Nizamabad

News April 17, 2024

కామారెడ్డి: ఆకుపై శ్రీ రాముని చిత్రం

image

శ్రీ రామనవమి సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు బాస బాల్ కిషన్ ఆకుపై శ్రీ రాముని చిత్ర పటం వేశాడు. దీంతో పాటు జై శ్రీ రామ్ నామం 12 భాషల్లో రాశాడు. దీన్ని చూసిన వారు బాల్ కిషన్‌‌కు అభినందనలు తెలియజేశారు. కాగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్ కిషన్ చిత్ర కళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పలు రకాల వినూత్న చిత్రాలు గీసి ప్రశంసలు పొందాడు.

News April 17, 2024

నిజామాబాద్: తుఫాన్‌ను ఢీకొని ఒకరి మృతి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ కారు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని గౌతమ్ నగర్‌కు చెందిన దమ్ము పాల్ స్నేహితులు ఉమాకాంత్, వినోద్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. బైపాస్ దాటే క్రమంలో అర్సపల్లి నుంచి వేగంగా వచ్చిన తుఫాన్ బైక్‌ను ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది.

News April 17, 2024

జహీరాబాద్‌లో త్రిముఖ పోరు?

image

ZHB లోక్‌సభ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ZHB పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ (సురేశ్ షెట్కర్), 2014, 2019లో BRS (బీబీ పాటిల్) అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారి CONG, BJP, BRS అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తూ ప్రచారం చేస్తుండడంతో సార్వత్రిక పోరు ఆసక్తి రేపుతోంది. 

News April 17, 2024

సివిల్స్‌లో సత్తాచాటిన కామారెడ్డి వాసి

image

జాతీయస్థాయి సివిల్స్ ఫలితాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన విద్యార్థి రజనీకాంత్ ర్యాంకు సాధించారు. జిల్లా కేంద్రానికి చెందిన రజనీకాంత్ జాతీయస్థాయి సివిల్ ప్రవేశ పరీక్ష రాశారు. ఆయన జాతీయస్థాయిలో574 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ.. ఐపీఎస్ అధికారి కావాలన్నదే తన లక్ష్యమన్నారు.

News April 17, 2024

కామారెడ్డి: గ్రూప్1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా జూన్ 9 న నిర్వహించే గ్రూప్-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించుటకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్-1 పరీక్షల నిర్వహణ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరపాలన్నారు.

News April 17, 2024

NZB: రికార్డ్‌స్థాయిలో 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

రాష్ట్రంలో ఈసారి యాసంగిలో ఇప్పటివరకు రికార్డ్‌స్థాయిలో 2.69లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దేవేంద్రసింగ్ జవాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడుతూ.. అవసరమైతే ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేంద్రంలో సరిపడా టర్పైన్లు, ఇతర సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

News April 16, 2024

కామారెడ్డి: ఆరుగురు మృతికి కారణమైన డ్రైవర్‌కు ఐదేళ్ల శిక్ష

image

ఆరుగురు మృతికి కారణమైన డ్రైవర్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కామారెడ్డి మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు చెప్పారు. ఫకీర్ ఇస్మాయిల్ అనే డ్రైవర్ 01.10.2016న పిట్లం మండలం కారేగాం గ్రామంలోని పిల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ప్రమాదం జరగవచ్చని తెలిసి కూడా నీటిలో నుండి కారును డ్రైవ్ చేసి ఆరుగురి మృతికి కారణమైనట్లు రుజువవ్వగా శిక్ష వేశారు.

News April 16, 2024

కాంగ్రెస్‌వి దొంగ వాగ్దానాలు: ఎంపీ అర్వింద్

image

కాంగ్రెస్ దొంగ వాగ్దానాలు చేసి గెలిచిందని.. అధికారంలోకి వచ్చాక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని ఎంపీ అరవింద్ ధర్మపురి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సైతం ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి కనిపించకుండా పోయారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిరి బీజేపీ దొంగ వాగ్దానాలు ఇవ్వదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేపార్టీ బీజేపీ అన్నారు.

News April 16, 2024

నిజామాబాద్: బీఆర్ఎస్ సమన్వయకర్తల నియామకం

image

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ సమన్వయకర్తలను నియమించింది. కోరుట్లకు ఎల్. రమణ, ఆర్మూర్ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నిజామాబాద్ అర్బన్ ప్రభాకర్‌రెడ్డి, బాల్కొండ ఎల్.ఎం.బీ రాజేశ్వర్, నిజామాబాద్ రూరల్ వి.గంగాధర్ గౌడ్, బోధన్ డి.విఠల్‌‌రావులను నియమించింది.

News April 16, 2024

NZB: కాంగ్రెస్ పార్టీలోకి కీలక నేత

image

BRSకు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతలు BRSకు గుడ్ బై చెప్పి రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. BRS నేత, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, నిజామాబాద్‌కు చెందిన మాజీ MLC రాజేశ్వర్ BRS పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు హైద్రాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు.

error: Content is protected !!