India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రోజురోజుకి ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి, బాసర స్టేషన్లు వస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 20 వరకు 54 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 52 మంది పురుషులైతే.. ఇద్దరు మహిళలు ఉన్నారు. రైల్వే అధికారులు గ్రామాల సమీపంలో కొన్ని కి.మీ పరిధిలో పర్యవేక్షణ పెడితే చాలా వరకు బలవన్మరణాలను నివారించవచ్చు.
కడుపునొప్పి భరించలేక యువకుడు ఇంట్లో ఉరేసుకుని మృతిచెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని తుంకీపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి జ్ఞానేశ్వర్ (24) ఆటో డ్రైవర్ సోమవారం కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కలిశారు. నియోజకవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివెళ్లారు. ఆయన్ను కలిసి రాజకీయ పరిస్థితులు వివరించారు. పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తాము పనిచేస్తామని తెలిపారు.
తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు వెళుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నిజామాబాద్ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.నాగమోహన్ తెలిపారు. GGHలో రోగులకు వైద్య సేవల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అందరి వైద్యుల సెలవులు రద్దు చేశామని, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు విధులు నిర్వహిస్తారని వివరించారు.
మామతో కలిసి ఓ మహిళ <<13495824>>భర్తను హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. CI కృష్ణ వివరాల ప్రకారం.. తిర్మలాపూర్కు చెందిన రాములు(40) తాగివచ్చి భార్య మంజుల, తండ్రి నారాయణతో గొడవపడేవాడు. అది భరించలేక రాములును వారిద్దరూ కలిసి ఈనెల 9న గొడ్డలితో నరికి హత్య చేసి శవాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. రెండు రోజుల తర్వాత ఇంటి ఎదుట గొయ్యి తీసిపూడ్చిపెట్టారు. అతడి బావ అయిన శ్రీనివాస్ వారి కుటుంబీకులను అడగడంతో విషయం బయటపడింది.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల చేయనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి షేక్ సలాం తెలిపారు. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 7658కి 2666, రెండో సంవత్సరంలో 7234కి 3204 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో జిల్లాకు 35వ స్థానం దక్కింది. కాగా మొదటి సం.లో 6236, రెండో సం.లో 4275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
తాను స్వలాభం కోసమో పదవి కోసమో కాంగ్రెస్లో చేరలేదని, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. కార్యకర్తల సూచన మేరకు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకే కాంగ్రెస్లోకి వెళ్లానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, నియోజకవర్గ అభివృద్దే లక్ష్యమని పోచారం స్పష్టం చేశారు.
నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలోని డ్రైనేజీలో (35) వ్యక్తి మృతదేహం ఒంటి నిండా గాయాలతో ఆదివారం లభ్యమైంది. అతడు డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వర్షం ధాటికి అతడు డ్రైనేజీలో పడి మృతి చెందాడా.? లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సదరు వ్యక్తిపై దాడి చేసి డ్రైనేజీలో పడేశారా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాన్సువాడ మండలంలో దారుణం జరిగింది. మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో జులాయిగా తిరుగుతూ తాగి వచ్చి కొడుతూ ఇబ్బందులు పెడుతున్న రాములు (33)ను అతడి భార్య మంజుల తన మామ నారాయణతో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్లో 2 రోజులు ఉంచి తదుపరి ఇంటి ఆవరణలోనే గుంత తీసి పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మృతదేహాన్ని వెలికి తీసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోచారం శ్రీనివాస్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించాలని రేవంత్ సర్కార్ చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చనడుస్తోంది. కాంగ్రెస్లో చేరగానే ఆయనకు మంత్రి పదవి ఖాయమని, వ్యవసాయ శాఖ కూడా ఇస్తామని ప్రచారం జరిగింది. అయితే పదవి కోసమే తాను పార్టీలోకి వచ్చినట్లు అవుతుందని భావించి ఆయన పదవీ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో అతడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించేందుకు అవకాశాలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.