Nizamabad

News June 6, 2024

బాన్సువాడ: నీటి కుంటలో మృతదేహం

image

బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన పాల్కి భూమబోయి మూడు రోజుల క్రితం కనిపించకపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఇండ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఇవాళ ఉదయం ఇబ్రహీంపేట్ సబ్ స్టేషన్ ముందర నీటి కుంటలో భూమబోయి మృతదేహం స్థానికులకు కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు.

News June 6, 2024

ధర్మపురి అర్వంద్‌కు మంత్రి పదవి..?

image

కేంద్రంలో మూడోసారి కొలువు దీరనున్న NDA ప్రభుత్వంలో ఈ సారి తెలంగాణకు రెండు కేబినెట్ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి కిషన్ రెడ్డి లేదా డికే అరుణకు, బీసీ సామాజికవర్గం నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్‌లో ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ రెండోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

News June 6, 2024

ZHB: ఆరుగురికి ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు

image

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 19 మంది పోటీచేశారు. ఇందులో 10 మంది స్వతంత్రులే. వీరిలో ఎవరికీ 6వేల ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. ఏడు నియోజకవర్గాల్లో 12,25,049 ఓట్లు పోలయ్యాయి. ఇందులో స్వతంత్రులకు 31,079 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 2,933 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన 10 మందిలో ఆరుగురికి నోటా కంటే తక్కువ వచ్చాయి.

News June 6, 2024

నిజామాబాద్: అంచనాలకు మించి BJP జోరు

image

నిజామాబాద్ పార్లమెంట్‌లో BJPకి విశ్లేషకుల అంచనాలకు మించి ఓట్లు పోలయ్యాయి. గత ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4.80 లక్షలు ఓట్లు రాగా.. ఈసారి 5.92 లక్షల ఓట్లు వచ్చాయి. NZB రూరల్, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గాల్లో 15 వేల నుంచి 20 వేల మెజార్టీ వస్తుందని లెక్కలు కట్టారు. కాని రూరల్ 44వేలు, కోరుట్లలో 33వేలు, బాల్కొండలో 32 వేలు మెజార్టీ దక్కటం గమనార్హం. 7 అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు సాధించడంతో BJP జోరు సాగింది.

News June 6, 2024

NZB: కోడలి సజీవదహనం..అత్తకు రెండు జీవిత ఖైదులు

image

కోడలిని సజీవ దహనం చేసిన అత్తకు 2 జీవిత కారాగార శిక్షలు, రూ. 11వేల జరిమానా విధించింది జిల్లా కోర్టు. నవీపేట మండలం శివతండాకు చెందిన బానోత్ రాంసింగ్ ప్రకాశం జిల్లాకు చెందిన రాధను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాంసింగ్, తల్లి కోడలిని కట్నం తేవాలని వేధించారు. ఈ క్రమంలో 2020 ఏప్రిల్ 20న రాత్రి రాధను రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు.

News June 5, 2024

NZB: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

image

నగరంలోని గాజుల్ పేట్ రామ మందిర్ ప్రాంతానికి చెందిన నారాయణ(22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రెడిట్ కార్డు తీసుకుని దాని ద్వారా డబ్బులను డ్రా చేసి వాడుకున్నాడు. డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం క్రెడిట్ కార్డు రికవరీ టీం ఇంటికి వచ్చి బెదిరించినట్లు 2 టౌన్ ఎస్ఐ రాము తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన నారాయణ తన ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

News June 5, 2024

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై ఫైర్ అయిన ఎంపీ అర్వింద్

image

బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ ఎన్నికలో చిల్లర రాజకీయాలు చేశారని ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. సుదర్శన్ రెడ్డి తన వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలన్నారు. ఆయన ఒక రాజకీయ అవకాశ వాది అని, లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపారం చేసే సుదర్శన్ రెడ్డికి షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని సోయి లేదా అని ప్రశ్నించారు. సుదర్శన్ రెడ్డితో జిల్లా ప్రజలకు, బోధన్ నియోజకవర్గ ప్రజలకు నయా పైసా ఉపయోగంలేదన్నారు.

News June 5, 2024

NZB: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

క్రికెట్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి యువకుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. నగరంలోని గౌతంనగర్‌కు చెందిన విజయ్(30) బుధవారం అమ్మ వెంచర్‌లో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తరలించిగా మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News June 5, 2024

నిజామాబాద్ ప్రజలు గర్వించేలా పనిచేస్తా: ఎంపీ ధర్మపురి 

image

నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ధర్మపురి అరవింద్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో మరోసారి ఎంపీగా ఆశీర్వదించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిజామాబాద్ ప్రజలు గర్వించేలా పనిచేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడుదామని కాంగ్రెస్ వాళ్లకు ఎంపీ ధర్మపురి అరవింద సవాల్ విసిరారు.

News June 5, 2024

ప్రజాతీర్పును గౌరవిస్తున్నా: బీబీ పాటిల్

image

జహీరాబాద్ పార్లమెంట్ ఓటర్లకు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై పై ఎంతో నమ్మకంతో రెండు సార్లు ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపించారన్నారు. తాను గెలిచిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశానన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నానని.. జహీరాబాద్ ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.