India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్రీయ గీతం రచయిత అందెశ్రీకి ఇందూరుతో అభినవభావ సంబంధం ఉంది. 1978లో బతుకుదెరువు కోసం ఆర్మూర్ పరిధిలో తాపీ పని చేస్తున్న అందె ఎల్లయ్య.. మానిక్బండార్ పరిధిలో ఆశ్రమం నడుపుతున్న శంకర్మహరాజ్ దృష్టిలో పడ్డారు. నీ పని ఇదికాదురా.. అందరిని చైతన్యం చేసే అక్షరాన్ని ఆయుధంగా సంధించాలని జ్ఞానభిక్ష పెట్టి అందెశ్రీగా నామకరణం చేశారు. చదువు లేకున్నా.. ఏకసంతాగ్రాహిగా, పాటల రచన, గానం చేశారు అందెశ్రీ.
సామాన్యుడికి నిత్యావసరమైన కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నిజామాబాద్లో గత వారం పది రోజులు నుంచి కూరగాయల ధరలు క్రమంగా పెరగడంతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. మిర్చి కిలో రూ.100, వంకాయలు, టమాటాలు కేజీ రూ.50 పైన పలుకుతున్నాయి. కూరగాయల రేట్లు సైతం మంట పుట్టిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆయా కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.
కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సుభాశ్(42)శనివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సుభాశ్ బస్వాపూర్ నుంచి పని నిమిత్తం ఎక్సెల్ వాహనంపై కోటగిరి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో గుమ్మడి ఫౌండేషన్ సమీపంలో వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
జహీరాబాద్లో బీఆర్ఎస్ గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో బీఆర్ఎస్కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరో స్థానంలో గెలుస్తాయని అంచనా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 64/66, బీఆర్ఎస్కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది. కాగా జహీరాబాద్లో కొన్ని బీజేపీ, మరి కొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టరేట్ను అన్నివిధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఐడీఓసీలో నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్యఅతిథిగా హాజరై ఉదయం 9.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
నిజామాబాద్లో బీజేపీ విజయం సాధించనుందని పోలిటికల్ ల్యాబరేటరీ (PL) సర్వే తేల్చింది. అయితే జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో టఫ్ ఫైట్ ఉండనుందని తెలిపింది. నిజామాబాద్లో BRSనుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి టి.జీవన్రెడ్డి, BJP నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేశారు. ఇక జహీరాబాద్లో BRS నుంచి గాలి అనిల్కుమార్, కాంగ్రెస్ నుంచి సురేశ్షెట్కార్, BJP నుంచి బీబీపాటిల్ పోటీలో ఉన్నారు.
నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు BJPవేనని చాణక్యX సర్వే తేల్చిచెప్పింది. నిజామాబాద్లో BRSనుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి టి.జీవన్రెడ్డి, BJP నుంచి ధర్మపురి అర్వింద్ పోటీచేశారు. ఇక జహీరాబాద్లో BRS నుంచి గాలి అనిల్కుమార్, కాంగ్రెస్ నుంచి సురేశ్షెట్కార్, BJP నుంచి బీబీపాటిల్ పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో BJP అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.
నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు BJPవేనని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పింది. నిజామాబాద్లో BRSనుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి టి.జీవన్రెడ్డి, BJP నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేశారు. ఇక జహీరాబాద్లో BRS నుంచి గాలి అనిల్కుమార్, కాంగ్రెస్ నుంచి సురేశ్షెట్కార్, BJP నుంచి బీబీపాటిల్ పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో BJP అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.
భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాణిపేట్ గ్రామంలో విషాదం నెలకొంది. నిలిపి ఉన్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన బ్రహ్మ రౌతు సంతోష్ పెద్ద కుమార్తె కల్పిత (9) ఇంటి సమీపంలో ఎరువు నింపేందుకు నిలిపి ఉంచిన ట్రాక్టర్ పై ఎక్కి ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కసారి ట్రాక్టర్ మూవ్ చేయడంతో టైర్ కింద పడి మృతి చెందినట్లు ఆమె కుంటుంబీకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.