Nizamabad

News July 22, 2024

NZB: పోలీసుల అదుపులో యూనియన్ బ్యాంక్ మేనేజర్?

image

నిజామాబాద్ నగరంలోని పెద్దబజారు యూనియన్ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడైన మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మేనేజర్ అజయ్ ఖాతాదారుల నుంచి కోట్ల రూపాయలు కొట్టేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కేసు విచారిస్తున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని నిజామాబాదు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.

News July 22, 2024

కళ్యాణి ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తివేత

image

కళ్యాణి ప్రాజెక్ట్ రెండు వరద గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి 450 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి, మరో 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు ఏఈ శివ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను ప్రస్తుతం 408.50 మీటర్లు నీరు నిల్వ ఉందన్నారు. ఎగువ భాగం నుంచి 650 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు ఏఈ తెలిపారు.

News July 22, 2024

ఉమ్మడి నిజామాబాద్‌లో ఊపందుకున్న వ్యవసాయ పనులు

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పంటల సాగు ఊపందుకుంది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయభూములు తడిసి విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా మారాయి. దీంతో జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో రైతులు పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు సాగు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్నిచోట్ల రైతులు భూమిని దున్ని విత్తనాలు నాటుతున్నారు.

News July 22, 2024

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 20,023 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1068.20 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 20.518 టీఎంసీ నీరు నిల్వ ఉంది.

News July 22, 2024

NZB: స్టాక్ మార్కెట్ పేరుతో రూ.35.87 లక్షల మోసం

image

స్టాక్ మార్కెట్ మోజులో పడి ఓ యువకుడు డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ ఘటన NZB జిల్లా డొంకేశ్వర్ మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఇన్‌స్టాలో స్టాక్ మార్కెట్ సంబంధించి యాడ్ చూశారు. దాన్ని ఫాలో అయ్యి రూ.లక్ష డిపాజిట్ చేశాడు. అందులోంచి లాభామొచ్చిన ₹5వేలు విత్‌డ్రా చేశాడు. అది నమ్మి మరో రెండు ఖాతాలు తీసి 19 సార్లు రూ.35.87లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఈసారి మాత్రం డబ్బులు రాలేదు.

News July 21, 2024

ఆర్మూర్ ఎమ్మెల్యే లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం

image

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖను పరిగణనలోకి తీసుకోవాలని 15 రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని దేవదాయ శాఖకు సూచించినట్లు ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.

News July 21, 2024

మాక్లూర్: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

జీవితంపై విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మాక్లూర్ ఎస్ఐ సుదీర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాణిక్ భండార్ తండాకు చెందిన 20 ఏళ్ల యువతికి చిన్న నాటి నుంచి కళ్ళు సరిగ్గా కనిపించవని, మానసిక స్థితి కూడా సరిగ్గా లేదన్నారు. దీనితో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు.

News July 21, 2024

NZB: టాస్క్‌ఫోర్స్ దాడి.. పదిమంది పేకాట రాయుళ్లు అరెస్ట్

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్‌లో ఉన్న లలితానగర్ ఫేజ్ -2లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి, సీఐ పురుషోత్తం, వారి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పది మంది పేకాట రాయుళ్లను పట్టుకుని 10 సెల్ ఫోన్లు, రూ.5,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.

News July 21, 2024

బంగారు బోనం.. కవిత దూరం!

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న నేపథ్యంలో మొదటిసారి BRS MLC కవిత సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జాగృతి ఏర్పాటు చేసి రాష్ట్ర సంస్కృతిని వ్యాప్తి చేసేలా ఏటా కవిత బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. కాగా ఈ సారి లష్కర్ బోనాల వేడుకలకు కవిత రాలేని పరిస్థితి ఉండడంతో పలువురు BRS నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 21, 2024

కామారెడ్డి: మూడో అంతస్తు పైనుంచి పడి మహిళ మృతి

image

భవనంలోని మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. పట్టణంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఓ భవనం మూడో అంతస్తు నుంచి పడి రాజేశ్వరి(50) మృతి చెందింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.