులర్) ఒకటవ మూడవ, ఐదవ సెమిస్టర్ (బ్యాక్ లాగ్) పరీక్షల రివాల్యుయేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం. అరుణ బుధవారం తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రివల్యూషన్ ఫీజు ఒక్కొక పేపర్ కు రూ.500 చెల్లించాలని పేర్కొన్నారు.
బోడ కాకరకాయలకు మార్కెట్లో భలే డిమాండ్ పెరిగింది. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ బోడ కాకరకాయలను ఇష్టంగా తీంటారు. దీంతో బోడ కాకరకాయలకు మార్కెట్లో రేటు విపరీతంగా పెరిగిపోయింది. కేజీ రూ.280 మార్కెట్లో అమ్ముతున్నారు. అయినప్పటికీ వాటిని పలువురు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోడ కాకరకాయలు మార్కెట్లోకి వస్తాయి. మార్కెట్లో ధర ఎక్కువ ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.