India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివాహితను అత్యాచారం చేసిన ఘటన నందిపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆర్మూర్ CI వివరాలు.. ఈ నెల 6న ఉమ్మెడకు చెందిన అరుణ్, ముత్యం మద్యం తాగి భాగ్యమ్మ సాయంతో ఓ మహిళను అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు భాగ్యమ్మను కొట్టడంతో మంత్రాల నెపంతో తనను కొట్టారంటూ ఆమె ACPకి ఫిర్యాదు చేసింది. శుక్రవారం విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో అరుణ్, ముత్యం, భాగ్యమ్మను అరెస్ట్ చేశారు.
కేటీఆర్ ఓ బచ్చా అని, ఆయన్ను ఫార్ములా రేస్ కేసులో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఆయన నిజామాబాద్లో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంటే ప్రజల నుంచి ఆదరణ వస్తోందని, దాన్ని చూసి ఓర్వలేకనే కేటీఆర్ అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్షనేతగా కేసీఆర్ను మాత్రమే గుర్తిస్తుందన్నారు.
సాయంత్రం వేళ సూర్యాస్తమయ సమయాన సూర్యుడి ప్రతిబింబం చెరువు నీటిలో విద్యుత్ బల్బు మాదిరి సాక్షాత్కరించింది. ఆకాశమంతా ఎర్రని కాంతులను వెదజల్లుతూ.. మరో వైపు నీటిలో దీప కాంతిని ప్రసరిస్తూ కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. పిట్లంలోని గ్రామ చెరువు వద్ద శనివారం ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించారు.
భూమి చదును చేసి, నారు మడులు సిద్ధం చేసుకొని, నాటు వేసి.. పంట చేతికొచ్చి.. విక్రయించి చేతికి డబ్బులు వచ్చే దాక రైతుకు అన్ని కష్టాలే. కొన్ని చోట్ల ముందస్తు వరి కోతలు షురూ కాగా..మరి కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి. పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్ల పై ఎండ బెట్టారు. ధాన్యంలో తేమశాతం తగ్గేలా ఓ రైతు ధాన్యాన్ని తిరగేస్తున్న దృశ్యాన్ని ‘WAY2NEWS’ పిట్లంలో హై వే-161 వద్ద తన కెమెరాలో బంధించింది.
ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్ మండలంలో జరిగింది. ఎస్సై రంజిత్ కథనం ప్రకారం.. మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన మొగ్గం శ్రావణ్ (24) కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
కాలు జారి బావిలో పడిన వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డి మండలంలో జరిగింది. ఏఎస్ఐ లచ్చిరాం వివరాలిలా .. మండలంలోని రెడ్డి పేట గ్రామ వాసి బొల్లారం ఎల్లయ్య శుక్రవారం బావి వద్దకు స్నానానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడి గల్లంతయ్యాడు. శనివారం శవమై నీటిపై తేలాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
న్యాల్కల్ గ్రామానికి చెందిన నవీన్ (37) అనారోగ్య సమస్యలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మోపాల్ ఎస్ఐ యాదగిరి గౌడ్ శనివారం తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈనెల ఎనిమిదో తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తండ్రి దేవన్న చుట్టుపక్కల వెతకగా గ్రామ శివారులోని స్మార్ట్ సిటీ వెంచర్ ఎదురుగా ఉన్న ఒర్రెలో ఉరివేసుకొని మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రముఖ కవి, రచయిత, క్లాసిక్ సినిమా క్లబ్ వ్యవస్థాపకుడు మేక రామస్వామి(92) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కళా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆయన కవిత్వాలు, రచనలు చేశారు. సినిమా రంగంపై ఆసక్తితో క్లాసిక్ సినిమా క్లబ్ నెలకొల్పి పలు రచనలు, సినిమా ప్రదర్శనలు ప్రదర్శించారు. ఇందూర్ భారతికి సైతం ఆయన పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు కవులు రచయితలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారిలతో కలిసి ABVP నాయకుడు జితేందర్ రెడ్డి చిత్రాన్ని శనివారం నిజామాబాద్లోని ఓ థియేటర్లో జితేందర్ రెడ్డి సినిమాను చూశారు. వారితో పాటు ఆర్మూర్కి చెందిన BJP జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, BJP పట్టణ ఉపాధ్యక్షుడు ప్రకాశ్, కార్యదర్శి కిరణ్ ఉన్నారు.
బాలికను స్కూల్ టీచర్ లైంగికంగా వేధించిన ఘటన బిక్కనూర్లో వెలుగుచూసింది. ఓ పాఠశాల విద్యార్థిని మండలానికి చెందిన టీచర్ శ్రీనివాస్ లైంగికంగా వేధించాడు. కాచ్చాపూర్ ఓ మాజీ ప్రజాప్రతినిధి విషయం బయటికి రాకుండా సంధి చేశాడు. విషయం తెలుసుకున్న జిల్లా న్యాయసేవ సంస్థ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్లారెడ్డి DSP నిందితుడితో పాటు HM కాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.