India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన మరాఠీ లక్ష్మి (42) పని నిమిత్తం మాచారెడ్డికి వచ్చినట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాచారెడ్డి ఊర చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
నిజామాబాద్లోని గౌతమ్ నగర్లో గొల్ల గంగామణి నివాసం ఉంటుంది. గంగామణి కి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం పెద్ద కుమారుడు మరణించాడు. చిన్న కుమారుడు గొల్ల పవన్ కుమార్ మేస్త్రీ పని చేస్తూ దుబ్బ ప్రాంతంలో నివాసం ఉంటాడు. గంగామణి వద్దకు పవన్ కుమార్ వచ్చి కన్నతల్లి పై దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ విచక్షణ రహితంగా ముఖంపై పిడి గుద్దులు కురిపిస్తూ దాడి చేశాడు.
ఆర్మూర్లోని విద్యానగర్ కాలనీలో చేపూర్ గ్రామానికి చెందిన బండి నడిపి గంగాధర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గతంలో నగల కోసం ఇద్దరూ అక్కాచెల్లెళ్లను హతమార్చిన ఘటనలో నిందితుడు కావడం విశేషం. మృతుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటినుంచి మతిస్థిమితం లేదని మృతుడి బంధువులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
మండలంలోని బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాలలో పదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని పరీక్షల భయంతో ఆదివారం పాఠశాల భవనం పైనుంచి దూకింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమె కుటుంబీకులు NZB జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గత రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల కామారెడ్డి జిల్లాలో 20,071 ఎకరాల పంట నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 14,553 రైతులకు చెందిన 20,071 ఎకరాల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు కొంతమేర గోధుమ, ఉల్లి, బొప్పాయి, మామిడి, కూరగాయ పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు.
మండలంలోని గండివేట్ గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గాంధారి స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) తన వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి NZB జిల్లాలోని బిక్కనూరు, కామారెడ్డి, వర్నిలోని సిద్దాపూర్, కుసల్ దాస్ తండా, పైడిమాల, గుంటూరు క్యాంప్, చింతల్ పెట్ తండాతో పాటు పలు గ్రామాల్లో శనివారం కురిసిన అకాల వర్షానికి మొక్క జొన్న, జొన్న పంటలు నెలకొరిగాయి. వేల ఎకరాల్లో పంటనష్టపోయామని రైతులు వాపోతున్నారు. మండలాల్లోని వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ పదవుల్లో NZB జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు పొందారు. అనిల్ ఈరవత్రి (మినరల్ డెవలప్మెంట్), మానాల మోహన్ రెడ్డి(కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్), అన్వేశ్ రెడ్డి(సీడ్స్ డెవలప్మెంట్). వీరితో పాటు కామారెడ్డి జిల్లా నుంచి కాసుల బాలరాజు (ఆర్గో ఇండస్ట్రీస్) లభించింది.
నిజామాబాద్ లోక్సభ స్థానంలో NZB అర్బన్, NZB రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్లో అత్యధికంగా 2.99 లక్షల ఓటర్లు ఉండగా.. ఆర్మూర్లో అత్యల్పంగా 2.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే బాల్కొండ మినహా అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా NZB అర్బన్లో 289, NZB రూరల్లో 293 పోలింగ్ కేంద్రాలున్నాయి.
10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు DEO దుర్గాప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 141 పరీక్ష కేంద్రాల్లో 22281 మంది పరీక్షలకు హాజరు కాబోతున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాలలో CC కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పగడ్బందీగా పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు.141 సిట్టింగ్స్ బృందాలు నియమించామన్నారు. రేపటి నుంచి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి 12:30 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.