Telangana

News May 7, 2025

NLG జిల్లాలో ఏటా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఇది ఇప్పుడు చిన్నవయసు వారిని సైతం బలితీసుకుంటుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 40 శాతం కేసులు టొబాకో రిలేటెడ్ క్యాన్సర్(టీఆర్సీ).. అంటే పొగాకు వినియోగించే వారివని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 20-25 ఏళ్ల యువతను పట్టిపీడిస్తోందంటున్నారు.

News May 7, 2025

వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఖిలా వరంగల్-42.6, ములుగు రోడ్డు-42.9, సీరోలు(MHBD)-42.4, జఫర్‌గడ్(జనగామ)-42.8, కన్నాయిగూడెం(ములుగు)-43.2, ములుగు 42.5గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చేయండి.

News May 7, 2025

నారాయణపేట: బాలికపై అత్యాచారం.. 14 రోజుల రిమాండ్

image

బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. SI బాలరాజు తెలిపిన వివరాలు.. NRPTజిల్లా కోస్గి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను వికారాబాద్ జిల్లా దోమ మండలం మల్లేపల్లి వాసి రమేశ్ ప్రేమిస్తున్నానని చెప్పి మార్చి 5న తనవెంట తీసుకెళ్లాడు. 10రోజుల తర్వాత PSకు వచ్చి తాము పెళ్లి చేసుకుంటామని చెప్పాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రమేశ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

News May 7, 2025

హైదరాబాద్‌లో పాకిస్థాన్ యువకుడి అరెస్ట్

image

ఉగ్రదాడి అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ జాతీయులను వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఇటువంటి సమయంలో పాకిస్థాన్ యువకుడు ఫయాజ్ హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యాడు. నగర యువతిని పెళ్లి చేసుకున్న ఫయాజ్ ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డాడు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

News May 7, 2025

టేకులపల్లి: అదనపు కట్నం వేధింపులతోనే దీపిక సూసైడ్

image

శుక్రవారం <<16216775>>దంపతులు<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. SI ప్రకారం.. టేకులపల్లి(M) రేగులతండా వాసి దీపిక(19), వెంకట్యాతండా వాసి శ్రీను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అత్తింటివారితో దీపికకు గొడవ జరగడంతో దంపతులు గురువారం కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగారు. కుటుంబీకులు KMM తరలించగా దీపిక చనిపోగా, శ్రీను చికిత్స పొందుతున్నాడు. అదనపు కట్నం వేధింపులతో సూసైడ్ చేసుకుందని దీపిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.

News May 7, 2025

హైదరాబాద్‌లో పాకిస్థాన్ యువకుడి అరెస్ట్

image

ఉగ్రదాడి అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ జాతీయులను వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఇటువంటి సమయంలో పాకిస్థాన్ యువకుడు ఫయాజ్ హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యాడు. నగర యువతిని పెళ్లి చేసుకున్న ఫయాజ్ ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డాడు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

News May 7, 2025

ఖమ్మం: వడదెబ్బతో పది మంది మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత వారం రోజులు 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వైరా మండలంలో 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వారంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది మంది వడదెబ్బతో మృతి చెందారు. రాబోయే మూడు రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.

News May 7, 2025

నర్సంపేట: ఒకరిపై పోక్సో కేసు నమోదు

image

వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై పోక్సో కేసు నమోదైంది. నర్సంపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఇటీవల అదే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడినందుకు ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News May 7, 2025

NLG: పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

త్రిపురారం గ్రామ శివారులోని పంట పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న వారిపై శుక్రవారం త్రిపురారం పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారయ్యారని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. గ్రామ శివారులోని పొలాల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో ఐదుగురు పారిపోయినట్లు పేర్కొన్నారు.

News May 7, 2025

నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

image

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.. శుక్రవారం మెండోరాలో 45.3℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వేల్పూర్ 45℃, నిజామాబాద్ 44.9, ముప్కాల్ 44.9, ఆర్మూర్ 44.7, నందిపేట, ఏర్గట్ల 44.5, మాగ్గిడి, ఎడపల్లి, బాల్కొండ 44.4, మక్లూర్, కమ్మర్పల్లి, మోస్రా 44.3, లక్మాపూర్, ఇస్సాపల్లి 44.2, జక్రాన్‌పల్లి 44.1, తొండకూర్ 44, పాల్దా, చిన్నమావంది, గోపన్నపల్లి, నవీపేట్ 44, రెంజల్లో 43.8℃గా నమోదైంది.