Telangana

News September 18, 2024

దేవరకొండ: మైనారిటీ స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్

image

దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామపరిధిలో ప్రభుత్వ మైనార్టీ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అయినట్లు సమాచారం. నిన్న సాయంత్రం 6:00 గం.ల వరకు మిస్సింగ్ అయిన విద్యార్థుల ఆచూకీ కోసం స్కూల్ సిబ్బంది వెతికి ఫలితం లేకపోవడంతో.. స్కూల్ ప్రిన్సిపల్ దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News September 18, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ

image

వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీకి అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన మెదక్ ఎంపీకి స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

News September 18, 2024

నేటి నుంచి ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె బాట

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె చేయనున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, తమకు నెలసరి జీతాలు పెంచాలని, ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో తాము చనిపోతే తమ కుటుంబానికి పరిహారం అందించాలని ఆరోగ్యశ్రీ సిబ్బంది తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 94 మంది సిబ్బంది సమ్మెలో పాల్గొనున్నారు.

News September 18, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,810

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. ఈరోజు రూ.7,810కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని చెబుతున్నారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News September 18, 2024

కొత్తూరు నుంచి పుల్లూరు వరకు 37 బ్లాక్ స్పాట్లు !

image

ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారి-44 కొత్తూరు నుంచి పుల్లూరు వరకు విస్తరించి ఉంది. రహదారిపై మొత్తం 37 బ్లాక్ స్పాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందులో కేవలం 4 చోట్ల మాత్రమే వంతెనలు ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జ్ ప్రతిపాదనలు పంపారు. కానీ ఇవి కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో హైవేపై ప్రమాదాలు ఆగడం లేదు. ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను రక్షించేందుకు ట్రామా కేంద్రాలు లేవు.

News September 18, 2024

దుబ్బాక వస్త్రాలంకరణలో అయోధ్య బాల రాముడు

image

అయోధ్య బాలరాముడిని సిద్దిపేట చేనేత వస్త్రాలతో మనోహరంగా అలంకరించారు. దుబ్బాకలోని హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ తయారు చేసిన చేనేత వస్ర్తాలతో నిన్న బాల రాముడు మెరిసిపోయారు. చేనేత మగ్గాలపై 80/100 లియా లెనిని ఫ్యాబ్రిక్‌తో గల 16 మీటర్ల తెలుపు రంగు వస్ర్తాన్ని తయారు చేసి అందజేసినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బోడ శ్రీనివాస్‌ తెలిపారు.

News September 18, 2024

సిరిసిల్ల: పత్తి దిగుబడిపై దిగాలు

image

సిరిసిల్ల జిల్లాలో పత్తి పంట సాగు చేసిన రైతులు తెల్లబోతున్నారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన అధిక వర్గాలు పత్తి రైతులను పరేషాన్ చేస్తున్నాయి. భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపింది. మరోవైపు తెగుళ్లు మొదలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకులకు తెగుళ్లు సోకి ఎర్ర రంగులోకి మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కాగా, జిల్లాలో 49,332 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.

News September 18, 2024

HYDలో పెద్ద ఆఫీసులకు డిమాండ్

image

విశాలమైన ఆఫీసులకు హైదరాబాద్‌లో భారీ డిమాండ్ ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. లక్ష చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో ఉన్న వాటిని లార్జ్ ఫార్మాట్ ఆఫీసులు అంటారు. ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో (హెచ్1) 3.08 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీల జాగా అమ్ముడైంది. గతేడాది మొదటి ఆర్నెళ్లలో 1.47 మిలియన్ చదరపు అడుగులు ఉంది, లావాదేవీలలో 61% వాటా ఈ సెగ్మెంట్‌లో ఉంది.

News September 18, 2024

HYD: మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై ఎంక్వైరీ?

image

మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై సర్కారు సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది. డీమ్డ్ హోదా సీట్లు మేనేజ్‌మెంట్ కోటా సీట్లగా భర్తీ చేస్తున్నారని విద్యర్థులు, పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కాగా వైద్య కళాశాల నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దానికి అనుబంధమైన హాస్పిటల్స్ అంశంపై ఆ శాఖ మంత్రి నేడు ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు.

News September 18, 2024

పరుశురామ స్వామి కొలువై ఉన్న ఏకైక ప్రదేశం ఇదే..!

image

ఉమ్మడి జిల్లాలో పరశురాముడు కొలువై ఉన్న ఏకైక ప్రదేశం ఏది అంటే అది జోగులాంబ గద్వాలలోని జమ్మిచెడు మాత్రమే. ఇక్కడ జమ్ములమ్మ దేవస్థానానికి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. వీరంతా పక్కనే వెలిసి ఉన్న పరశురామ స్వామి ఆలయాన్ని కూడా దర్శించి మొక్కలు తీర్చుకోవడం గమనార్హం.