India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెట్పల్లి పట్టణానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బత్తిని నవదీప్ అనే యువకుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను నవదీప్ కొన్ని రోజులుగా వేధిస్తుండడంతో ఈనెల 12న బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, అతనిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. దీంతో గురువారం అతనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వివరించారు.
NZB జిల్లాలోని మంచిప్పకు చెందిన సోదరులు.. రాంరావు, ప్రకాష్ రావు, రమేష్, బల్వంత్ రావు లకు పశువులంటే ప్రాణం. అయితే వీరికి గతంలో నాలుగు వందలకు పైగా ఆవులు ఉండగా అందులో ఒక ఎద్దు ఉండేది. దాన్ని ఇంట్లో ఒకరిగా చూసుకుంటూ లక్ష్మి దేవిలా పూజించే వారు. 2007 APR 5న అది చనిపోయింది. దానిపై మమకారంతో పొలంలో విగ్రహం ఏర్పాటు చేసి వారానికోసారి పూజలు చేస్తున్నారు. APR 5న అన్నదానం చేస్తున్నారు.
పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3000 జరిమాన విధిస్తూ హనుమకొండ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామానికి చెందిన ముత్యాల హనుమంతు 2017 సెప్టెంబర్ 13న దివ్యాంగుల పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక ఆడుకుంటుండగా ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది.
తండ్రిని చంపిన కొడుకుకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బోధన్ 5వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవికుమార్ తీర్పునిచ్చారు. వర్నికి చెందిన వినోద్ తరచూ దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో 2021 జూన్లో దొంగతనాలు మానేయాలని చెప్పిన అతడి భార్యతో గొడపడ్డాడు. అడ్డువచ్చిన తండ్రిని కర్రతో కొట్టడంతో దూప్యానాయక్ మృతిచెందాడు. ఈ ఘటనపై అప్పటి SI అనిల్ రెడ్డి కేసు నమోదు చేయగా గురువారం అతడికి జైలు శిక్ష పడింది.
ప్రభుత్వ అధ్యాపకులతో నాణ్యమైన బోధన సాధ్యమవుతుంది. HYD, RR, మేడ్చల్ జిల్లాలోని 49 జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉంది. నియామకాలు చేపట్టకపోవడంతో ఏటా అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. నిధుల కొరతతో ఈ విద్యా సంవత్సరంలో నియమించలేదు. ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి ఉంటే కొంతైనా పరిష్కారం లభించేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
ప్రభుత్వ అధ్యాపకులతో నాణ్యమైన బోధన సాధ్యమవుతుంది. HYD, RR, మేడ్చల్ జిల్లాలోని 49 జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉంది. నియామకాలు చేపట్టకపోవడంతో ఏటా అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. నిధుల కొరతతో ఈ విద్యా సంవత్సరంలో నియమించలేదు. ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి ఉంటే కొంతైనా పరిష్కారం లభించేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
> బోనకల్లో సిపిఎం మండల రాజకీయ శిక్షణ తరగతులు
> తల్లాడలో కౌలు రైతు సంఘం మండల కమిటీ సమావేశం
> అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
> సత్తుపల్లిలో ఏరువాక కార్యక్రమం
> ఎమ్మెల్యే మట్ట రాగమయి పర్యటన
> ఖమ్మం జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్
> మధిరలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
> నీట్ పరీక్షను రద్దు చేయాలని కొత్తగూడెంలో ఎస్ఎఫ్ఐ నిరసన
గ్రీన్ ఫీల్డ్ హైవేలో వేంసూరు, లింగాల వద్ద ఎగ్జిట్ రోడ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు తుమ్మల ఇచ్చిన హామీ నెరవేర్చినట్లైంది. ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలన్న ప్రజల కోరిక మేరకు మంత్రి తుమ్మల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ ఎగ్జిట్స్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
ఓ బంగారు ఆభరణాల యజమానిని కత్తితో పొడిచి దోపిడీకి యత్నించిన విషయ తెలిసిందే. DCP కోటిరెడ్డి, CI సత్యనారయణ ప్రకారం.. మేడ్చల్లోని శ్రీ జగదాంబ జువెలర్స్లోకి బురఖా వేసుకొని ఒకరు, హెల్మెట్తో మరొకరు వచ్చారు. యజమాని ఛాతిలో కత్తితో పొడవగా.. పక్కనే ఉన్న అతడి కొడుకు ఇంట్లోకి పారిపోయాడు. బంగారు ఆభరణాలు, నగదు బ్యాగులో వేయాలని బెదిరించగా వారిని నెట్టేసి బయటకు పరిగెత్తి చోర్ అని అరవడంతో దుండగులు పారిపోయారు.
ఓ బంగారు ఆభరణాల యజమానిని కత్తితో పొడిచి దోపిడీకి యత్నించిన విషయ తెలిసిందే. DCP కోటిరెడ్డి, CI సత్యనారయణ ప్రకారం.. మేడ్చల్లోని శ్రీ జగదాంబ జువెలర్స్లోకి బురఖా వేసుకొని ఒకరు, హెల్మెట్తో మరొకరు వచ్చారు. యజమాని ఛాతిలో కత్తితో పొడవగా.. పక్కనే ఉన్న అతడి కొడుకు ఇంట్లోకి పారిపోయాడు. బంగారు ఆభరణాలు, నగదు బ్యాగులో వేయాలని బెదిరించగా వారిని నెట్టేసి బయటకు పరిగెత్తి చోర్ అని అరవడంతో దుండగులు పారిపోయారు.
Sorry, no posts matched your criteria.