India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ మల్టీ జోన్1 పరిధిలో పనిచేస్తున్న 19 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమందిని పోస్టింగ్ నుంచి తప్పించి వీఆర్కు అటాచ్ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రానున్న రోజుల్లో మరికొంతమందిని బదిలీ చేసే అవకాశం ఉంది.
ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీపేట్లో చోటుచేసుకుంది. మండలానికి చెందిన వీణ ప్రభుత్వ టీచర్గా పనిచేస్తుంది. ఆమెకు సిద్ధిపేటకు చెందిన శ్రావణ్తో 2015లో వివాహం కాగా HYDలో కాపురం ఉంటున్నారు. అయితే కొద్దిరోజులుగా వీణ మానసిక పరిస్థితి బాగా లేక పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె ఈనెల 21న రాత్రి పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం మల్లుపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం మలావత్ శ్రీకాంత్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జేసీబీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులకు సమాచారం అందించారు.
టీయూ గర్ల్స్ హాస్టల్లో నిన్న <<13488521>>అల్పాహారంలో కీటకం<<>> ఘటన పై వర్సిటీ అధికారులు స్పందించారు. హాస్టల్ కేర్ టేకర్, వార్డెన్ విచారణ జరిపి రిజిస్ట్రార్కు నివేదిక అందజేశారు. దీంతో వైస్ ఛాన్స్లర్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి హెడ్ కుక్ రాజేష్ను సస్పెండ్ చేసి, విధుల నుంచి తొలగించారు. మిగతా సిబ్బంది కిచెన్లో పరిశుభ్రత పాటించాలని లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్స్ట్రక్షన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. ల్యాండ్ సర్వేయర్, ప్లంబర్, జనరల్ సూపర్వైజర్, స్ట్రక్చర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నిజామాబాద్లో అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహం లభ్యమైంది. సుభాష్ నగర్ పరిధిలోని పాముల బస్తీ పరిసర ప్రాంతంలో ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు మురికి కాలువలో పడేశారు. గమనించిన స్థానికులు 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నాగిరెడ్డిపేటలోని రాఘవపల్లిలో <<13461096>>కత్తిపోట్లకు<<>> గురైన నాగయ్య(55) చికిత్స పొందులూ శుక్రవారం మృతి చెందారు. ఈనెల 18న ఇద్దరు యువకులు అతడిపై కత్తితో దాడి చేసి గోంతు కోశారు. తీవ్రంగా గాయపడిన నాగయ్యను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న అతడికి నిన్న గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి NZB జిల్లాలో ఆ పార్టీ బలం పెరగనుంది. జిల్లాలోని 9 మంది MLAల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. తాజాగా పోచారం చేరికతో ఆ సంఖ్య ఐదుగురికి చేరింది. ఆయన చేరిక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు జిల్లాలోని పలువురు నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాట్సాప్లో అమ్మాయిల ఫొటోలు పంపి విటులను రప్పించి హైటెక్ వ్యభిచారం చేస్తున్న గుట్టును పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. సుభాష్ నగర్ ఏరియాలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్క సమాచారం మేరకు 3 టౌన్ ఎస్ఐ ప్రవీణ్, టౌన్ సీఐ నరహరి వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు, ఒక విటుడిని, వ్యభిచార నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులను ఎక్కించుకొని వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం నలుగురు విద్యార్థులు ఉన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని స్థానికులు వెల్లడిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.