Nizamabad

News July 30, 2024

నిజామాబాద్ జిల్లాలో BSNL 4G సేవలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెల రోజుల్లో BSNL సేవలు ప్రారంభిస్తామని టెలికాం GM వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రైవేటు కంపెనీల్లో ఛార్జీలు పెరగడంతో ప్రజలు BSNL వైపు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 270 టవర్లను 4Gకి మార్చనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని టవర్లు పూర్తికాగా మరికొన్నింటి పనులు కొనసాగుతున్నాయి.

News July 30, 2024

కామారెడ్డిలో వ్యభిచారం ముఠా అరెస్ట్

image

కామారెడ్డిలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలిని దేవునిపల్లి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరిని పట్టుకున్నారు. ఐదుగురిని సఖి కేంద్రానికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మిగతా ముగ్గురిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

News July 30, 2024

గాయత్రి షుగర్స్ పై విచారణ చేపట్టండి : MLA తోట

image

రైతుల పేరిట రూ.9 కోట్ల ఋణాలు తీసుకున్న నిజాంసాగర్‌లోని గాయత్రి షుగర్స్ పై విచారణ చేపట్టాలని జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశారు. సంస్థ సొంత వ్యాపారాల కోసం 1030 మంది అమాయక రైతులను మోసం చేసి రూ.9 కోట్ల ఋణం పొందింది. రైతుల హక్కులను పరిరక్షించేలా ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు చేయించాలని లేఖ ద్వారా మంత్రికి విన్నవించారు.

News July 30, 2024

కామారెడ్డి: నేడు రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

image

కామారెడ్డి జిల్లాలో రెండో విడత రుణమాఫీ 24,816 మంది రైతులకు వర్తించిందని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం రైతుల ఖాతాలో రూ.211.72 కోట్లు జమకానున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తారన్నారు.

News July 29, 2024

NZB: జిల్లాలో ఈరోజు TOP NEWS

image

* నిజామాబాద్: డయల్ 100 పై నిర్లక్ష్యం.. ఎస్ఐ అశోక్ పై వేటు
* పెద్దకొడప్గల్: 2018 నుంచి కాటేపల్లి తండాకు సర్పంచ్ లేరు
* పిట్లం: పాము కాటుకు గురై మహిళ రైతు మృతి
* నిజామాబాద్: 14.5 కిలోల వెండి ఆభరణాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
* నిజాంసాగర్: మంత్రి తుమ్మలకు జుక్కల్ ఎమ్మెల్యే లేఖ
* బిచ్కుందలో రోడ్ల కోసం మోకాళ్లపై కూర్చొని నిరసన

News July 29, 2024

NZB: నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ పై వేటు

image

డయల్ 100 కాల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిజామాబాద్ ఐదో టౌన్ ఎస్ఐ అశోక్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్ పరిధిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి 100 కాల్ రాగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీపీ గుర్తించారు. అనంతరం స్టేషన్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News July 29, 2024

వ్యక్తిగత దూషణలు సరికాదు: కామారెడ్డి ఎమ్మెల్యే

image

శాసనసభలో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం సరి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. గ్రామాలలో ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.

News July 29, 2024

రేపు రెండో విడత రైతు రుణమాఫీ విడుదల: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ రెండో విడత నిధులను ప్రభుత్వం ఈనెల 30న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధుల, రైతుల, అధికారుల సమక్షంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. రైతులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

News July 29, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ సందడి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనీ 1,373 గ్రామ పంచాయతీలో ఎన్నికల సందడి మొదలైంది. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. పాత, కొత్త లీడర్లలో ఆశలు రేకెత్తాయి. కొత్త రిజర్వేషన్లు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని అధికారులు చెప్పడంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సలహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాప కింద నీరు లాగా పంచాయతీ సందడి మొదలైంది.

News July 29, 2024

SRSP అప్డేట్: 17,310 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో మెల్లగా పెరుగుతోంది. నిన్న 24 గంటల్లో 16,840 క్యూసెక్కుల నీరు రాగా సోమవారం ఉదయం 9 గంటలకు 17,310 క్యూసెక్కులకు పెరిగింది. ఔట్ ఫ్లోగా 644 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1075.3 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.