Nizamabad

News February 22, 2025

NZB: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు అధికారులతో కలిసి వీసీ నిర్వహించారు.

News February 21, 2025

డిచ్పల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

image

డిచ్పల్లి మండలం బీబీపూర్ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. నిజామాబాద్ నగరానికి చెందిన హఫీజ్ సయ్యద్ అయుబ్, మౌలానా మొయినుద్దీన్, హఫీజ్ షాహెద్ రజా, అబ్దుల్ రెహ్మన్ ముషిరాబాద్లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వస్తుండగా బీబీపూర్ తండా వద్ద జాతీయ రహదారిపై వీరి కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనగా కారు బోల్తా పడి రెహమాన్ మృతి చెందాడు.

News February 21, 2025

ఆర్మూర్‌: ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఒకరు మృతి

image

ప్రమాదవశాత్తు డేరాకు నిప్పంటుకుని వృద్ధుడు సజీవ దహనమైన విషాద ఘటన ఆర్మూర్‌లో జరిగింది. మృతుడు సీతారామారావుగా (75) గుర్తించారు. మృతుడు కాలిన గాయాలతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. కొడుకు రామేశ్వర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News February 21, 2025

NZB: దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు అరెస్ట్

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట నిజాంసాగర్ కెనాల్ వద్ద దారిదోపిడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే బిహార్‌కు చెందిన ముగ్గురు స్థానికంగా ఉండే రైస్ మిల్లులో పనిచేస్తూ, ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News February 21, 2025

రామారెడ్డి: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రామారెడ్డి మండలంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ నరేశ్ వివరాలిలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన గుజ్జుల నవీన్ అదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికకు మొబైల్‌పై ఉన్న ఇష్టాన్ని అవకాశంగా చేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News February 21, 2025

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

image

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని శ్రీనిధి (14) గుండెపోటుతో మృతి చెందింది. ఇవాళ పాఠశాలకు బయలుదేరిన శ్రీనిధి కామారెడ్డిలో ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

News February 21, 2025

సిరికొండ: రాష్ట్ర కబడ్డి జట్టు కోచ్‌గా వినోద్ నాయక్

image

ఈ నెల 20 నుంచి 24 వరకు వికారాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు సిరికొండ మండలం చిమ్మన్ పల్లికి చెందిన వినోద్ నాయక్ జిల్లా జట్టుకు కోచ్‌గా నియమతులయ్యారు. వినోద్ నాయక్ కాకతీయ యమున క్యాంపస్‌లో కబడ్డి కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాను రాష్ట్ర పోటీలకు జిల్లా జట్టుకు కోచ్ గా ఎంపిక కావడం పట్ల డైరెక్టర్ రామోజీ, ప్రిన్సిపల్ గిరిధర్‌తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

News February 21, 2025

మాక్లూర్: కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించినTPCC చీఫ్

image

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ గౌడ్ ను TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News February 20, 2025

దళిత బంధు నిధులను విడుదల చేయాలి: MLC కవిత

image

దళితబంధు నిధులను బడ్జెట్ లోపు విడుదల చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను విడుదల చేయాలని సవాలు చేశారు.

News February 20, 2025

NZB: పంటల విక్రయాలను పర్యవేక్షించాలి: కలెక్టర్

image

ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభమైనందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ రైతుల వద్ద నుంచి పంటను సేకరించేలా చూడాలన్నారు.