Telangana

News February 5, 2026

నల్గొండ: పుట్టింటికి భార్య.. యువకుడి సూసైడ్

image

తాగుడుకు బానిసై ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కట్టంగూరు(M) ఇస్మాయిల్ పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొత్త నాగరాజు (29) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తాగుడుకు బానిసయ్యాడని అతని భార్య కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News February 5, 2026

నల్గొండ: ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశాలకు ఆహ్వానం

image

ఎస్సీ స్టడీ సర్కిల్స్ ప్రవేశాలకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అధికారి శశికళ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని, మార్చి 1న నల్గొండ ఎన్జీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని, హాల్ టికెట్లను ఈ నెల 25 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News February 5, 2026

NZB: విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

image

జక్రాన్‌పల్లి మండలంలో విద్యుత్ షాక్‌కు గురై వంశీకృష్ణ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. SI మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్‌కు చెందిన వంశీకృష్ణ బైక్ పై మాక్లూర్‌లోని ముత్యంపల్లెలో గల తన భార్య వద్దకు వెళుతున్నాడు. మార్గమధ్యలో రాత్రి దారి తప్పిపోయి సికింద్రాపూర్ రంగనాయక గుట్ట వద్ద తిరుగుతుండగా జొన్న తోటకు అడవి పందుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ తీగల తగిలి మృతి చెందాడు.

News February 5, 2026

HYD: పిల్లలనూ వదలని ‘CANCER భూతం’..!

image

నగరంలోని ప్రధాన క్యాన్సర్ చికిత్స కేంద్రాల వద్ద రోజురోజుకూ క్యాన్సర్ బాధితుల క్యూ పెరుగుతోంది. 2023లో సగటున 15,000 మంది బాధితులు రేడియేషన్ థెరపీ కోసం వస్తే, 2024లో ఆ సంఖ్య 22,000కు చేరింది. ఇక 2025 అక్టోబర్ నాటికి ప్రభుత్వ దవాఖానాల్లో రిఫరల్ కేసుల సంఖ్య 3,500 దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నిలోఫర్ ఆసుపత్రిలో పిల్లల CANCER కేసులు గత ఐదేళ్లతో పోలిస్తే 12% వృద్ధి చెందడం తీవ్ర ఆందోళనకరం.

News February 5, 2026

HYD: లక్షలో 60- 75మంది చనిపోతున్నారు..!

image

<<19053952>>HYDలో CANCER వ్యాప్తి<<>> ఏటేటా పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం.. 2023లో 25000 కేసులు నమోదవ్వగా, 2024కి ఆ సంఖ్య 38000 దాటింది. 2025 అంచనా ప్రకారం ఈ సంఖ్య 45000కు చేరింది. అయితే సకాలంలో వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో ప్రతి లక్షమందిలో సగటున 60- 75మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నారు. దురదృష్టవశాత్తు నగరంలో 65%- 70% కేసులు 3, 4వ దశలోనే డిటెక్ట్ అవుతున్నాయి. ఇది అత్యంత ఆందోళనకర అంశం.

News February 5, 2026

ఖమ్మం RTA ఆఫీసులో నకిలీ ఆధార్ కార్డుల మాఫియా

image

KMM జిల్లా RTA కార్యాలయం సమీపంలోని ఏజెంట్ షాపుల కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల దందా సాగుతోంది. కొంతమంది కార్యాలయ సిబ్బంది సహకారంతో దళారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించి, ఫైనాన్స్ కట్టని వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారని సమాచారం. కీలకమైన ఆధార్ కార్డునే నకిలీగా మారుస్తున్న ఈ మాఫియాపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News February 5, 2026

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు 52 ఏళ్లు..!

image

దక్షిణ మధ్య రైల్వే(SCR)లో గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు తెలియనివారు ఉండరేమో. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును 1974లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ట్రైన్ అద్భుతమైన సేవలు అందిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేసింది. 52 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా.. రైలును ఫిబ్రవరి 2న అద్భుతంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

News February 5, 2026

‘HYDకు’ పొంచిఉన్న ‘పెను ముప్పు’..!

image

HYDను ఇప్పుడు CITY OF PEACE అని పిలవాలో లేక CANCER CAPITAL అనాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నగరంలో క్యాన్సర్ కేసులకు సంబంధించి జిల్లా గణాంకాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఒక్క మన సిటీలోనే ఏటా కొత్తగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పీల్చే గాలిలో కాలుష్యం, తాగే నీళ్లలో రసాయనాలు వెరసి భాగ్యనగరవాసులను క్యాన్సర్ మహమ్మారి కబలించేస్తోంది.

News February 5, 2026

HYD: రైలులో ప్రయాణిస్తున్నారా..? ఇలా చేయండి..!

image

రైలులో ప్రయాణిస్తున్నారా..? ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా..? వెంటనే 139కు కాల్ చేసి సమాచారం అందించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు. అంతేకాకుండా Railmadad యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. మొబైల్ పోగొట్టుకున్నా ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. అందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని DRM గోపాలకృష్ణన్ సూచించారు.

News February 5, 2026

HYD: స్వప్నపై రెండుసార్లు మర్డర్ అటెంప్ట్ చేశాడు: తల్లి

image

HYD పరిధి మొయినాబాద్(M) కేతిరెడ్డిపల్లిలో యువ లాయర్ <<19046946>>స్వప్న(34) హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. చేవెళ్ల కోర్టులో స్వప్న న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఆస్తి తగాదాలు ఉండగా ఇటీవల పొలం కొలతలు జరిగాయి. అనంతరం తిరిగి ఇంటికెళ్తుండగా అన్నతోసహా మరో ఇద్దరు కలిసి స్వప్నను గొంతు కోసి చంపారు. స్వప్నపై ఇప్పటికే రెండుసార్లు హత్యకు యత్నించాడని తల్లి వెంకటమ్మ తెలిపారు. మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.