Nizamabad

News April 16, 2024

నవీపేట్: గుండెపోటుతో అధ్యాపకురాలు మృతి

image

నవీపేట్ మండలంలోని ఆదర్శ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న జరీనా పిర్దోస్ (48) సోమవారం గుండెపోటుకు గురై మృతి చెందినట్లు పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లెక్చరర్ మృతిపై ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News April 16, 2024

వర్ని: జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

image

వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూర్ మండల కేంద్రానికి చెందిన మమ్మాయి గిరి (46) అనే వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు. మద్యానికి బానిసైన గిరి అప్పులు చేశారు. అప్పులను తీర్చలేక చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్టు పేర్కొన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు..

News April 16, 2024

NZB: కూరగాయలు అమ్మిన ఎంపీ అభ్యర్థి

image

బీర్కూర్ మండలం మిర్జాపూర్ గ్రామంలో సోమవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని కూరగాయలు అమ్ముతున్న వ్యక్తి వద్దకు వెళ్లిన బీబీ పాటిల్ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కూరగాయల షాపులో కొద్దిసేపు కూర్చున్నారు. కూరగాయలు కొనడానికి వచ్చిన వారిని బీజేపీకి ఓటు వేయమని కోరారు.

News April 16, 2024

KMR: రూ. కోట్లలో మోసం.. చిట్ ఫండ్ నిర్వాహకుల అరెస్ట్

image

కామారెడ్డిలోని SLVS చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI చంద్ర శేఖర్ రెడ్డి వెల్లడించారు. SLVS చిట్ ఫండ్ కంపెనీ పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందిందని CI పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టి కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో రూ. కోట్లకు పైగా మోసం చేసినట్లు తేలిందని తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే KMR పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News April 16, 2024

40 చోట్ల దాడులు, 30 కేసులు నమోదు: NZB సీపీ

image

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డీ వ్యాపారులపై సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు 40 చోట్ల దాడులు నిర్వహించగా 30 కేసులు నమోదు చేశామని CP కల్మేశ్వర్ తెలిపారు.వీరి వద్ద నుండి కోట్ల రూపాయలు విలువైన ప్రామిసరీ నోట్లు, పట్టా పాస్ బుక్కులు, ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 16, 2024

కామారెడ్డి: ‘350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు’

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ తెలిపారు. వాటి ద్వారా 22,894 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.13 కోట్లు రైతులకు అందజేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గన్ని బ్యాగుల కొరత లేదన్నారు. ప్రతి కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News April 15, 2024

ఎల్లారెడ్డి మాజీ MLA కారులో డబ్బులు పట్టివేత

image

ఎన్నికల కోడ్‌ వేళ ఎల్లారెడ్డి మాజీ MLA కారులో డబ్బులు పట్టుబడ్డాయి. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల శివారులో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ వాహనంలో రూ.1,80,000 పట్టుబడినట్లు SI ఆనంద్ గౌడ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపనందున సీజ్ చేసి కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. కారులో ఉన్న నితిన్ రెడ్డి, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

News April 15, 2024

కామారెడ్డి: బీజేపీ మహిళా మోర్చా జిల్లా కమిటీ నియామకం

image

కామారెడ్డి జిల్లాలో పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా జిల్లా కమిటీని నియమించినట్లు జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, మహిళా మెర్చా అధ్యక్షురాలు అనిత తెలిపారు. కమిటీలో నియమించిన 25 మంది సభ్యుల పేర్లను విడుదల చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించారు.

News April 15, 2024

ఎడపల్లిలో బాలిక సూసైడ్

image

మండలానికి చెందిన ఓ బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బోధన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో వెతకగా 10 పేజీల లెటర్ లభ్యమైనట్లు వెల్లడించారు. 4 ఏళ్ల క్రితం ఆమె తండ్రి చనిపోవడంతో మనస్తాపానికి గురైనట్లు ఆమె తల్లి పేర్కొంది.

News April 15, 2024

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో తనిఖీలు

image

నిజామాబాద్ నగరం, జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారుల వద్ద నుంచి అప్పు తీసుకున్న వారికి సంబంధించిన ఆస్తి పత్రాలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లను సీజ్ చేశారు. పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.