India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొండగట్టులో ఈనెల 29న అర్చకులకు సన్మానం నిర్వహించనున్నారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొండగట్టులోని బృందావనంలో సాంస్రృతిక కార్యక్రమాలు, చర్చాగోష్ఠితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలు ఆలయాల అర్చకులకు సన్మానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఎ.ఉజ్వల, కొండలరావు తెలిపారు. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.
@ రాష్ట్రస్థాయిలో జగిత్యాల కలెక్టర్కు తృతీయ బహుమతి.
@ బుగ్గారం మండలంలో చెరువులో పడి పశువుల కాపరి మృతి.
@ ధర్మారం మండలంలో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి.
@ ఇల్లంతకుంట మండలంలో కస్తూర్బా బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్.
@ మెట్పల్లిలో నిబంధనలు పాటించని పానీపూరి బండ్లకు జరిమానా.
@ ప్రవాసి ప్రజావాణి ప్రారంభించిన పొన్నం ప్రభాకర్.
❤ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
❤MBNR:30న ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ ఎంపికలు
❤దామరగిద్ద మండలంలో చిరుత సంచారం
❤డబ్బుల మూటలు సదిరెందుకే కాంగ్రెస్ హైడ్రా డ్రామాలు:DK అరుణ
❤అయిజ: టీచర్లను నియమించాలని విద్యార్థులు ఆందోళన
❤ధన్వాడ:చిరుత దాడిలో ఎద్దు మృతి
❤వనపర్తి:ఘనంగా వరల్డ్ టూరిజం డే
❤లోక్ అదాలత్ను విజయవంతం చేయండి: బార్ అసోసియేషన్
❤గండీడ్: గ్యాస్ సబ్సిడీ పత్రాలు పంపిణీ.. MLAకు ఘన సన్మానం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లోని ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారం అందించేందుకు వయాట్రిస్, HKM ఛారిటబుల్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో 312 పాఠశాలల్లోని 28వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందివ్వనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వయాట్రిస్ రూ.6.4 కోట్ల విరాళాన్ని అందజేసింది. హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థులకు అల్పాహారం అందివ్వనుంది.
ప్రవాసి ప్రజావాణి(గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం) ప్రత్యేక కౌంటర్ శుక్రవారం ప్రారంభమైంది.
రిబ్బన్ కట్ చేసి ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ను హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల, నిర్మల్ జిల్లాకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కడంపై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. కళాకారులకు, పర్యాటకశాఖ అధికారులు, సిబ్బందకి ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన నిర్మల్ కొయ్య బొమ్మలకు, పేయింటింగ్స్కు, కొల్లాపూర్లోని సోమశిలకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
నిజాంపేట మండలం చల్మెడలో తీవ్ర విషాదం నెలకొంది. జ్వరంతో అనారోగ్యానికి గురై బాలిక చనిపోయంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్మెడ గ్రామానికి చెందిన కనకరాజు లత దంపతులు కుమార్తె తనుశ్రీ(7) రెండవ తరగతి చదువుతుంది. తనుశ్రీ గురువారం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ఈరోజు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ర్యాలీని కలెక్టర్ వల్లూరు క్రాంతి జెండా ఉపి శుక్రవారం ప్రారంభించారు. వయోవృద్ధులను చేసుకోవాల్సిన బాధ్యత పిల్లలపైన ఉందని చెప్పారు. మానసికంగా, శారీరకంగా ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే జైలు శిక్ష విధిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ.. బతుకమ్మ పండుగకు ముందు 9, 5, 3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ ప్రాంతంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ.. బతుకమ్మ పండుగకు ముందు 9, 5, 3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ ప్రాంతంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.
Sorry, no posts matched your criteria.