India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండల పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామ పరిధిలోగల రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలు ఢీ కొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పాత నేరస్థులు, రౌడీ షీట్ కలిగి ఉన్న 493 మందిని బైండోవర్ చేశామని జిల్లా SP సింధూ శర్మ తెలిపారు. అలాగే లైసెన్సులు కలిగి ఉన్న వ్యక్తుల వద్ద నుండి 19 ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు. కాగా పొరుగున ఉన్న నాందేడ్ జిల్లా, బీదర్ జిల్లా పోలీసులతో సమన్వయ సమావేశం నిర్వహించి సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమ మద్యం, నగదు, ఇతర వస్తువులు రాకుండా చర్యలు చేపట్టామన్నారు.
కామారెడ్డి జిల్లాకు ఆదివారం వచ్చిన జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజక వర్గ పోలీస్ పరిశీలకుడు రాజేష్ మీనాను జిల్లా ఎస్పీ సింధు శర్మ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడడానికి, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి పటిష్ట పోలీస్ భద్రత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయనకు వివరించారు.
నిజామాబాద్ కాలూర్కు చెందిన నాలుగు నెలల గర్భిణి మృతి చెందడంతో వైద్యులే కారణమంటూ నగరంలోని వీక్లీ మార్కెట్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బంధువులు ఆదివారం ఆందోళన చేపట్టారు. శనివారం ఆసుపత్రికి తీసుకువచ్చిన గర్భిణిని ఆసుపత్రి వైద్యురాలి సూచన మేరకు స్కానింగ్ చేయించగా డాక్టర్ కడుపులో బిడ్డ చనిపోయిందని అబార్షన్ అవసరం లేదని కొన్ని టాబ్లెట్లు వాడాలని సూచించారు. అయితే ఇవాళ ఆమె మృతి చెందడంతో ఆందోళన చేశారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలో దోచుకున్నంతగా ప్రజాధనాన్ని బ్రిటిష్ వారు కూడా దోచుకోలేదని నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని 38వ డివిజన్ పరిధిలో 131, 132 బూత్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో అరవింద్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వం కోరుకుంటున్నారన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే SC, ST, OBCలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై MP అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలు వీడియోలో అమిత్ షా రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను తీసేసి SC, ST, OBCలకు ఇస్తామని చెప్పారు’ అని వీడియో షేర్ చేశారు.
తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ మృతి చెందారు. కామారెడ్డి నుంచి కారులో తాడ్వాయి పోలీస్ స్టేషన్కు విధుల నిమిత్తం వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. NZB జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే కారణమని తెలుస్తోంది. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా పట్టుబడిన వారిని జైలుకు పంపిస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా తీరు మారడం లేదు. ఈ ఏడాది 3 నెలల్లో NZB పోలీసు కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 649కి పైగా నమోదు కాగా 267 మందిని జైలుకు పంపించారు.
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయస్సులో ఆయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 25 నుంచి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా బోర్గాం(పీ) కేంద్రంలో ఈయన పరీక్షలు రాస్తున్నారు. ఎల్లాగౌడ్ BSNLలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి 2007లో రిటైర్ అయ్యారు. గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి పాసైనట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ బస్సు <<13133998>>ఢీకొని<<>> వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్ వద్ద నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సును రమణయ్య అనే వ్యక్తి స్కూటీతో ఢీ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.