Nizamabad

News April 25, 2024

కామారెడ్డి:ఈనెల 25 నుంచి మే 8 వరకు ఓటర్ స్లిప్పుల పంపిణీ

image

ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు జిల్లాలోని ఓటర్లకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించాలని కోరారు.

News April 25, 2024

ఇంటర్ సెకండియర్ రిజల్డ్స్..చివరి స్థానంలో కామారెడ్డి

image

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 59.59 శాతంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా 29వ స్థానంలో నిలిచింది. 13988 మందికి 8335 మంది పాసయ్యారు. 44.29 శాతంతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 7234 మందికి 3204 మంది పాసయ్యారు.

News April 25, 2024

ఇంటర్ ఫస్టియర్ రిజల్డ్స్..చివరి స్థానంలో కామారెడ్డి

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 49.95 శాతంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో 27వ స్థానంలో నిలిచింది. 8551 మందికి 5200 మంది పాసయ్యారు. 34.81 శాతంతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 7658 మందికి 2666 మంది పాసయ్యారు.

News April 25, 2024

నిజామాబాద్ మహిళ ఖమ్మంలో మృతి

image

నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన పోచమ్మ ఖమ్మం జిల్లాలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని వైఎస్ఎస్ ఆర్ కాలనీలో పోచమ్మ కుమారుడు నివాసం ఉంటున్నాడు. వారం క్రితం కుమారుడి ఇంటికి వెళ్లిన పోచమ్మ సోమవారం చింతకాని మండలం వందనం గ్రామ సమీపంలోని పొలాల్లో చనిపోయింది. కొద్ది కాలంగా మతిస్థిమితం సక్రమంగా లేదని ఆమె కుమారుడు తెలిపాడు.

News April 25, 2024

నిజామాబాద్: రేపటి నుంచి పరీక్షలు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. పరీక్షలు ఏప్రిల్ 25న ప్రారంభమై మే 2 వరకు కొనసాగుతాయన్నారు. ప్రయోగ పరీక్షలు మే 3 న ప్రారంభమై అదే నెల 10 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.

News April 25, 2024

నేడు ఇంటర్ ఫలితాలు.. ఉమ్మడి NZB నుంచి ఎంత మంది అంటే

image

నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 35346 మంది విద్యార్థులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో కలిపి ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 19509 విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. #ResultsFirstOnWay2News

News April 25, 2024

KMR: నేడు సురేశ్ శెట్కార్ నామినేషన్..!

image

జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ నేడు నామినేషన్ వేయనున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి.. జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వివరించారు.

News April 25, 2024

NZB పార్లమెంట్‌‌లో మంగళవారం 16 నామినేషన్లు దాఖలు

image

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి మంగళవారం 16 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వివిధ పార్టీల తరఫున అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్‌లు వేసినట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు 26 మంది అభ్యర్థులు మొత్తం 44 నామినేషన్లు దాఖలు చేశారని కలెక్టర్ వెల్లడించారు.

News April 25, 2024

NZB జిల్లాలో BRSకు షాక్.. BJP లోకి కోటపాటి

image

లోక్ సభ ఎన్నికల వేళ NZB జిల్లాలో BRS పార్టీకి షాక్ తగిలింది. రైతు, గల్ఫ్ సంక్షేమ సంఘం నేత కోటపాటి నరసింహనాయుడు BRS పార్టీకి రాజీనామా చేసి BJPలో చేరుతున్నట్లు ప్రకటించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న కోటపాటి పసుపు బోర్డు కోసం రైతుల పక్షాన పోరాటాలు చేశారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డుపై ప్రకటన చేసినందున బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు.

News April 24, 2024

NZB: 1.25 కేజీల గంజాయి లభ్యం.. ముగ్గురి అరెస్ట్

image

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. ఆటోనగర్‌లోని షకీలా బీ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 1.25 కేజీల గంజాయి లభ్యమైనట్లు ఎస్సైజ్ సీఐ దిలీప్ తెలిపారు. షకీలా బీ ఆమె కూతురు నాందేడ్‌లో గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ అల్లుడి సహయంతో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు షకీలా బీతో పాటు ఆమె కూతురు అస్మా, అల్లుడు షేక్ వసీంలను అరెస్ట్ చేసినట్లు CI వివరించారు.