India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డ ఘటన మహబూబ్ నగర్ పట్టణంలో జరిగింది. బొక్కలోనిపల్లికి చెందిన అజయ్ కుమార్ మహబూబ్నగర్ పట్టణంలోని కొత్త ఆర్టీవో ఆఫీస్ మైసమ్మ దేవాలయం పక్కన బైకు అదుపుతప్పి కింద పడ్డాడు. ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా EMT లక్ష్మణ్ గౌడ్, పైలెట్ కృష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాను అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ అధికారులతో యూరియా పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఎరువులను విక్రయించే డీలర్లపై గట్టి నిఘా ఏర్పాటు చేసి, వాటిని పక్కదారి మళ్లించకుండా రైతులందరికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ఎరువుల స్టాక్ ఉండి లేదని చెప్తే కఠినచర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలోనే ఘనత వహించిన గాంధీ ఆస్పత్రిలో గత 24 గంటలుగా నీరు లేక అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి గాంధీ పంప్ హౌస్లోని పంపుసెట్లు మోరాయించడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. అటు తాగునీటికి ఇటు కాలకృత్యాలకు నీరు లేక ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్లోని పేషెంట్లు వారి సహాయకులు, నర్సింగ్ సిబ్బంది నరకయాతన అనుభవించారు. పలు ఆపరేషన్లు నిలిచిపోయాయి. కాసేపటి క్రితం నీటి సరఫరాను పునరుద్ధరించారు.
రైతులకు ఎరువులను అందించకుండా వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్సు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ఎరువుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. చిన్న సన్నకారు రైతులకు ఎరువులు లేవని చెబుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నా డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
KNR జిల్లాలో పౌరహక్కుల దినోత్సవం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. ప్రతి నెల 30న జరిగే ఈ సమావేశాల గురించి ప్రజలకు తెలియజేయాలని కోరింది. సమావేశం జరిగే గ్రామం, మండలం గురించి 2 లేదా 3 రోజుల ముందు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు ప్రజలు ఈ సమావేశాలలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని SC అభివృద్ధి శాఖ DD నాగైలేశ్వర్ తెలిపారు.
మట్కా కేసులో నిందితుడిని పోలీసులు ఎనిమిదేళ్ల అనంతరం అరెస్టు చేసి రిమాండ్ కుతరలించారు. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు కథనం ప్రకారం.. ఖుర్షీద్ నగర్కు చెందిన మొహ్మద్ లతీఫ్ మట్కా నిర్వహిస్తుండగా 2018లో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో అతను పరారవ్వగా కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేయటానికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయగా శుక్రవారం వలపన్ని అదుపులోకి తీసుకున్నారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అడ్డకల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సేవలపై ఏవైనా సమస్యలు ఉంటే తాము పరిశీలిస్తామని, విధుల విభజన ప్రకారం సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులందరికీ సమానంగా సేవలందించాలన్నారు.
యూరియా కొరత వేధిస్తున్న ఈ సమయంలో భూత్పూర్లోని పంపిణీ కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడే టోకెన్లు ఇవ్వడం అక్కడే యూరియా పంపిణీ చేయడంతో ఇబ్బంది పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. టోకెన్ల కోసం గంటల తరబడి, యూరియా బస్తాల కోసం రోజుల తరబడి లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
జిల్లాలో గుర్తించిన డిఫెన్స్ ల్యాండ్స్కు సంబంధించిన నివేదికలను వారంలో అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్వాన్ MLA కౌసర్ మోహియుద్దీన్,
నాంపల్లి MLA మాజీద్ హుస్సేన్, MLC మీర్జా రహమత్ బేగ్తో కలసి ఆసిఫ్నగర్, గోల్కొండ, నాంపల్లి, షేక్పేట్లో గుర్తించిన డిఫెన్స్ భూములపై సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.