India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 127 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 66 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్ రావు లాయర్ ప్రభుత్వ న్యాయవాదిగా నియామకం అయ్యారని తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా న్యాయవాదిగా కొనసాగుతూ బిచ్కుంద కోర్టు ప్రభుత్వ న్యాయ వాదిగా నియామకం కావడం జరిగిందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఉచిత న్యాయము, సందేహాలు కల్పిస్తానని అన్నారు.
10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. నిజామాబాద్ డివిజన్లో 50 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPMకు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
SHARE IT
జిల్లాలో బాల కార్మికులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఛైల్డ్ లేబర్ జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. 14 సంవత్సరాలోపు చిన్నారులతో ఏ పని చేయించవద్దని పేర్కొన్నారు.
నిజామాబాద్ నగర బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నగరంలో శ్రావ్య గార్డెన్లో దినేష్ కులాచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ధర్మపురి అరవింద్, ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై వారు మాట్లాడుతూ.. నిజామాబాదు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పడి పనిచేసి ఇందూర్ గడ్డపై కాషాయ జెండా ఎగుర వేసిన కార్యకర్తలకే ఈ విజయం దక్కుతుందన్నారు.
ఆదిలాబాద్-పటాన్చెరు రైల్వేలైన్ సర్వే పనులు సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో NH-161 వెంట నిర్వహించారు. నిర్మల్, బాల్కొండ, బాన్సువాడ మీదుగా పటాన్చెరుకు లైన్ వేయనున్నారు. మొత్తం 317KM రైల్వేలైన్ ఏర్పాటుకు ద.మ రైల్వే అప్పట్లో రూ.5,700 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 2వ విడత సర్వే చేస్తున్నారు. దీనికి 12ఏళ్ల క్రితం సర్వే చేయగా.. తిరిగి అదే మార్గంలో సర్వే చేసి గుర్తులు వేస్తున్నారు.
ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ సిబ్బంది వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తోటి స్నేహితులు ముందుకొచ్చారు. 2014 బ్యాచ్కు చెందిన SIలు ఆ కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. వారిలో ఉమ్మడి NZB జిల్లాకు చెందిన పలువురు SIలు కూడా ఉన్నారు.
కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావు నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని ప్రయాణికుడు ఫిట్స్ సమస్యతో బాధపడుతుండగా గమనించిన ఆయన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
కానిస్టేబుల్, హోంగార్డ్ సస్పెండ్ అయిన ఘటన బీబీపేటలో చోటుచేసుకుంది. బీబీపేట ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ నవీన్, హోంగార్డు రవి కలిసి 3 రోజుల క్రితం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ వ్యక్తితో కలిసి వాహనంలో మద్యం తాగి కారుతో పోలీస్ స్టేషన్ గేటును ఢీకొన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి ఏఎస్ఐ ప్రభాకర్ను బదిలీ చేసి కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు.
ఎల్లారెడ్డి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పాము కాటుతో ఒకరి మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంభం నాగయ్య (45) శనివారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో పాము కాటు వేయడంతో, కుటుంబీకులు మెరుగైన చికిత్స కోసం కామరెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే నాగయ్య మృతి చెందినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.