Telangana

News September 18, 2024

NZB: ఈ నెల 19న సర్టిఫికేట్ పరిశీలన

image

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో మిగిలిన PGCRT, CRT, PETలతో పాటు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో CRT ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు NZB జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు deonizamabad.in వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాతాలో పేరున్న అభ్యర్థులు ఈ నెల 19న కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయానికి సర్టిఫికేట్ పరిశీలనకు రావాలన్నారు.

News September 18, 2024

HYD: రాత్రంతా ఆగని శానిటేషన్!

image

ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్ చెరువు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి సమయంలోను శానిటేషన్ పనులు కొనసాగాయి. అర్ధరాత్రిలో విధులు నిర్వహించిన బృందాలను కమిషనర్ ఆమ్రపాలి కాటా ప్రత్యేకంగా అభినందించారు. సరూర్‌నగర్ ప్రాంతాల్లో నిమజ్జనాలు సజావుగా సాగినట్లుగా సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ సుజాత పేర్కొన్నారు.

News September 18, 2024

నేడు జమ్మికుంటకు మహేశ్ గౌడ్‌

image

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ హనుమకొండ, జమ్మికుంట పట్టణాల్లో పర్యటించనున్నట్లు తన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. టిపిసిసి అధ్యక్షులు మహేశ్ గౌడ్‌తో కలిసి 12 గంటలకు భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 2 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించే ధర్నాలో పాల్గొంటారు. 3 గంటలకు సమ్మిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

News September 18, 2024

శ్రీశైలంలో నీటిమట్టం 881.7 అడుగులు

image

ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల నుంచి మొత్తం 40,949 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 37,116 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,755 మొత్తం 67,871 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయంలో మంగళవారం నీటిమట్టం 881.7 అడుగుల వద్ద 197.4616 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

News September 18, 2024

సంగారెడ్డి: టీవీ చూద్దామని పిలిచి.. చిన్నారిపై అత్యాచారం

image

చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి(7)ని టీవీ చూద్దామని ఇంటి పక్కన ఉన్న యువకుడు (18) ఇంట్లోకి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి ఇంటికి వచ్చే సరికి చిన్నారి తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు ఫైల్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News September 18, 2024

ఖమ్మం: మిర్చి @ రూ.20,000

image

వరుస సెలవుల అనంతరం బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. బుధవారం మార్కెట్లో మిర్చి ధర క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ కు తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి క్రయవిక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

News September 18, 2024

గద్వాల: అమ్మమ్మ మరణంతో అనాథలైన చిన్నారులు

image

అమ్మమ్మ మరణంతో చిన్నారులు అనాథలయ్యారు. వడ్డేపల్లి శాంతినగర్ చెందిన కృష్ణవేణికి ఉదయ్ కౌసిక్(11), భానుప్రకాష్(10) ఇద్దరు పిల్లలు. పిల్లల చిన్నతనంలోనే భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడ్డ కృష్ణవేణి అనారోగ్యంతో చనిపోగా తాజాగా.. ఆమె తల్లి జయమ్మ మృతితో పిల్లలు అనాథలయ్యారు. కాగా వారిని ఆస్తిని కాపాడి చిన్నారులను ఆదుకోవాలని అధికారులను స్థానికులు కోరారు.

News September 18, 2024

ఉమ్మడి జిల్లాలో వేరుశనగ సాగుకు రైతులు సన్నద్ధం !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురవడంతో ఈ ఏడాది 2.60 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా NGKL జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో ఆ తరువాత వనపర్తి జిల్లాలో 40 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

News September 18, 2024

HYD: ఇబ్బందులు లేవు జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చు: సీపీ

image

HYD సిటీ కమిషనర్ CV ఆనంద్ రంగంలోకి దిగారు. గణపతి నిమజ్జన చివరి ఘట్టం నేడు ఉదయం MJ మార్కెట్ రోడ్డుకు చేరుకుంది. ఎంజీ మార్కెట్ సహా, ట్యాంక్ బండ్ పరిసరాల పరిస్థితులను సీపీ పరిశీలించారు. కేవలం కొన్ని వాహనాలు మాత్రమే అప్రోచ్ రోడ్లలో ఉన్నాయని, తక్కువ సమయంలో నిమజ్జనం ముగుస్తుందని, జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చన్నారు. గతం కంటే ఈసారి ఉదయం 5 గంటలకు, పరిస్థితి చాలా మెరుగుగా ఉందని అభిప్రాయపడ్డారు.

News September 18, 2024

HYD: ఇబ్బందులు లేవు జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చు: సీపీ

image

HYD సిటీ కమిషనర్ CV ఆనంద్ రంగంలోకి దిగారు. గణపతి నిమజ్జన చివరి ఘట్టం నేడు ఉదయం MJ మార్కెట్ రోడ్డుకు చేరుకుంది. ఎంజీ మార్కెట్ సహా, ట్యాంక్ బండ్ పరిసరాల పరిస్థితులను సీపీ పరిశీలించారు. కేవలం కొన్ని వాహనాలు మాత్రమే అప్రోచ్ రోడ్లలో ఉన్నాయని, తక్కువ సమయంలో నిమజ్జనం ముగుస్తుందని, జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చన్నారు. గతం కంటే ఈసారి ఉదయం 5 గంటలకు, పరిస్థితి చాలా మెరుగుగా ఉందని అభిప్రాయపడ్డారు.