India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NZBఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో BJP అభ్యర్థి D. అర్వింద్ గెలుపొందారు. 2019లో 70 వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందగా.. ఈ ఎన్నికల్లో ఆ మెజార్టీ 1,09,241కి చేరింది. 2017లో BJPలో చేరిన అర్వింద్ అనతికాలంలోనే అధిష్ఠానం దృష్టిని ఆకర్షించారు. ఏడాదిన్నర కాలంలోనే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో అప్పటి సీఎం కూతురు కవితపై పోటీ చేసి గెలుపొందారు. 2019లో అర్వింద్ కు 4,80,584 ఓట్లు రాగా ఈ సారి 5,92,318 ఓట్లు వచ్చాయి.
గతంలో నిజామాబాద్ కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు.. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఉమ్మడి తూ.గో జిల్లా రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన దేవవరప్రసాద్ 39,011 ఓట్లతో గెలిచారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటి చేసిన బి.రామాంజనేయులు 41,151 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా ఈ ఇద్దరు గతంలో నిజామాబాద్ కలెక్టర్లుగా పనిచేశారు.
ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేశారు. భారాస అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10,300 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అర్వింద్ లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి వ్యూహం మార్చారు. మోదీ చరిష్మాకు తోడు.. తన వ్యూహానికి పదును పెట్టారు. 1.13 లక్షలకు పైగా మెజార్టీతో అర్వింద్ విజయం సాధించారు.
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గంలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీ కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ లెక్కించామన్నారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా జిల్లాలో ఎన్నికలను సాఫీగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నిజామాబాద్ మోదీ కుటుంబ సభ్యుల విజయమని ఎంపీ అరవింద్ అన్నారు. మంగళవారం ఆయన ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
ప్రజా తీర్పును గౌరవిస్తానని NZB పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో MPగా గెలిచిన BJP అభ్యర్థి ధర్మపురి అరవింద్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ NZB పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఇప్పుడైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అరవింద్ కు సూచించారు.
నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ సిట్టింగ్ బీజేపీ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. కాగా ప్రస్తుతం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రత్యర్థి అభ్యర్థి జీవన్ రెడ్డి పై భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం భారీ మెజార్టీ దిశగా ధర్మపురి అర్వింద్ దూసుకెళ్తున్నారు.1,22,890 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ లక్షకు పైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉండడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తీర్పును శిరసా వహిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు అర్వింద్ హామీలను అమలు చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.