Telangana

News June 21, 2024

HYD: ఉస్మానియా ఆసుపత్రికి త్వరలో నూతన భవనం: మంత్రి

image

ఉస్మానియా ఆసుపత్రికి త్వరలో నూతన భవనం నిర్మిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం ఆయన ఉస్మానియా ఆస్పత్రిలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉస్మానియా ఆస్పత్రి అంటే షాన్ అని ఆయన గుర్తు చేశారు. వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

News June 21, 2024

BREAKING: HYD: యువకుడి హత్య

image

HYDకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాతబస్తీ భవానీ నగర్ PS పరిధిలోని తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సల్మాన్ అనే యువకుడు కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ హత్యకు సంబంధించిన సమాచారాన్ని కర్ణాటక పోలీసులు HYDలోని కుటుంబ సభ్యులకు అందించారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

BREAKING: HYD: యువకుడి హత్య

image

HYDకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాతబస్తీ భవానీ నగర్ PS పరిధిలోని తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సల్మాన్ అనే యువకుడు కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ హత్యకు సంబంధించిన సమాచారాన్ని కర్ణాటక పోలీసులు HYDలోని కుటుంబ సభ్యులకు అందించారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. @ ఎలిగేడు మండలంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. @ ధర్మపురి మండలంలో వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి. @ కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్న జగిత్యాల ఎస్పీ.

News June 21, 2024

కేబినెట్ మీటింగ్‌లో పాల్గొన్న జిల్లా మంత్రులు

image

హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్‌లో ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుదిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రులు చర్చించారు. ప్రభుత్వ విధివిధానాలు సంబంధించి ఏ విషయమైనా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటిస్తారని సీఎం అన్నారు.

News June 21, 2024

HYD: పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు.

News June 21, 2024

HYD: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్

image

బాత్ రూమ్‌లో యువతి స్నానం చేస్తుండగా దొంగ చాటుగా వీడియో తీసిన వ్యక్తిని HYD కాచిగూడ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీనగర్ లంక లైన్‌లో నివాసం ఉంటున్న యువతి(25) తన ఇంట్లో బాత్ రూమ్‌లో స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన జెల్‌ఫేస్ (24) దొంగ చాటుగా వీడియో తీస్తుండగా ఆమె గమనించింది. అతడితో గొడవపడి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News June 21, 2024

HYD: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్

image

బాత్ రూమ్‌లో యువతి స్నానం చేస్తుండగా దొంగ చాటుగా వీడియో తీసిన వ్యక్తిని HYD కాచిగూడ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీనగర్ లంక లైన్‌లో నివాసం ఉంటున్న యువతి(25) తన ఇంట్లో బాత్ రూమ్‌లో స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన జెల్‌ఫేస్ (24) దొంగ చాటుగా వీడియో తీస్తుండగా ఆమె గమనించింది. అతడితో గొడవపడి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News June 21, 2024

స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్ ప్రవీణ్

image

నాగర్ కర్నూల్ జిల్లా మొలచింతలపల్లిలో చెంచు మహిళపై అత్యాచారం ఘటనలో బండి శివ అనే వ్యక్తి ప్రమేయం ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులు, స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో క్రైం పెరిగిపోయిందన్నారు. గువ్వల బాలరాజు, తదితరులు ఉన్నారు.

News June 21, 2024

సంగారెడ్డి: మద్యానికి బానిసై యువకుడి మృతి

image

మద్యానికి బానిసైన ఓ యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలు.. అర్బింద్ కుమార్(27) భార్య, పిల్లలతో కలిసి 3ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశం నుంచి సంగారెడ్డి సదాశివపేటకు వలస వచ్చాడు. మద్యానికి బానిసైన అతడిని తన భార్య స్వగ్రామానికి తీసుకెళ్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రాగా 4వ గేట్ సమీపంలో అర్బింద్ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు.