Telangana

News April 17, 2025

అమ్మాయి ఎర.. HYDలో చెత్త కల్చర్!

image

HYD పబ్బుల్లో గబ్బు కల్చర్‌ పెరుగుతోంది. యువతను ఆకర్షిస్తూ కొందరు ఈ దందాకు తెరలేపుతున్నారు. అమ్మాయిలను ఎరవేస్తున్న నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఒంటరిగా మందు తాగుదామని వస్తే యువతులతో కంపెనీ అని బిల్లులు గట్టిగానే వేస్తున్నారు. పోలీసులు చెక్ పెడుతున్నా.. ఈ తరహా ఘటనలు నగరంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక OYO హోటల్స్‌, కో-లివింగ్ కల్చర్‌ కూడా గ్రేటర్‌లో పుట్టగొడుగుల్లా విస్తరించడం గమనార్హం.

News April 17, 2025

అమ్మాయి ఎర.. HYDలో చెత్త కల్చర్!

image

HYD పబ్బుల్లో గబ్బు కల్చర్‌ పెరుగుతోంది. యువతను ఆకర్షిస్తూ కొందరు ఈ దందాకు తెరలేపుతున్నారు. అమ్మాయిలను ఎరవేస్తున్న నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఒంటరిగా మందు తాగుదామని వస్తే యువతులతో కంపెనీ అని బిల్లులు గట్టిగానే వేస్తున్నారు. పోలీసులు చెక్ పెడుతున్నా.. ఈ తరహా ఘటనలు నగరంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక OYO హోటల్స్‌, కో-లివింగ్ కల్చర్‌ కూడా గ్రేటర్‌లో పుట్టగొడుగుల్లా విస్తరించడం గమనార్హం.

News April 17, 2025

స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయండి: మేయర్

image

వేగవంతంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ఇండోర్ స్టేడియం ప్రాంతంలో సుమారు రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణ పనులను మేయర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు కొనసాగుతున్న తీరు పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం సరికాదన్నారు.

News April 17, 2025

టేక్మాల్: బైక్ యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

టేక్మాల్ మండలం లక్ష్మన్ తండాకు చెందిన పొమ్లా నాయక్ బైక్ ఢీకొని మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. టేక్మాల్‌కు చెందిన తలారి సతీశ్ తన బైక్‌తో ఎలకుర్తి గ్రామ శివారులో పొమ్లా నాయక్‌ను వెనకనుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో పొమ్లా రోడ్డుపై పడి తీవ్ర గాయాలు కావడంతో మెదక్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ దయానంద్ తెలిపారు.

News April 17, 2025

అకాల వర్షాలు.. వరంగల్‌లో నష్టపోయారా..?

image

వరంగల్ జిల్లాను ఇటీవల కురిసిన అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. కొన్ని మండలాల్లో వడగండ్ల వాన తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది. నర్సంపేట, పర్వతగిరి, నెక్కొండ, నల్లబెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మామిడి నేలరాలింది. చేతికొచ్చిన పంట మొత్తం నాశనం అయ్యిందని కొందరు రైతులు తలలు పట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. మరి మీ గ్రామంలో ఏ రైతు అయినా నష్టపోయారా.. కామెంట్ చేయండి.

News April 17, 2025

ALERT: నెత్తురోడుతున్న హైదరాబాద్!

image

HYDలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 790 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో ఏకంగా 70 మంది చనిపోవడం గమనార్హం. త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు సంబంధించిన యాక్సిడెంట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇకనైనా ట్రాఫిక్ రూల్స్ పాటించండి.
SHARE IT

News April 17, 2025

ALERT: నెత్తురోడుతున్న హైదరాబాద్!

image

HYDలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 790 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో ఏకంగా 70 మంది చనిపోవడం గమనార్హం. త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు సంబంధించిన యాక్సిడెంట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇకనైనా ట్రాఫిక్ రూల్స్ పాటించండి.
SHARE IT

News April 17, 2025

NLG: వివాహితపై హత్యాయత్నం.. 20 ఏళ్లు జైలు

image

వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ NLG జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి(M) దామెర వాసి మహేశ్ గిరిజన మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తూ 2018లో ఆమెపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఆమె నాంపల్లి PSలో ఫిర్యాదు చేయగా అప్పటి SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జి రోజారమణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

News April 17, 2025

ADB: ‘మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి’

image

జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మహిళా సంఘాల సభ్యులకు ఆడిట్ నిర్వహణ తదితరాంశాలపై శిక్షణ తరగతులను బుధవారం నిర్వహించారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పాల్గొన్న మాట్లాడారు. మహిళా సంఘాల పుస్తకాలను పారదర్శకంగా ఆడిట్ నిర్వహిస్తూ వారి బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని సూచించారు.

News April 17, 2025

గోదావరిఖని పట్టణంలో యువతి ఆత్మహత్య

image

గోదావరిఖని పవర్ హౌస్‌కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(26) ఆత్మహత్య చేసుకుంది. PG పూర్తిచేసిన ప్రత్యూష కొద్ది రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అయితే, ఇటీవల వెలువడ్డ గ్రూప్స్ ఫలితాల్లో ఉద్యోగం సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి తండ్రి విఠల్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భూమేష్ తెలిపారు.