India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బి.పి.ఎడ్ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 26న ప్రారంభమై 30 తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య.ఎం.అరుణ తెలిపారు. పూర్తి వివరాల కోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్
www.telanganauniversity.ac.in చూడాలని విద్యార్థులకు సూచించారు.
కామారెడ్డి ,2022- 23 రబీకి సంబంధించిన ధాన్యాన్ని బిడ్డర్లకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అప్పగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను కోరారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ల తో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత రబీకి సంబంధించి లక్ష 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి ప్రభుత్వం బిడ్డర్లను కేటాయించిందని అన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులపాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్పీ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30ల వరకు జరగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
కన్న పిల్లల మృతికి కారణమైన తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి కుంటాల సునీత తీర్పు వెల్లడించారు. నందిపేటకు చెందిన అమృత 2022 ఫిబ్రవరి 28న గుత్ప కెనాల్లో తన పిల్లలను పారేసి తాను దూకింది. ఓ కానిస్టేబుల్ ఆమెను రక్షించగా పిల్లలు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి ఈ మేరకు తీర్పు చెప్పారు.
మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు కరెంట్ షాక్తో మృతి చెందినట్లు ఎస్ఐ సంపత్ తెలిపారు. గ్రామానికి చెందిన ప్రవీణ్ తన ఇంటి వద్ద నల్ల నీటికి మోటార్ కనెక్షన్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలిందన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లో రవాణాశాఖ కార్యాలయాల్లో ఫ్యాన్సీ నంబర్లకు ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహించారు. దీంతో రూ.9,69,872 ఆదాయం వచ్చింది. NZBకు టీజీ 16 0001, ఆర్మూర్కు టీజీ 16 ఏ 0001, బోధన్కు టీజీ 16B 0001 నంబర్లను కేటాయించారు. ఇందులో టీజీ 16A 0001 నంబర్ కోసం ఓ వాహనదారుడు రూ.లక్ష చెల్లించాడు. టీజీ 16 0789కు రూ.52,665, టీజీ 16 0001కు రూ.50 వేలు, టీజీ 16B 0333 నంబర్ రూ. 30వేల ధర పలికింది.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బోధన్ మండలం అమ్ధాపూర్కి చెందిన బాబయ్య(65), పోచమ్మ (60) పేదరికంలో మగ్గుతున్నారు. ఉర్లో అప్పులు కావడం, తీర్చే మార్గం లేగ నిజామాబాద్లో 4 నెలలుగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వారు నడుముకు తాడు కట్టుకుని నుస్రత్నగర్లోని నిజాంసాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఢిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ కవిత..ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంతో భాగస్వామి అయ్యారని ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి కవిత, మరికొందరితో కలిసి ఆప్ అగ్రనేతలతో కుట్రపన్నారని ఈడీ పేర్కొంది. కాగా ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు సమాయత్తమవుతున్నారు. పార్టీ ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్లో మంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో సమావేశమయ్యారు. ZHB పరిధిలోని ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార వ్యూహం, పార్టీలో చేరికలు, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో సురేష్ శెట్కార్, షబ్బీర్ అలీ, మదన్ మోహన్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.