Nizamabad

News July 31, 2024

NZB: జిల్లాలో పెరుగుతున్న ‘CYBER’ నేరాలు.!

image

డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2023లో 294 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో ఇప్పటికీ 44 కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని పడ్గల్‌లో ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించి రూ.95 వేలు వసూలు చేశారు. మన అప్రమత్తతే రక్ష, తెలియని వారి మాటలతో మోసపోవద్దని పోలీసులు అంటున్నారు. వారి సూచనలు పాటిస్తే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండొచ్చంటున్నారు.

News July 31, 2024

అసెంబ్లీలో ర్యాగింగ్ చేసే పరిస్థితులు: ఎమ్మెల్యే KVR

image

అసెంబ్లీలో ర్యాగింగ్ చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అభిప్రాయపడ్డారు. శాసనసభలో పద్దులపై జరుగుతున్న చర్చలో పాల్గొన్న ఆయన పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పాడి ప్రొక్యూర్ మెంట్ సరైన పద్ధతిలో జరగడం లేదని ఆక్షేపించారు. ధరణి వల్ల భూములు అటు ఇటుగా మారి ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు.

News July 31, 2024

NZB: ఆర్టీసీ రీజియన్లో ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు

image

ఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాలు ముగిసాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఆర్టీసీ నిజామాబాద్ 2వ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రీజియన్, డిపోల వారీగా డ్రైవర్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జానీ రెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు సరస్వతీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

News July 30, 2024

నిజామాబాద్ జిల్లాలో నేటి HIGHLIGHTS

image

◆NZBలో రూ. 9 కోట్ల స్కామ్.. మంత్రికి MLA లేఖ
◆కామారెడ్డిలో వ్యభిచారం ముఠా అరెస్ట్
◆నిజామాబాద్ జిల్లాలో BSNL 4G సేవలు
◆పొతంగల్‌లో దారుణ హత్య
◆రెండో విడత రుణమాఫీని స్వాగతిస్తున్నాం: కామారెడ్డి MLA
◆SRSP అప్డేట్: 12,785 క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

News July 30, 2024

SRSP అప్డేట్: 12,785 క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో తగ్గుతోంది. మంగళవారం ఉదయం10 గంటలకు 22,885 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో రాగా మధ్యాహ్నం 3 గంటలకు 17,100 క్యూసెక్కులుగా తగ్గింది. రాత్రి 9 గంటలకు మరింతగా 12,785 క్యూసెక్కులకు తగ్గింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMC లకు గాను ప్రస్తుతం 35.777 TMC ల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News July 30, 2024

తప్పు ఉంటేనే కేసులు నమోదు చేయాలి: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగన్వార్ కమిషనరేట్లో ఆర్టీసీ డ్రైవర్ల కేసులపై మంగళవారం పునర్ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఆర్టీసీ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ డ్రైవర్ల తప్పుంటే మాత్రమే వారిపై కేసులు పెట్టాలని, లేకపోతే వారిపై ఎట్టి పరిస్థితుల్లో కేసులు పెట్టరాదని స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు సీపీ సూచించారు.

News July 30, 2024

రెండో విడత రుణమాఫీని స్వాగతిస్తున్నాం: కామారెడ్డి MLA

image

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రైతు రుణమాఫీపై అసెంబ్లీలో మాట్లాడారు. రెండో విడత రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడో విడత కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. పాడి సేకరణ సరైన పద్దతిలో జరగడం లేదన్న కేవీఆర్..అందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

News July 30, 2024

పండుగ వాతావరణంలో రైతు రుణమాఫీ మలివిడత నిధుల విడుదల

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ- 2024 మలివిడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన లబ్దిదారులైన రైతులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News July 30, 2024

రుణమాఫీ కాలేదా.. ఈ నంబర్లకు కాల్ చేయండి: NZB కలెక్టర్

image

క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సహాయక కేంద్రాన్ని సంప్రదించేందుకు వీలుపడని రైతులు నేరుగా 7288894557, 7288894554 నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు.

News July 30, 2024

రాష్ట్రంలో 5, 6 స్థానాల్లో నిజామాబాద్, కామారెడ్డి

image

పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను గుర్తించి వాటిని బాధితులకు అందించడంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు రాష్ట్రంలో వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచాయి. 20 ఏప్రిల్ 2023 నుంచి 14 జులై 2024 వరకు NZB కమిషనరేట్‌లో 6,690 సెల్ ఫోన్లు పోగొట్టుకున్న కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,941 గుర్తించి 1,888 ఫోన్‌లను బాధితులకు అందించారు. కామారెడ్డి జిల్లాలో 4,917 కేసులు నమోదు కాగా 2,756 సెల్ ఫోన్లు గుర్తించారు.