Nizamabad

News June 5, 2024

జహీరాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిన BRS

image

MP ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల ముందు ఇక్కడ BRSVsBJP అని‌ ఆ పార్టీ శ్రేణులు‌ భావించాయి. కానీ నిన్నటి ఫలితాల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. మెజార్టీ రౌండ్లలో BRS చివరి స్థానంలో నిలిచింది. ఫలితంగా 1,72,078(13.92%) ఓట్లకే పరిమితం కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన గాలి MPగా పోటీ చేసిన ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు.

News June 5, 2024

NZB: 2 సార్లు MLA..ఎంపీ పోటీలో డిపాజిట్ గల్లంతు..!

image

నిజామాబాద్ లోక్ సభ BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం సత్తాచాట లేకపోయారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు MLA గా గెలిచిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. తిరిగి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఆయనకు 1,02,406 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 8.3% ఓట్లు రాబట్టగా.. డిపాజిట్ కూడా గల్లంతైంది.

News June 5, 2024

జహీరాబాద్‌: కాంగ్రెస్‌ 2వ సారి విజయకేతనం

image

ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్‌ను కాంగ్రెస్‌, నిజామాబాద్‌ను బీజేపీ కైవసం చేసుకున్నాయి. ZHB కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ 47,896 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009లో గెలిచిన షెట్కార్‌ తాజాగా మరోసారి విజయకేతనం ఎగురవేశారు.BRS ఎంపీగా ఉన్న బీబీపాటిల్‌ BJPలో చేరి పోటీ చేయగా, కాంగ్రెస్‌ నుంచి BRSలో చేరిన గాలి అనిల్‌కుమార్‌ బరిలో నిలిచి ఓటమిచెందారు. దీంతో BRS సిట్టింగ్‌ స్థానాన్ని కొల్పోయింది.

News June 5, 2024

NZB: అప్పుడు 4,80,584, ఇప్పుడు 5,92,318

image

NZBఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో BJP అభ్యర్థి D. అర్వింద్ గెలుపొందారు. 2019లో 70 వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందగా.. ఈ ఎన్నికల్లో ఆ మెజార్టీ 1,09,241కి చేరింది. 2017లో BJPలో చేరిన అర్వింద్ అనతికాలంలోనే అధిష్ఠానం దృష్టిని ఆకర్షించారు. ఏడాదిన్నర కాలంలోనే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో అప్పటి సీఎం కూతురు కవితపై పోటీ చేసి గెలుపొందారు. 2019లో అర్వింద్ కు 4,80,584 ఓట్లు రాగా ఈ సారి 5,92,318 ఓట్లు వచ్చాయి.

News June 5, 2024

అప్పుడు నిజామాబాద్ కలెక్టర్లు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు

image

గతంలో నిజామాబాద్ కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు.. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఉమ్మడి తూ.గో జిల్లా రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన దేవవరప్రసాద్ 39,011 ఓట్లతో గెలిచారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటి చేసిన బి.రామాంజనేయులు 41,151 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా ఈ ఇద్దరు గతంలో నిజామాబాద్ కలెక్టర్లుగా పనిచేశారు.

News June 5, 2024

NZB: అసెంబ్లీకి ఓడించిన.. పార్లమెంట్‌కు పంపించారు

image

ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేశారు. భారాస అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10,300 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అర్వింద్ లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి వ్యూహం మార్చారు. మోదీ చరిష్మాకు తోడు.. తన వ్యూహానికి పదును పెట్టారు. 1.13 లక్షలకు పైగా మెజార్టీతో అర్వింద్ విజయం సాధించారు.

News June 4, 2024

ప్రశాంతంగా ముగిసిన నిజామాబాద్ పార్లమెంట్ కౌంటింగ్

image

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గంలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీ కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ లెక్కించామన్నారు.

News June 4, 2024

ఎన్నికలను సాఫీగా నిర్వహించడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు: కలెక్టర్

image

ఎలాంటి ఆటంకాలు లేకుండా జిల్లాలో ఎన్నికలను సాఫీగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.

News June 4, 2024

ఇది మోదీ కుటుంబ సభ్యుల విజయం: ఎంపీ అరవింద్

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నిజామాబాద్ మోదీ కుటుంబ సభ్యుల విజయమని ఎంపీ అరవింద్ అన్నారు. మంగళవారం ఆయన ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

News June 4, 2024

NZB: ప్రజా తీర్పును గౌరవిస్తా: జీవన్ రెడ్డి

image

ప్రజా తీర్పును గౌరవిస్తానని NZB పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో MPగా గెలిచిన BJP అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ NZB పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఇప్పుడైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అరవింద్ కు సూచించారు.