India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో దొంగతనం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి రాములు తెలిపారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి పాఠశాల తాళాలు పగలు గొట్టి రెండు కంప్యూటర్లు దొంగిలించినట్లు వివరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఏఎస్సై వచ్చి పరిశీలించారని పేర్కొన్నారు. కాగా పోలీసుల వివరణ ప్రకారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాలేదని తెలిపారు.
కమ్మర్పల్లి మండలం బషీరాబాద్కు చెందిన రాజాగౌడ్ సౌదీలో పనిచేసుకుంటూ కొన్ని నెలల క్రితం హుండి(వడ్డీ) వ్యాపారం మొదలుపెట్టాడు. అక్కడి బ్యాంక్లో ఇచ్చే రేటు కంటే ఎక్కువ రేటును ఇచ్చి గల్ఫ్ బాధితులను నమ్మించాడు. నమ్మిన నిజామాబాద్, కరీంనగర్, మెట్టుపల్లి, జగిత్యాల, కోరుట్ల, నిర్మల్కు చెందిన గల్ఫ్ కార్మికులు రూ.4 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వగా వాటితో పరారయ్యాడు.
పాల్వంచ మండలం భవానిపేటకు చెందిన నారెడ్డి వెంకట్ రెడ్డి కూతురు రాధవి అమెరికాలో ఎంఎస్ చేస్తుంది. వెంకట్ రెడ్డికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీ కూతురు కేసులో చిక్కుకుందని, రూ.2 లక్షలు పంపాలని ఫోన్ చేశారు. వెంకట్ రెడ్డి కూతురుకు ఫోన్ చేయగా కలవకపోవడంతో భయానికి గురై రూ.లక్ష రూపాయలు మూడు విడతల్లో పంపాడు. మళ్లీ డబ్బుల కోసం డిమాండ్ చేయగా అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి వివాదాల్లో అన్న ప్రాణం తీసిన ఘటన ఆర్మూర్ మండలంలో జరిగింది. మామిడిపల్లికి చెందిన నర్సయ్య, గంగాధర్ అన్నదమ్ములు వీరి మధ్య శుక్రవారం ప్లాట్ల విషయంలో గొడవ జరగగా ఆగ్రహంతో గంగాధర్ నర్సయ్యపై కర్రతో దాడి చేశాడు. క్షతగాత్రుడిని కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నర్సయ్య శనివారం మృతి చెందాడు. కుటుంబీకులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఉమ్మడి NZB వ్యాప్తంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా డెంగ్యూ, చికెన్గున్యా వంటి వ్యాధులో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈక్రమంలో పిట్లం మండలం అల్లాపూర్లో గత 2రోజులుగా చికెన్గున్యా వ్యాధులు విజృంభించి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం గ్రామంలో వైద్యాధికారులు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంటింటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీని విజయ డైరీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మర్యాద పూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లాలో విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులను ప్రోత్సహించి పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వం తరుఫున తగిన ప్రోత్సాహకాలు అందజేయాలని తిరుపతి రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి మండల కేంద్రంలో లబ్ధిదారులకు శనివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. 91 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 22 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, పోతంగల్ ఎమ్మార్వో మల్లయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు శంకర్, లక్ష్మణ్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డిలో చోటుచేసుకుంది. గూడెం గ్రామానికి చెందిన ప్రశాంత్ (28) తాడ్వాయి MRO ఆఫీస్లో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కాగా డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్ వేధింపులు భరించలేక చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు DSP నాగేశ్వరరావు తెలిపారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల పక్కన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు శనివారం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. స్టేషన్ మాస్టర్ సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను గుర్తించారు. వారు గుర్తు తెలియని రైలు నుంచి పడి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతల వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లులో శనివారం ఉదయం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ డీటీ నిఖిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి సుమారు 80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు డీటీ వివరించారు.
Sorry, no posts matched your criteria.