India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.5,700 పలకగా, సూక పల్లికాయ (పచ్చిది) రూ. 6,300, పచ్చి పల్లికాయ రూ.4,350 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి నిన్నటిలాగే నేడు కూడా రూ.13,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. నేడు మార్కెట్కు పసుపు రాలేదని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా కేంద్రంలోని భద్రకాళి అమ్మవారిని టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పాల్గొన్నారు.
గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వర్చువల్ నార్కో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మిషన్ పరివర్తన్లో భాగంగా గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలన్నారు.
తాంసి మండలం వడ్డాడి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకే రూపంలో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు (కవలలు) కనిపిస్తారు. ఈ కవలల్లో ఎవరు ఎవరో అని గ్రామస్థులే కాదు తల్లిదండ్రులు కూడా గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలో 10 మందికి పైగా కవలలు ఉండటంతో వీరిని గుర్తించే విషయంలో గ్రామస్థులు తికమక పడుతుంటారు. గ్రామంలో గౌతమి-గాయత్రి, వర్షిత్-హర్షిత్, కావ్య- దివ్య, రామ్-లక్ష్మణ్ అని వారిని పలకరిస్తారు.
రాష్ట్రంలో MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో MSME పాలసీ తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ MSME పాలసీ లేదన్నారు. ఆర్థిక వ్యవస్థకు చిన్న, సూక్ష్మ పరిశ్రమలు కీలకమని చెప్పారు. భారీ పరిశ్రమలతో పాటు MSMEలకు తమ సర్కారు అనుకూల వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఉమ్మడి NZB జిల్లాలోనే కనీవినీ ఎరగని రీతిలో రికార్డ్ స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం జరిగింది. పిట్లంలోని ముకుందర్ రెడ్డి కాలనీ గణపయ్య చేతిలోని లడ్డూ.. ఏకంగా రూ.501,000 లక్షలు పలికింది. పిట్లం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సరిత, సూరత్ రెడ్డి ఈలడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది ఇక్కడి లడ్డూ 3.60 లక్షలు పలికింది. మీ గ్రామాల్లో వినాయక మండపాల్లో వేలం పలికిన లడ్డూ ధరను కామెంట్లో తెలుపండి.
పెళ్లి కావట్లేదని మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన MHBD జిల్లాలో జరిగింది. డోర్నకల్ ASI కోటేశ్వర రావు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం తోడేళ్లగూడేనికి చెందిన కళ్యాణి(21) ఏడాది క్రితం డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో కళ్యాణికి కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. వివిధ కారణాలతో కుదరట్లేదు. దీంతో మనస్తాపానికి గురై ఎలుకమందు తిని ఆత్మహత్య చేసుకుంది.
వెదురుకు ప్రపంచంలో ఎంతో గుర్తింపు ఉందని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి నిత్యావసరాలలాగే వెదురు వస్తువులు కూడా ఎంతో అవసరం అన్నారు. ఇలాంటివి తయారు చేసే కార్మికులను ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు.
రాష్టంలోని పలు దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, తదితర అంశాలపై సెక్రటేరియట్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్ రావు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
✓బండ్లగూడ జాగీర్ రిచ్మండ్ విల్లాస్లో రూ.1.87 కోట్లు
✓బాలాపూర్ గణపతి రూ.30,01,000
✓కొంపల్లి అపర్ణ మెడోస్ రూ.29.10 లక్షలు
✓శంకర్పల్లి విఠలేశ్వరుడి వద్ద రూ.12.51 లక్షలు
✓అత్తాపూర్ భక్త సమాజ్ రూ.11.16 లక్షలు
✓ఉప్పరపల్లి వీరాంజనేయాలయంలో రూ.10 లక్షలు
✓చేవెళ్ల ఖానాపూర్లో రూ.6.63 లక్షలు
✓బాచుపల్లి బడా గణేశ్ రూ.6.2 లక్షలు
✓శంకర్పల్లి పర్వేదలో రూ.4 లక్షలు
మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి
Sorry, no posts matched your criteria.