India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని సిర్నాపల్లి, ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పైన సోమవారం గుర్తు తెలియని మగ వ్యక్తి (35) మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. రైలులో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్యం చేశారు. మృతుడి కుడి చేయి పైన కవిత అని పచ్చ బొట్టు ఉన్నట్లు గుర్తించారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.
జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 12న ఉపాధి కార్యలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేళాలో పలు ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. SSC, ITI ఎలక్ట్రిషన్, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారు అర్హులన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. తమ వాహనాల టైర్ల గ్రిప్/థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవాలన్నారు. టైర్ల గ్రిప్ బాగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన విద్యార్థి జ్యోతి సమన్విత్ JEE అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలో 833వ జనరల్ ర్యాంక్ సాధించాడని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. అలాగే OBC NCL కేటగిరిలో 121 వ ర్యాంకు సాధించాడు. ముప్కాల్ మండలం వేంపల్లికి చెందిన చరణ్ ఓపెన్ క్యాటగిరిలో 51వ ర్యాంకు సాధించాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరిమల్లకు చెందిన హర్షత్ గౌడ్ JEEలో 8879 ర్యాంకు సాధించాడు.
నిజామాబాద్ పులాంగ్ చౌరస్తా బ్రిడ్జి దాటిన తరువాత యాదగిరి బాగ్ కమాన్ ఎదురుగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని నిజామాబాద్ 4వ టౌన్ SHO తెలిపారు. సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసుగల ఈ వ్యక్తి రోడ్డు దాటుతుండగా కిందపడి దెబ్బలు తగిలి మరణించాడన్నారు. ఇతని వివరాలు తెలిసినవారుSHO NZB 4 Town 8712659840, NZB 4 town PS 8712659719 నంబర్లను సంప్రదించాలని కోరారు.
కామారెడ్డి మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం వంతెన పై నుంచి లారీ కింద పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొగ్గుగుడిసె నుంచి బాన్సువాడ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ లారీ నర్వ గ్రామ సమీపంలో అదుపుతప్పి సింగీతం ప్రాజెక్టు వంతెనపై నుంచి కిందికి పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. అంబులెన్స్ ద్వారా అతన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
నవీపేట పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తికి చెందిన బైక్ చోరీ జరిగింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. నవీపేట కుమ్మరికాలనీకి చెందిన మల్లేశ్ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. దీనిపై సదరు బాధితుడు శుక్రవారం ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. తన బైక్ను పోలీస్ స్టేషన్ పార్కింగ్ స్థలంలో తాళం వేసి నిలిపాడు. తిరిగి వచ్చే సరికి వాహనం కనిపించలేదు. విస్మయానికి గురైన ఆయన మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కామారెడ్డి పట్టణంలోని కల్కి నగర్లోని శ్రీ కల్కి భగవాన్ శ్రీ భగవతి పద్మావతి దేవి కళ్యాణ మహోత్సవానికి ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. గుడిలకు సంబంధించిన ఏ సమస్య ఉన్న నా దగ్గర దాకా తీసుకురావాలని, ఆలయాలకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.
మూగజీవాలను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డిపేట మండల ఎస్సై రాజు తెలిపారు. బక్రీద్ సందర్భంగా గోవులను తరలించడానికి పశువైద్యాధికారి ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. మూగజీవాలను తరలిస్తున్నట్లు తెలిస్తే వారికి సమాచారం ఇవ్వాలని, వాహనాలను అడ్డుకొని గొడవలు చేయడం సరికాదన్నారు. పశువుల రవాణాకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బక్రీద్ను శాంతియుతంగా చేసుకోవాలని సూచించారు.
నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అభ్యర్థులు పరీక్ష రాశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని సెంటర్లలో మహిళా అభ్యర్థులను మెడలోంచి చైన్లు తీయాలంటూ ఒత్తిడి చేశారని పలువురు ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.