Nizamabad

News May 22, 2024

పిట్లంలో వ్యక్తి హత్య.. అతడి భార్యపై ఫిర్యాదు

image

ఓ వ్యక్తిని దారుణంగా <<13288336>>హత్య చేసిన<<>> ఘటన పిట్లం మండలం చిన్నకొడప్గల్‌లో జరిగిన విషయం తెలిసిందే. కృష్ణయ్య(40)ను సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు చిన్నకొడప్గల్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండరాయితో బాది, తల భాగాన్ని నుజ్జు నుజ్జు చేసి చంపినట్లు SI నీరేశ్ తెలిపారు. మృతుడి భార్య రుక్మిణిపై అనుమానం ఉందని అతడి అన్న కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.

News May 22, 2024

కామారెడ్డి: లైంగిక వేధింపులు.. సూపరింటెండెంట్ సస్పెండ్

image

వైద్యాధికారిణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కామారెడ్డి జిల్లా వైద్యశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌నాయక్‌‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఆల్కహాల్ తాగి ఓ మండల వైద్యాధికారిణికి అసభ్య సందేశాలు పంపినట్లు విచారణలో తేలింది. దీంతో అతడిని విధుల నుంచి తప్పిస్తూ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో DMHO అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

News May 22, 2024

న్యూజెర్సీ సిటీలో ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

image

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో స్వామినారాయణ్ ఆలయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి నారాయణ దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ స్వామి వారి ఆశీస్సులతో సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.

News May 21, 2024

కామారెడ్డి: కోడలు డెలివరీకి వచ్చి మామ ఆత్మహత్య

image

హైదరాబాద్ గాంధీనగర్​ PS పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SHO​ ​డి.రాజు కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి(మం) సంగోజివాడీ గ్రామానికి చెందిన గడ్డం శివరాజు(45) అనే రైతు ఈనెల15న కోడలు డెలివరీ కోసం కుమారుడు నితిన్‌‌తో కలిసి గాంధీ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చిన శివరాజు కృష్ణానగర్లో ఉరివేసుకొని విగత జీవిగా కనిపించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

NZB: టీయూ ఇన్‌‌ఛార్జ్ వీసీగా సందీప్ సుల్తానియా

image

తెలంగాణ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. గతంలో వీసీగా పనిచేసిన రవీందర్ గుప్తా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.. అనంతరం వాకాటి కరుణా, బుర్ర వెంకటేశం ఇన్‌‌ఛార్జీలుగా పనిచేశారు. టీయూలో నెలకొన్న సమస్యలను నూతన ఇన్‌ఛార్జ్ వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

News May 21, 2024

KMR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామ శివారులోని జాతీయ రహదారి ప్రక్కన బారడి పోశమ్మ గుడి వెనకాల బోయిని కిష్ఠయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలి వద్దకు చేరుకున్నారు. అతని తలపై బలమైన గాయం ఉండడంతో మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యనా..? లేదా ఇంకేమైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

NZB: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. ఈ నెల 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని మొత్తం 18,288 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

News May 21, 2024

NZB: ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు

image

ప్రభుత్వం NZB జిల్లాలోని దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎప్పుడైనా మీ సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇదివరకు ప్రతి నెలా 2, 4వ వారాల్లో సదరం శిబిరాలను ఏర్పాటు చేసి దానికి వారం ముందు టోకెన్లు జారీ చేసేవారు. ఇకపై సంవత్సరంలో ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకునే వెసులు బాటు కల్పించింది. దరఖాస్తు దారుడి టోకెన్ నంబర్ బట్టి నిర్ణిత తేదీలో కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేసుకోవచ్చు.

News May 21, 2024

NZB: మొదటి రోజు పరీక్షకు 92 మంది గైర్హాజరు

image

సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన టెట్ 2024 పరీక్షలు జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆర్మూర్ క్షత్రియ ఇంజినీరింగ్, NZB నాలెడ్స్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పరీక్షకు 170 మందికి 92 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 170 మందికి 156 మంది హాజరయినట్లు DEO దుర్గాప్రసాద్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21,585 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

News May 21, 2024

NZB: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

యువకుడిపై ఫోక్సో కేసు నమోదైన ఘటన నిజామాబాద్‌లోని మోపాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను తీసుకుని పరారయ్యాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నాలుగు నెలల తర్వాత బాలిక ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆమె గర్భం దాల్చడంతో యువకుడిపై పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.