India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అక్తర్ గురువారం(జనవరి 2న) నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల సభ్యులు వర్గీకరణ విషయంపై దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీకి 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలకు 4 స్థానాలకు కైవసం చేసుకుంది. బీజేపీ 3 చోట్ల గెలుపొందిందగా బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించింది. కాగా జిల్లాకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్కు పీసీసీ పదవీ వరించింది. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ, బీఆర్ఎస్ తమ వంతు ప్రయత్నం చేస్తోంది. దీనిపై మీ కామెంట్
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిట్టి పొట్టి సినిమా ను శుక్రవారం తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో తోబుట్టువుల ప్రేమ అనుబంధాలు, ఎమోషన్స్ తదితర వాటిని ఎంతో అద్భుతంగా చూపించారన్నారు. ‘ఇలాంటి సినిమాలు చాల అరుదుగా వస్తాయి. ఈ జనరేషన్ ఈ మూవీని తప్పకుండా చూడాలని’ అన్నారు. సినిమా దర్శకుడు, నిర్మాతలకు అభినందించారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
NZB ఎమ్మెల్సీ కవిత ఈనెల 29న నిజామాబాద్కు వస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. 29న ఉదయం HYD నుంచి బయలుదేరి నిజామాబాద్కు చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డిచ్పల్లి వద్ద BRS పార్టీ నాయకులు ఘన స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా సుభాశ్నగర్ SFS సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు.
బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. అంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. అలాగే జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ఆయన మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ సతీమణిని పరామర్శించారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అవుసులతండాలో మహిళను ఆమె <<14980915>>భర్త కత్తితో నరికి చంపిన<<>> విషయం తెలిసిందే. కాగా హత్యకు సంబంధించి వివరాలను ఎస్ఐ శివకుమార్ వెల్లడించారు. అవుసులతండాకు చెందిన మెగావత్ మోతిబాయి(55) పై ఆమె భర్త షేర్య కొంత కాలంగా అనుమానం పెంచుకున్నాడు. కాగా బుధవారం ఆగ్రహంతో భార్య మోతిబాయిని హత్య చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
మాజీ PM మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి, పీఎంగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి, అభివృద్ధి బాట పట్టించిన మహా ఆర్థిక మేధావి అని ‘X’ వేదికగా రాసుకొచ్చారు.
నిజామాబాద్ జిల్లాలో జల్సాలకు బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన కరిపే సుమన్ ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తాగుడుకు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో నిజామాబాద్, కోరుట్ల, నవీపేటలో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రూ.2.5 లక్షల విలువ చేసే 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ చర్చిని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె విమర్శించారు.
Sorry, no posts matched your criteria.