Telangana

News August 30, 2025

NZB: 21 మండలాల్లో 41,098 ఎకరాల పంట నష్టం

image

కురిసిన వర్షాలకు నిజామాబాదు జిల్లాలోని 21 మండలాల్లో 41,098 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసిందని అధికారులు తెలిపారు. ఇందులో 14,663 మంది రైతులకు సంబంధించి 28,131 ఎకరాల వరి, 5,418 మందికి చెందిన 12,054 ఎకరాల సొయా, 382 మందికి చెందిన 565 ఎకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చామని పేర్కొన్నారు.

News August 30, 2025

రంగారెడ్డి: ఆశవర్కర్లు జ్వర సర్వే చేపట్టాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, జ్వర సర్వే చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు ప్రబలే ప్రాంతాలను గుర్తించాలని, ఫాగింగ్, రెసిడ్యుల్ స్ప్రే చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త తొలగించాలని, ఆశవర్కర్లు ప్రతిరోజు 50 ఇళ్లను సందర్శించి జ్వర సర్వే చేపట్టాలన్నారు.

News August 30, 2025

జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు బీజేపీ యత్నం

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో విజయం సాధించాలని బీజేపీ వ్యూహం పన్నుతోంది. రాష్ట్ర అద్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు ఐదుగురి సభ్యులతో మానిటరింగ్‌ కమిటీని ప్రకటించారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, ఎంపీ రఘునందన్‌రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు, HYD సెంట్రల్‌ జిల్లా మాజీ ప్రెసిడెంట్‌ గౌతమ్‌రావును నియమించారు. బూత్ కమిటీ నాయకులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నారు.

News August 30, 2025

KPHB: భర్త గొంతు కోసి.. భార్య ఆత్మహత్యాయత్నం

image

KPHB PS పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక భర్త రామకృష్ణను భార్య రమ్యకృష్ణ గొంతు కోసి.. అనంతరం తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 30, 2025

NLG: సెప్టెంబర్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

image

వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ – 2025లో పాల్గొనేందుకు SEP 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈ పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు www.skillindiadigital.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ పోటీలు యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వృత్తిపరంగా ఎదగడానికి గొప్ప అవకాశమని ఆమె పేర్కొన్నారు.

News August 30, 2025

దివంగత నేతలకు సంతాపం తెలపనున్న రాష్ట్ర శాసనసభ

image

నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విస్తృత చర్చ జరిపేందుకు ప్రభుత్వం ఈ సెషన్ ఏర్పాటు చేసింది. 3 రోజుల పాటు సభ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉ.10:30 గంటలకు ఉప్పల్ మాజీ MLA దివంగత బండారు రాజిరెడ్డి, జూబ్లీహిల్స్ MLA దివంగత మాగంటి గోపీనాథ్‌లకు సంతాపం తెలపనున్నట్లు శాసనసభ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమవనున్నాయి.

News August 30, 2025

డిఫెన్స్ భూములపై నివేదికలను అందించాలి: HYD కలెక్టర్

image

HYDలో గుర్తించిన డిఫెన్స్ భూములకు సంబంధించిన నివేదికలను వారంలోగా అందించాలని HYD కలెక్టర్ హరిచందన అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో డిఫెన్స్ భూములపై ఆమె సమీక్షించారు. ఈ భూముల్లో నిరుపేదలు నివాసముంటున్నందున ప్రభుత్వం 2002లో జారీచేసిన ఉత్తర్వుల మేరకు నివేదికలు ఇవ్వాలని, దీనిపై నివేదిక అనంతరం ల్యాండ్ వాల్యూయేషన్ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

News August 30, 2025

NLG: ఓటర్ లిస్టులో మీ వివరాలు మార్చాలా?

image

పంచాయతీ ఎన్నికల సమరానికి ఓటర్ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పొరపాట్లు ఉన్నా, కొత్తగా నమోదు చేసుకోవాలన్నా, అభ్యంతరం వ్యక్తం చేయాలన్నా MPDO, పంచాయతీ అధికారికి దరఖాస్తు ఇవ్వాలి.
→ Form-6: కొత్తగా పేరు చేర్చుకోవడానికి
→ Form-7: చెల్లని పేరు తొలగించే అభ్యంతరానికి
→ Form-8: పేరు, అడ్రస్, ఇతర కరెక్షన్స్‌కు
→ Form-8A: ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడానికి

నేడే దీనికి ఆఖరు తేది.

News August 30, 2025

హైదరాబాద్ అంటే మీకేం గుర్తొస్తుంది..!

image

విశ్వనగరంగా ఖ్యాతి గడిస్తున్న క్రమంలో HYD ఎన్నో అద్భుతాలకు నిలయమైంది. ఇదో మినీ ఇండియా. ఒక్కసారి నగరానికి వస్తే జ్ఞాపకంగా కాదు.. అందమైన అనుభూతిగా మారుతుందని ఎందరో ఖితాబిచ్చారు. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, పరిచయాలు, పురాతనకట్టడాలు, స్ట్రీట్‌ఫుడ్, షాపింగ్ సెంటర్స్, మెట్రో ఈ ప్రాంతాన్ని మరిచిపోనివ్వవు. ‘HYD’ పదం వినగానే ఒక్కొక్కరికి ఒక్కోటి గుర్తొస్తుంది. మరి మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి.

News August 30, 2025

NLG: మామ హత్య.. కోడలు, ప్రియుడికి జీవిత ఖైదు

image

మామను హత్య చేసిన కేసులో కోడలు పద్మ, ఆమె ప్రియుడు వేణుకు జీవిత ఖైదు పడినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. 2017 ఆగస్టు 3న నకిరేకల్‌ మండలం పాలెం గ్రామానికి చెందిన పద్మ, ఆమె ప్రియుడుతో ఇంట్లో ఉన్నప్పుడు మామ భిక్షమయ్య చూశాడు. ఈ విషయాన్ని తన కుమారుడికి చెబుతానన్నాడు. దీంతో ఆగ్రహించిన ఇద్దరూ భిక్షమయ్యను హత్య చేశారు. ఈ కేసులో విచారణ అనంతరం కోర్టు వారికి శిక్ష విధించిందని ఎస్పీ వెల్లడించారు.