Telangana

News June 19, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా వెలుగొండలో 51.8 మి.మీ, గద్వాల జిల్లా కల్లూరు తీమాన్ దొడ్డిలో 41.5 మి.మీ, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలో 21.5 మి.మీ, నారాయణపేట జిల్లా కోటకొండలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 19, 2024

ADB: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

image

ఆదిలాబాద్‌లోని ఒక కాలనీకి చెందిన బాలిక(16)కు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేయటంతో పాటు కుటుంబీకులను సైతం బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బాలిక కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 16న ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. నిందితుడు మోరె రాజమౌళి(30)ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.

News June 19, 2024

HYD: భవారియా దోపిడీ గ్యాంగ్ హల్చల్!

image

HYDలో భవారియా దోపిడీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. వరుస చైన్ స్నాచింగ్‌లకు ముఠా పాల్పడటంతో పోలీసులకు సవాలుగా మారింది. HYDతో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే లక్ష్యంగా స్నాచింగ్‌లు చేస్తున్నారు. జవహర్‌నగర్, శామీర్ పేట, మెహిదీపట్నంలో చైన్ స్నాచింగ్‌ చేసి శివారు ప్రాంతాల్లోకి గ్యాంగ్ మకాం మార్చడంతో పోలీసులు గాలింపు చేస్తున్నారు. యూపీకి చెందిన భవారియా, ధార్ గ్యాంగ్‌ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

News June 19, 2024

HYD: భవారియా దోపిడీ గ్యాంగ్ హల్చల్!

image

HYDలో భవారియా దోపిడీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. వరుస చైన్ స్నాచింగ్‌లకు ముఠా పాల్పడటంతో పోలీసులకు సవాలుగా మారింది. HYDతో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే లక్ష్యంగా స్నాచింగ్‌లు చేస్తున్నారు. జవహర్‌నగర్, శామీర్ పేట, మెహిదీపట్నంలో చైన్ స్నాచింగ్‌ చేసి శివారు ప్రాంతాల్లోకి గ్యాంగ్ మకాం మార్చడంతో పోలీసులు గాలింపు చేస్తున్నారు. యూపీకి చెందిన భవారియా, ధార్ గ్యాంగ్‌ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

News June 19, 2024

MBNR: సివిల్ సర్వీసెస్ పరీక్షలపై ఉచిత శిక్షణ

image

సివిల్ సర్వీసెస్-2025 పరీక్ష రాసే అభ్యర్థులకు HYDలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా లాంగ్ టర్మ్ శిక్షణ అందించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి ఇందిర తెలిపారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట జిల్లాలకు చెందిన డిగ్రీ పాసై, ఆసక్తి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈనెల 19 నుంచి తమ పేర్లను www.tgbc-studycircle.cgg.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

News June 19, 2024

భూపాలపల్లి జిల్లాలో కీచక ఎస్ఐ!

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ కీచక ఎస్ఐ లైంగిక వేధింపుల ఆరోపణ వెలుగులోకి వచ్చాయి. కాటారం సబ్‌‌డివిజన్‌లోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహిళ కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించేవాడని ఆమె ఫిర్యాదు చేసింది. కాగా సదరు ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు సమాచారం. ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ డీఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

News June 19, 2024

భూపాలపల్లి జిల్లాలో కీచక ఎస్ఐ!

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ కీచక ఎస్ఐ లైంగిక వేధింపుల ఆరోపణ వెలుగులోకి వచ్చాయి. కాటారం సబ్‌‌డివిజన్‌లోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహిళ కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించేవాడని ఆమె ఫిర్యాదు చేసింది. కాగా సదరు ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు సమాచారం. ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ డీఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

News June 19, 2024

HYD నగరంలో వేగంగా ఆసుపత్రుల నిర్మాణం!

image

HYD నగరంలోని కొత్తపేట, అల్వాల్, సనత్ నగర్‌లో గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ మూడు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే.. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై భారం తగ్గనుంది. అత్యాధునిక వసతులతో, నూతన టెక్నాలజీ ఉపయోగించి రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపడుతోంది. ప్రత్యేక ఇంజినీర్ల బృందం నాణ్యతపై ఇటీవల చెకింగ్ చేసింది.

News June 19, 2024

HYD నగరంలో వేగంగా ఆసుపత్రుల నిర్మాణం!

image

HYD నగరంలోని కొత్తపేట, అల్వాల్, సనత్ నగర్‌లో గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ మూడు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే.. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై భారం తగ్గనుంది. అత్యాధునిక వసతులతో, నూతన టెక్నాలజీ ఉపయోగించి రూ.కోట్లు  వెచ్చించి ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపడుతోంది. ప్రత్యేక ఇంజినీర్ల బృందం నాణ్యతపై ఇటీవల చెకింగ్ చేసింది.

News June 19, 2024

జక్రాన్ పల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి బ్రిడ్జి NH 44 రోడ్డుపై ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాలాజీని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.