Telangana

News June 19, 2024

సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ కు ఉచిత శిక్షణకు దరఖాస్తు

image

2024-25 సంవత్సరానికై షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ హైద్రాబాద్ లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ (పదినెలలు)ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందిని రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన వారు ఆన్ లైన్ ద్వారా జూలై 10వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రాయికల్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య.
@ ఇబ్రహీంపట్నం మండలంలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య.
@ వేములవాడలో కురిసిన భారీ వర్షం.
@ కరీంనగర్ రూరల్ మండలంలో విద్యుత్ షాక్‌తో నాలుగు ఆవులు మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో మహిళా అదృశ్యం.
@ రేపు కరీంనగర్‌కు రానున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.
@ బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్.

News June 18, 2024

బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన అశోక్ కుమార్ మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.

News June 18, 2024

తెలంగాణకు BRS నాయకత్వం అవసరం: కూనంనేని

image

తెలంగాణకు BRS నాయకత్వం అవసరమని కొత్తగూడె ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బతికే ఉండాలని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో కూనంనేని మాట్లాడుతూ.. అన్ని పార్టీల సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగించాలన్నారు. ప్రభుత్వంలో భాగమైనా ఉద్యమాలు, పోరాటాలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

News June 18, 2024

HYD: 5TH ఫ్లోర్‌లో ఫ్రెండ్స్‌తో పార్టీ.. ఇంతలోనే విషాదం!

image

HYD చిలకలగూడ PS పరిధిలో ప్రమాదం జరిగింది. బంగ్లాపై నుంచి పడి ఇంటర్ స్టూడెంట్ మృతి చెందారు. SI జ్ఞానేశ్వర్​ కథనం ప్రకారం.. మెట్టుగూడకు చెందిన రాపోలు సురేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఇంటర్​ చదువుతున్న ఒక కుమారుడు రాహుల్​ (17) ఉన్నారు. రాహుల్ తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలసి భవనంపైకి వెళ్లి పార్టీ చేసుకున్నారు. ప్రమాదవశాత్తు 5వ ఫ్లోర్​ నుంచి ఒకటో ఫ్లోర్‌లో పడి​ తీవ్రగాయాలతో చనిపోయాడు. కేసు నమోదైంది.

News June 18, 2024

మెడికల్ కళాశాలలో ఉద్యోగ అవకాశాలు: వేల్పుల విజేత

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వేల్పుల విజేత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను రేపటి నుంచి 25 తేదీ వరకు పాల్వంచ కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తులను https://kothagudem.telangana.gov.in/ వెబ్ సైట్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

News June 18, 2024

HYD: 5TH ఫ్లోర్‌లో ఫ్రెండ్స్‌తో పార్టీ.. ఇంతలోనే విషాదం!

image

HYD చిలకలగూడ PS పరిధిలో ప్రమాదం జరిగింది. బంగ్లాపై నుంచి పడి ఇంటర్ స్టూడెంట్ మృతి చెందారు. SI జ్ఞానేశ్వర్​ కథనం ప్రకారం.. మెట్టుగూడకు చెందిన రాపోలు సురేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఇంటర్​ చదువుతున్న ఒక కుమారుడు రాహుల్​ (17) ఉన్నారు. రాహుల్ తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలసి భవనంపైకి వెళ్లి పార్టీ చేసుకున్నారు. ప్రమాదవశాత్తు 5వ ఫ్లోర్​ నుంచి ఒకటో ఫ్లోర్‌లో పడి​ తీవ్రగాయాలతో చనిపోయాడు. కేసు నమోదైంది.

News June 18, 2024

రేపు కరీంనగర్‌కు బండి సంజయ్

image

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కరీంనగర్ రానున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికేందుకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈనెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 23న ఢిల్లీ పయనమమవుతారు.

News June 18, 2024

మాల్దీవులలో ప్రమాదవశాత్తు నారాయణపూర్ వాసి మృతి

image

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య(55) ప్రమాదవశాత్తు మాల్దీవుల్లో పని చేస్తూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. కుటుంబీకుల ప్రకారం.. జీవనోపాధి కోసం బొంబాయిలోని ఓ కంపెనీలో పనిచేస్తూ కంపెనీ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా మాల్దీవులకు తీసుకెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తుండగా రెండు క్రేన్ల మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు.

News June 18, 2024

కామారెడ్డి: ఇంట్లో గొడవ.. అడ్డొచ్చిన పక్కింటి మహిళ హత్య

image

కామారెడ్డి మండలం తిమ్మక్‌‌పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో శేఖర్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. గొడవను అడ్డుకోవడానికి ఇంటి పక్కన గల నారాయణ, లక్ష్మి, రాజు అనే వ్యక్తులు వెళ్లారు. గొడవని అడ్డుకునేందుంకు‌ ప్రయత్నించిన లక్ష్మి అనే మహిళ తలపై శేఖర్ కోపంతో ఇటుకతో దాడి చేశారు. తలకి తీవ్రంగా తలగడంతో లక్ష్మి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.