India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (GGH)లో అత్యధిక OP నమోదయింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ నెల 28న 2,680 మంది రోగులు GGHకి వచ్చారు. హైదరాబాద్ ఉస్మానియాలో 2,566 మంది, గాంధీలో 2,192 మంది, వరంగల్ MGMలో 2,385 మంది OPగా నమోదు చేసుకున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలోనే OP తాకిడి పెరిగినట్లు అధికారుల అంచనా.
పారా ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించిన భారత స్టార్ పార షూటర్ అవని లేఖరాకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ వేదికగా.. ఆమె బంగారం పతకంతో ఉన్న ఫోటోను జత చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్ పార ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 3 గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిందన్నారు.
* బోధన్: లాడ్జిలో యువతితో పట్టుబడ్డ కౌన్సిలర్.. బంధువుల దేహశుద్ధి
* NZB: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
* అంతరాష్ట్ర లెండి ప్రాజెక్ట్ పూర్తి చేయడంపై దృఢ సంకల్పంతో ఉన్నాం: జుక్కల్ MLA
* బాన్సువాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి బాధ్యతల స్వీకరణ
* నసురుల్లాబాద్: ఆటో, బొలెరో ఢీ.. ఒకరు మృతి
* కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
* బాన్సువాడ: అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి
బోధన్ బస్ స్టాండ్ సమీపంలోని లాడ్జిలో ఒక యువతితో బీఆర్ఎస్కి చెందిన బోధన్ మున్సిపల్ కౌన్సిలర్ను శుక్రవారం స్థానికులు పట్టుకున్నారు. దీనితో ఆ యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆ కౌన్సిలర్కు దేహశుద్ధి చేసి కౌన్సిలర్ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ నెల 7న బోధన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు మంగల్ పాడ్ వద్ద మైనర్తో పట్టుబడగా కేసు నమోదైన సంగతి తెలిసిందే.
డిచ్పల్లి మండల కేంద్రంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మండల కేంద్రంలోని సాయినగర్ లో నివాసం ఉంటున్న CRPF రిటైర్డ్ జవాన్ గబ్బర్ సింగ్ భార్య రాథోడ్ విజయ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో హెటిరో డ్రగ్స్ హైదరాబాద్ కంపెనీవారు విభాగాధిపతి డాక్టర్ ఏ నాగరాజు పర్యవేక్షణలో విద్యార్థులకు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో పలువురు విద్యార్థులు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై మౌఖిక పరీక్షకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అధ్యాపక సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎం యాదగిరి ప్రిన్సిపాల్, విభాగపు అధ్యాపకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులను రాహుల్ గాంధీతో చర్చించడానికి సీఐ ఎఫ్ఎ రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర రావు శుక్రవారం రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ కొరకు లేఖ పంపించారు. ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు పదవులపై చర్చిస్తామన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 60 టీఎంసీలకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 8,503 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా ప్రాజెక్ట్ నుంచి వివిధ కాల్వల ద్వారా 4,425 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1085.10 అడుగుల (60.118 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహశీల్దార్ లక్ష్మణ్ <<13969284>>సస్పెండ్ <<>>అయిన విషయం తెలిసిందే. వివరాలిలా.. తహశీల్దార్ డబ్బులిస్తేనే పనులు చేస్తారని రైతులు ఆరోపణతో అధికారులు విచారణ చేపట్టారు. గత శుక్రవారం ఓ రైతు వారసత్వ భూమి పట్టామార్పిడికి తహశీల్దార్ను సంప్రదిస్తే మీ సేవ వ్యక్తి మధ్యవర్తిగా రూ.12 వేలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. దీంతో విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజం కావడంతో సస్పెండ్ చేశారు.
నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఉత్తరప్రదేశ్లోని మధుర నవోదయ విద్యాలయం నుంచి తొమ్మిదో తరగతి చదివేందుకు వచ్చిన మైగ్రేషన్ విద్యార్థులను తిరిగి మధురకు పంపించారు. వాతావరణం భాష సహకరించక పోవడంతో ఏడుగురు బాలికలను, 15 మంది బాలురు లను తిరిగి మధుర నవోదయ విద్యాలయానికి పంపుతున్నట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. ఇక్కడ విద్యార్థులు అక్కడికి అక్కడ విద్యార్థులు ఎక్కడికి వెళ్లడం సహజమన్నారు.
Sorry, no posts matched your criteria.