Nizamabad

News July 13, 2024

NZB: గూడ్స్ రైలు కింద పడి హోంగార్డ్ ఆత్మహత్య

image

నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కింద పడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లమ్మ గుట్టకు చెందిన గుమ్మడి దార్ల సంపత్ కుమార్ (నంబర్ 413) శనివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.

News July 13, 2024

గాంధారి: ప్రమాదవశాత్తు యువకుడు మృతి

image

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన గాంధారి మండలం నేరల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్ (27) ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదని స్టూల్ వేసుకొని మరమ్మతులు చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు చేతి వేలికి విద్యుత్తు షాక్ తగలడంతో పక్కన ఉన్న గోడపై పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆయన మృతి చెందాడు.

News July 13, 2024

NZB: చీర గొంతుకు చుట్టుకొని బాలుడి మృతి

image

ఎడపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఠాణాకలాన్‌కు చెందిన నవదీప్(14) మెడకు ప్రమాదవశాత్తు చీర చుట్టుకోవడంతో మృతి చెందాడని SI వంశీకృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. నవదీప్ సామాన్లు సర్దేందుకు చీర సాయంతో సజ్జపైకి ఎక్కాడు. దికే క్రమంలో ప్రమాదవశాత్తు చీర మెడకు చుట్టుకుని ఉరిపడింది. బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

News July 13, 2024

NZB: ఒకే రోజు రెండు పరీక్షలు..!

image

కమ్మర్‌పల్లికి చెందిన DSC అభ్యర్థిని శ్రీలాస్య సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసింది. అయితే తెలుగు, ఇంగ్లిష్ పోస్టులు వేర్వేరుగా ఉండటంతో రెండింటికి దరఖాస్తు చేసింది. ఈనెల 30న ఉ.9 గంటలకు మహబూబ్ నగర్‌ (TL), మ.2 గం హనుమకొండలో (EN) కేటాయించారు. దీంతో ఆమె పరీక్ష ఎక్కడ రాయాలో సందిగ్దంలో పడింది. కాగా దీనిపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. రెండు పరీక్షలు ఒకే చోట రాయోచ్చని తెలిపింది.

News July 13, 2024

పారదర్శకంగా ‘మహిళా శక్తి’ లబ్ధిదారుల ఎంపిక: కలెక్టర్

image

మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమంతో వివిధ యూనిట్ల స్థాపన కోసం పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపికలో వివక్షను ప్రదర్శిస్తూ పొరపాట్లకు ఆస్కారం కల్పిస్తే, సంబంధిత ఏపీఎంలను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 12, 2024

టియు: పీజీ పరీక్షలు వాయిదా..

image

టియు & అనుబంధ కళాశాలలో ఈనెల 15 నుండి ప్రారంభమయ్యే పీజీ IV సెమిస్టర్ పరీక్షలు డిఎస్సీ, గ్రూప్-2 పరీక్షల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఏపిఈ, ఐపిసిహెచ్, ఐఎంబీఏ, రెగ్యులర్, బ్యాక్లాగ్, ఎంబీఏ, ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

News July 12, 2024

NZB: బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ అరవింద్

image

బిజెపి విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్‌లోని ఓ కన్వెన్షన్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కాగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, జిల్లా అధ్యక్షుడు దినేష్ పాల్గొన్నారు.

News July 12, 2024

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతో నమ్మకంతో వచ్చే నిరు పేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి, సర్కారు దవాఖానాల పనితీరుపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన వర్నిలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.

News July 12, 2024

పిట్లం: మొబైల్ హ్యాక్ చేసి..రూ. 3.92 లక్షలు కాజేశారు..!

image

సైబర్ నేరగాడు ఓ వ్యక్తి మొబైల్ హ్యాక్ చేసి అకౌంట్ నుంచి డబ్బులు కాజేసిన ఘటన ఈనెల 2 వ తేదీన పిట్లంలో జరిగింది. కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిట్లంకు చెందిన గాండ్ల నాగ్‌నాథ్ మొబైల్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.3.92 లక్షలు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News July 12, 2024

బోధన్: విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

image

సాలంపాడ్ క్యాంపు చెందిన రాంబాబు(36)అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంబాబు గురువారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి బోరుబావి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌గురై మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.